ఓటీటీలో డిఫరెంట్ స్టోరీ కాన్సెప్ట్ తో వచ్చే సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. ఇప్పుడు అలాంటి భిన్నమైన కథాంశంతో తెరకెక్కిన కన్నడ ఫాంటసీ థ్రిల్లర్ ‘45’ సినిమా ఓటీటీలో తెలుగులో వచ్చింది. ఇవాళ (జనవరి 30) నుంచి తెలుగులో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది ఈ కన్నడ సినిమా. ఇందులో శివ రాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి లాంటి స్టార్లు నటించారు.
45 ఓటీటీ

45 రోజుల కర్మ ఫలం అనుభవించాలనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన మూవీ ‘45’. ఇది ఓటీటీలో అదరగొడుతోంది. ఈ రోజు నుంచి జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్ లో కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ ఫాంటసీ థ్రిల్లర్ 45 సినిమా.
థియేటర్ రెస్పాన్స్
భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా డిసెంబర్ 25, 2025న రిలీజైంది 45 మూవీ. ఈ సినిమా రూ.50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. అయితే బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. చివరకు రూ.20 కోట్ల వసూళ్లతో సరిపెట్టుకుంది. ఇప్పుడు ఓటీటీలో ఆడియన్స్ ను అలరించేందుకు తెలుగులోనూ వచ్చేసింది. ఈ మూవీతోనే మ్యూజిక్ డైరెక్టర్ అయిన అర్జున్ జన్య సినిమా డైరెక్టర్ గా డెబ్యూ ఇచ్చాడు.
45 మూవీ స్టోరీ
45 అనే నంబర్ కు, మనిషి మెదడుకు, విశ్వానికి ఉన్న సంబంధాన్ని చూపించే ప్రయత్నమే ఈ ‘45’ సినిమా. ఇందులో వినయ్ (రాజ్ బి.శెట్టి) ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా నటించాడు. అతను వర్క్ ప్రెషర్ తో ఉంటాడు. ఓ రోజు ట్రాఫిక్ లో సిగ్నల్ జంప్ చేసి రోసీ అనే ఓ నల్లటి కుక్కను బైక్ తో ఢీకొట్టి చంపేస్తాడు.
కుక్కను తల్లిలా
ఆ కుక్క గ్యాంగ్ స్టర్ రాయప్ప (ఉపేంద్ర)ది. అతను ఆ కుక్కను తన తల్లిలా భావిస్తాడు. ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. అలాంటి కుక్కను చంపిన వినయ్ పై రాయప్ప సీరియస్ అవుతాడు. అయితే చంపకుండా 45 రోజుల పాటు చావు భయంతో బతకాలని గడువు ఇస్తాడు.
{{/usCountry}}ఆ కుక్క గ్యాంగ్ స్టర్ రాయప్ప (ఉపేంద్ర)ది. అతను ఆ కుక్కను తన తల్లిలా భావిస్తాడు. ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. అలాంటి కుక్కను చంపిన వినయ్ పై రాయప్ప సీరియస్ అవుతాడు. అయితే చంపకుండా 45 రోజుల పాటు చావు భయంతో బతకాలని గడువు ఇస్తాడు.
{{/usCountry}}గరుడ పురాణం ప్రకారం ఓ వ్యక్తి మరణించిన తర్వాత అతని ఆత్మ తన ప్రయాణాన్ని పూర్తి చేయడం కోసం 45 రోజులు పడుతుంది. అందుకే 45 రోజుల్లోపు వినయ్ తన తప్పును తెలుసుకోవాలని రాయప్ప చెప్తాడు. ఆ సమయంలో ఆధ్యాత్మిక గురువు శివప్ప (శివరాజ్ కుమార్) వినయ్ కు అండగా నిలుస్తాడు.
అయితే వినయ్ కు కొన్ని సంఘటనలు ముందే తెలుస్తాయి. అతను ప్రాణభయంతో వణికిపోతాడు. చివరకు రాయప్ప యమధర్మరాజులా కనిపిస్తాడు. మరి రాయప్ప, శివప్ప మధ్య ఏం జరిగింది? వినయ్ తన కర్మ ఫలాన్ని అనుభవించాడా? అన్నది 45 సినిమాలో చూడాల్సిందే.