రెబల్ స్టార్ ఓటీటీలోకి వస్తుంటే సర్వర్లు డౌన్ అవుతున్నాయట.. జియోహాట్స్టార్ పోస్ట్ వైరల్
రెబల్ స్టార్ ప్రభాస్ ఓటీటీలోకి అడుగుపెడుతుంటే జియోహాట్స్టార్ సర్వర్లు డౌన్ అవుతున్నాయట. మూవీ డిజిటల్ ప్రీమియర్ కు టైమ్ దగ్గరపడుతున్న కొద్దీ ఈ ఓటీటీకి ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతున్నట్లు చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. దీంతో జియోహాట్స్టార్ గంట గంటకూ ఓ పోస్ట్ తో సోషల్ మీడియాలో మూవీ హైప్ ను పెంచేస్తోంది. థియేటర్లలో దారుణంగా బోల్తా పడినా ఈ మూవీ కోసం ఓటీటీ ప్రేక్షకులు మాత్రం ఎంతలా ఎదురు చూస్తున్నారో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.

ది రాజా సాబ్ వచ్చేస్తున్నాడు
సంక్రాంతి సందర్భంగా భారీ అంచనాల మధ్య రిలీజై బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడిన ప్రభాస్ హారర్ కామెడీ మూవీ ది రాజా సాబ్. జనవరి 9న థియేటర్లలో రిలీజ్ కాగా నెల రోజుల్లోపే అంటే శుక్రవారం (ఫిబ్రవరి 6) నుంచి ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ప్రభాస్ రేంజ్, సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో చాలా త్వరగానే డిజిటల్ ప్రీమియర్ అవుతుందని చెప్పొచ్చు.
దీంతో సినిమా కోసం ఫ్యాన్స్ ఆతృత మరింత పెరిగిపోయింది. ఎంతలా అంటే మూవీ కోసం జియోహాట్స్టార్ ఏర్పాటు చేసిన ‘రిమైండ్ మి’ బటన్ ను తెగ నొక్కేస్తున్నారట. ఒక్కసారిగా ఈ ప్లాట్ఫామ్ పైకి ట్రాఫిక్ పెరిగిపోతోందట. ఇదే విషయాన్ని జియోహాట్స్టార్ వెల్లడిస్తూ.. పెరుగుతున్న డిమాండ్ కు తగినట్లుగా తమ సర్వర్లను అప్గ్రేడ్ చేసినట్లు ట్వీట్ చేసింది. ఇప్పుడీ పోస్ట్ వైరల్ అవుతోంది.
రాజా సాబ్ ఎక్స్టెండెడ్ కట్
రాజా సాబ్ మూవీపై ఓటీటీ ప్రేక్షకుల్లో ఇంతలా ఆసక్తి పెరగడానికి మరో కారణం ఈ సినిమా ఎక్స్టెండెడ్ కట్ రాబోతోంది. థియేటర్లలో డిలీట్ చేసిన సీన్లను కూడా ఓటీటీలో చూపించబోతున్నారు. దీంతో ఫుల్ మూవీ కోసం ఫ్యాన్స్ వేచి చూడలేకపోతున్నారు. ఇది చాలదన్నట్లు జియోహాట్స్టార్ కూడా ప్రతి గంట కౌంట్ డౌన్ మొదలుపెట్టింది. గురువారం (ఫిబ్రవరి 5) ఉదయం నుంచే ఎక్స్ అకౌంట్లో ఈ హంగామా మొదలైంది.
మరోవైపు భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా నెగటివ్ టాక్ కారణంగా నిర్మాతలకు భారీ నష్టాలనే మిగిల్చిన విషయం తెలిసిందే. రిలీజ్ కు ముందు మూవీ గురించి గొప్పగా మాట్లాడిన డైరెక్టర్ మారుతికి కూడా ట్రోలింగ్ తప్పలేదు. మరి ఓటీటీలోకి వచ్చిన తర్వాత రాజా సాబ్ ఎలాంటి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


