సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) చుట్టూ నెలకొన్న వివాదాల నేపథ్యంలో సీనియర్ నటుడు, రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వ్యక్తీకరణ స్వేచ్ఛ, సినీ పరిశ్రమలో సెన్సార్ ప్రక్రియపై విస్తృతమైన ఆందోళనలను వ్యక్తం చేశారు. ఏ సంస్థ లేదా నిర్దిష్ట సినిమా పేరును ప్రస్తావించకుండా కమల్ హాసన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అయితే ఇటీవల జన నాయగన్ సెన్సార్ ఇష్యూపైనా ఆయన స్పందించారని అర్థమవుతోంది.
కమల్ హాసన్ పోస్ట్

"భారత రాజ్యాంగం హేతుబద్ధతతో కూడిన వ్యక్తీకరణ స్వేచ్ఛకు హామీ ఇస్తుంది. పారదర్శకత ఎన్నడూ తగ్గదు. ఇది కేవలం సినిమా గురించి మాత్రమే కాదు. అంతకంటే పెద్దది. ఇది రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో మనం కళలకు, కళాకారులకు ఇచ్చే గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది. ఆ విలువ లేకుండా పోతుంది. సినిమా కేవలం వ్యక్తి కృషి మాత్రమే కాదు.. రచయితలు, సాంకేతిక నిపుణులు, నటులు, ప్రదర్శకులు, చిన్న వ్యాపారాల సమష్టి కృషి. వీరి జీవనోపాధి న్యాయమైన, సకాలంలో జరిగే ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది" అని కమల్ హాసన్ ఫైర్ అయ్యారు.
సెన్సార్ ప్రక్రియ
ఈ విధమైన సెన్సార్ ప్రక్రియలు సృజనాత్మకతను అడ్డుకుంటాయని, సినీ పర్యావరణ వ్యవస్థలో జీవనోపాధిని దెబ్బతీస్తాయని నటుడు కమల్ హాసన్ స్పష్టం చేశారు. "స్పష్టత లేనప్పుడు, సృజనాత్మకత పరిమితం అవుతుంది. ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతింటాయి, ప్రజల విశ్వాసం బలహీనపడుతుంది. తమిళనాడు, భారతదేశ సినిమా ప్రియులు కళలకు అభిరుచి, వివేచన, పరిణితిని తీసుకువస్తారు. వారు గౌరవానికి అర్హులు’’ అని కమల్ హాసన్ పేర్కొన్నారు.
అందరూ ఏకమై
‘‘ఇప్పుడు కావాల్సింది ఏమిటంటే.. సర్టిఫికేషన్ ప్రక్రియలపై సూత్రప్రాయమైన పునఃపరిశీలన, సర్టిఫికేషన్ కోసం నిర్దిష్ట కాలపరిమితులు, పారదర్శక మూల్యాంకనం. సూచించిన కట్ లేదా ఎడిట్కు రాతపూర్వక, హేతుబద్ధమైన సమర్థన. ఇప్పుడు సినీ పరిశ్రమ ఏకమై ఈ పద్ధతిపై చర్చించాలి" అని కమల్ హాసన్ పోస్టు చేశారు.
జన నాయగన్
తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి చివరి సినిమా జన నాయగన్. నిజానికి ఇది జనవరి 9న రిలీజ్ కావాల్సింది. కానీ సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వలేదు. దీంతో మూవీ మేకర్స్ మద్రాస్ హైకోర్టుకు వెళ్లారు. సింగిల్ డివిజన్ బెంచ్ జనవరి 9న తీర్పునిచ్చింది. జన నాయగన్ మూవీకి యూ/ఏ సర్టిఫికేట్ ఇవ్వాలని ఆదేశించింది. కానీ సెన్సార్ బోర్డు ఈ తీర్పును అప్పీల్ చేయడంతో మళ్లీ పై స్టే పడింది.
{{/usCountry}}తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి చివరి సినిమా జన నాయగన్. నిజానికి ఇది జనవరి 9న రిలీజ్ కావాల్సింది. కానీ సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వలేదు. దీంతో మూవీ మేకర్స్ మద్రాస్ హైకోర్టుకు వెళ్లారు. సింగిల్ డివిజన్ బెంచ్ జనవరి 9న తీర్పునిచ్చింది. జన నాయగన్ మూవీకి యూ/ఏ సర్టిఫికేట్ ఇవ్వాలని ఆదేశించింది. కానీ సెన్సార్ బోర్డు ఈ తీర్పును అప్పీల్ చేయడంతో మళ్లీ పై స్టే పడింది.
{{/usCountry}}