'కాంతార' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటి సప్తమి గౌడ తాజాగా ఒక సామాజిక అంశంపై గళం విప్పింది. సినిమా ఫంక్షన్లు లేదా పబ్లిక్ ఈవెంట్లలో ఫోటోగ్రాఫర్లు, కెమెరా ఆపరేటర్లు హీరోయిన్లు, ఇతర నటీమణుల పట్ల ప్రవర్తిస్తున్న తీరును ఆమె తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక సుదీర్ఘమైన పోస్ట్ను షేర్ చేసింది.
అసభ్యకరమైన జూమ్-ఇన్స్ వద్దు

కాంతార మూవీ ఫేమ్ సప్తమి గౌడ లేటెస్ట్ ఇన్స్టా పోస్ట్ వైరల్ అవుతోంది. ఇది ఇండస్ట్రీలోని హీరోయిన్లు, ఇతర నటీమణులందరి సమస్య అని ఆమె చెబుతోంది. ఈవెంట్లలో తమ బాడీ పార్ట్లనే లక్ష్యంగా చేసుకొని కెమెరామెన్ అవసరం లేని జూమ్ ఇన్స్ చేస్తున్నారని ఆమె మండిపడింది.
"చిత్ర పరిశ్రమలోని మహిళలందరి తరపున నేను ఈ విషయాన్ని మాట్లాడుతున్నాను. పబ్లిక్ ఈవెంట్లలో మా పనిని కాకుండా, మా శరీర భాగాలపై అసంబద్ధంగా జూమ్ చేస్తూ ఫోటోలు, వీడియోలు తీస్తున్నారు. ఇది చాలా అసౌకర్యంగా ఉండటమే కాకుండా.. మమ్మల్ని అవమానించడమే అవుతుంది. కొంతమంది వ్యక్తులు చేస్తున్న ఇటువంటి పనులు ఏమాత్రం సహించరానివి" అని సప్తమి స్పష్టం చేసింది.
మేము ఇక్కడ ఉన్నది నటన కోసం
"మేము ఇక్కడ ఉన్నది మా వృత్తి కోసం, మా నటన కోసం. గౌరవప్రదమైన హద్దులను దాటి ప్రవర్తించడం సభ్యత అనిపించుకోదు. ఇది మా హుందాతనాన్ని దెబ్బతీసే చర్య. మీడియా మిత్రులు ప్రొఫెషనలిజం పాటించాలని, కనీస గౌరవం ఇవ్వాలని మేము ఆశిస్తున్నాము" అని ఆమె తన నోట్లో స్పష్టం చేసింది. దీనికి 'నటీనటులం.. వస్తువులం కాదు' (Actors not objects) అనే క్యాప్షన్ను జతచేసింది.
ఈ సమస్య ఇప్పటిది కాదు
సప్తమి కంటే ముందు జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, నోరా ఫతేహి వంటి తారలు కూడా పాపరాజీల తీరును తప్పుబట్టారు. డ్రెస్సులను, నడకను అసభ్యకరంగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో వ్యూస్ కోసం వాడుకోవడం పట్ల వారు గతంలోనే ఆందోళన వ్యక్తం చేశారు. సప్తమి గౌడ తాజాగా ఈ అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చి, మహిళా నటీమణులందరూ ఈ విషయంలో ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చింది.
{{/usCountry}}సప్తమి కంటే ముందు జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, నోరా ఫతేహి వంటి తారలు కూడా పాపరాజీల తీరును తప్పుబట్టారు. డ్రెస్సులను, నడకను అసభ్యకరంగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో వ్యూస్ కోసం వాడుకోవడం పట్ల వారు గతంలోనే ఆందోళన వ్యక్తం చేశారు. సప్తమి గౌడ తాజాగా ఈ అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చి, మహిళా నటీమణులందరూ ఈ విషయంలో ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చింది.
{{/usCountry}}సప్తమి గౌడ 'పాప్కార్న్ మంకీ టైగర్' సినిమాతో కెరీర్ ప్రారంభించి, 'కాంతార'తో స్టార్డమ్ సొంతం చేసుకుంది. ఇటీవల ఆమె వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన 'ది వ్యాక్సిన్ వార్', కన్నడ మూవీ 'యువ'లో నటించింది. ఆమె లేటెస్ట్ మూవీ 'ది రైజ్ ఆఫ్ అశోక' బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది.