బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తున్న 'ధురంధర్ 2: ది రివెంజ్' చిత్రానికి అన్ని వర్గాల నుండి ప్రశంసలు అందుతున్నాయి. ఇప్పటికే రాజమౌళి, రామ్ చరణ్, మహేష్ బాబు వంటి దిగ్గజాలు ఈ సినిమాను కొనియాడగా, తాజాగా బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ ఈ చిత్రంపై తనదైన శైలిలో స్పందించారు. శనివారం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక సుదీర్ఘ సందేశాన్ని పంచుకుంటూ, దర్శకుడు ఆదిత్య ధర్ ప్రతిభను ఆకాశానికెత్తారు.
సూపర్ స్టార్ డైరెక్టర్ ఆదిత్య ధర్

కంగనా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఇలా రాసుకొచ్చారు. "'ధురంధర్' విజయంలో గొప్ప విషయం ఏమిటంటే, ఒక సూపర్ స్టార్ డైరెక్టర్గా ఆదిత్య ధర్ స్థిరపడ్డారు.
హాలీవుడ్లో స్పీల్ బర్గ్, టరాన్టినో, నోలన్ వంటి దర్శకులు అక్కడి సూపర్ స్టార్ నటుల కంటే చాలా గొప్పవారు. కానీ మన దేశంలో ఫిల్మ్ మేకర్స్ కు తగినంత గౌరవం లేదా గుర్తింపు ఇవ్వడం లేదు. అందుకే ఎవరైనా సరే నటులు కావాలని కోరుకుంటున్నారే తప్పా ఫిల్మ్ మేకర్స్ కావాలని అనుకోవడం లేదు" అని కంగనా పోస్టు చేసింది.
వేధింపులు
‘‘మన పరిశ్రమలో దర్శకులు ఎంతో కష్టపడుతున్నా, తక్కువ వేతనంతో పనిచేస్తూ హీరోల చేతిలో వేధింపులకు గురవుతున్నారు. కానీ ఇప్పుడు ఆదిత్య ధర్ వంటి మేకర్స్ హీరోల కంటే ఎక్కువగా వెలిగిపోతున్నారు. యువత ఆయనను చూసి స్ఫూర్తి పొందాలి. సెల్యూట్ సార్’’ అని కంగనా రనౌత్ తన స్టోరీలో రాసుకొచ్చింది.
బాక్సాఫీస్ రికార్డుల వేట!
రణ్వీర్ సింగ్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ తదితరులు నటించిన స్పై థ్రిల్లర్ ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద ఊహకందని వసూళ్లను సాధిస్తోంది. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.240 కోట్లు రాబట్టింది. రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఆ కలెక్షన్లు రూ.370 కోట్లు దాటాయి. ఈ క్రమంలో హృతిక్ రోషన్ 'వార్ 2' లైఫ్ టైమ్ కలెక్షన్లను కూడా 'ధురంధర్ 2' అధిగమించడం విశేషం.
ధురంధర్ 2 గురించి
{{/usCountry}}రణ్వీర్ సింగ్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ తదితరులు నటించిన స్పై థ్రిల్లర్ ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద ఊహకందని వసూళ్లను సాధిస్తోంది. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.240 కోట్లు రాబట్టింది. రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఆ కలెక్షన్లు రూ.370 కోట్లు దాటాయి. ఈ క్రమంలో హృతిక్ రోషన్ 'వార్ 2' లైఫ్ టైమ్ కలెక్షన్లను కూడా 'ధురంధర్ 2' అధిగమించడం విశేషం.
ధురంధర్ 2 గురించి
{{/usCountry}}ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ధురంధర్ 2 ఓ స్పై థ్రిల్లర్. ఇది మార్చి 19, 2026న రిలీజైంది. బ్లాక్ బస్టర్ మూవీ ధురంధర్ కు ఇది సీక్వెల్. పాకిస్థాన్లో ఉగ్రవాద నెట్వర్క్ను నిర్మూలించే గూఢచారిగా రణ్వీర్ సింగ్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
బాలీవుడ్ ఫిల్మ్ మేకర్, హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ సైతం ధురంధర్ 2 సినిమాను "సినిమా నిర్మాణంలో ఒక కొత్త శకం" అని అభివర్ణించారు. ఆదిత్య ధర్ విజన్ భారతీయ సినిమాను మరో మెట్టు ఎక్కించిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.