కాంతార వివాదం- కర్ణాటక హైకోర్టుకు ధురంధర్ హీరో రణ్‌వీర్- దైవాలను ప్రశంసించారంటూ పిటిషన్- ఘాటుగా స్పందించిన హైకోర్టు!

రిషబ్ శెట్టి కాంతార సినిమాలోని దైవత్వంపై హావభావాలను అనుకరించినందుకు తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేశారు. రణ్‌వీర్ సింగ్ చేసింది మిమిక్రీ కాదని, దైవత్వాని పొగిడారని హీరో లాయర్ పేర్కొన్నారు. ఈ కేసు ఇవాళ విచారణ కానుంది. 

Feb 24, 2026, 11:58:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ చుట్టూ ఇప్పుడు చట్టపరమైన చిక్కులు ముసురుకున్నాయి. కన్నడ బ్లాక్ బస్టర్ హిట్ ‘కాంతార’ (Kantara) సినిమాలోని కొన్ని సన్నివేశాలను, ముఖ్యంగా దైవానికి సంబంధించిన హావభావాలను అనుకరించడం (Mimicry) ఆయనను ఇబ్బందుల్లోకి నెట్టింది.

కాంతార వివాదం- కర్ణాటక హైకోర్టుకు ధురంధర్ హీరో రణ్‌వీర్- దైవాలను ప్రశంసించారంటూ పిటిషన్- ఘాటుగా స్పందించిన హైకోర్టు!
కాంతార వివాదం- కర్ణాటక హైకోర్టుకు ధురంధర్ హీరో రణ్‌వీర్- దైవాలను ప్రశంసించారంటూ పిటిషన్- ఘాటుగా స్పందించిన హైకోర్టు!

తనపై నమోదైన ఎఫ్ఐఆర్ (FIR)ను సవాలు చేస్తూ రణ్‌వీర్ సింగ్ ఇటీవల కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం (ఫిబ్రవరి 23) విచారణకు వచ్చిన ఈ పిటిషన్‌ను కోర్టు ఇవాళ్టీకి (ఫిబ్రవరి 24) వాయిదా వేసింది.

హైకోర్టులో ఏం జరిగింది?

న్యాయమూర్తి జస్టిస్ ఎం. నాగప్రసన్న ధర్మాసనం ముందు రణ్‌వీర్ సింగ్ తరపు న్యాయవాది ఈ కేసును అత్యవసరంగా విచారించాలని కోరారు. "పిటిషనర్ ఒక బాలీవుడ్ నటుడు. 'కాంతార: చాప్టర్ 1'పై ఆయన వ్యక్తం చేసిన నిజాయితీ గల ప్రశంసలకు క్రిమినల్ రంగు పులుముతున్నారు" అని న్యాయవాది వాదించారు.

ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకే విచారణ చేపట్టాలని కోరగా.. "ఎందుకు? ఆయన బాలీవుడ్ నటుడు అయినందుకా? రేపు విచారిద్దాం" అంటూ కోర్టు ఘాటుగా స్పందించింది.

అసలు వివాదం ఏంటి?

గతేడాది నవంబర్‌లో గోవాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (IFFI)లో రణ్‌వీర్ సింగ్ పాల్గొన్నారు. వేదికపై రిషబ్ శెట్టి నటనను ప్రశంసిస్తూ, కాంతారలో దైవం పూనకం వచ్చినప్పుడు రిషబ్ చేసే హావభావాలను రణ్‌వీర్ అనుకరించారు. అంతేకాకుండా, చాముండి దైవాన్ని 'ఫీమేల్ ఘోస్ట్' (ఆడ దెయ్యం) అని వ్యాఖ్యానించారు.

తీర ప్రాంత కర్ణాటక ప్రజలు అత్యంత పవిత్రంగా భావించే దైవ నర్తనను, భూతకోల సంప్రదాయాన్ని రణ్‌వీర్ సింగ్ అవమానించారంటూ న్యాయవాది ప్రశాంత్ మెతల్ బెంగళూరులో ఫిర్యాదు చేశారు. దీనిపై కోర్టు ఆదేశాల మేరకు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 196, 299, 302 కింద రణ్‌వీర్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది.

క్షమాపణలు చెప్పినా తగ్గని రచ్చ

వివాదం ముదరడంతో రణ్‌వీర్ సింగ్ అప్పట్లోనే సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు కోరారు. "ఒక నటుడిగా రిషబ్ అద్భుతమైన ప్రతిభను హైలైట్ చేయడమే నా ఉద్దేశం. అపారమైన గౌరవంతోనే అలా చేశాను తప్ప ఎవరినీ కించపరచాలని కాదు" అని స్పష్టం చేశారు. రిషబ్ శెట్టి కూడా స్టేజ్ మీద రణ్‌వీర్ అలా చేస్తున్నప్పుడు వద్దని వారించినట్లు వీడియోల్లో కనిపించింది.

ఇదిలా ఉంటే, రణ్‌వీర్ సింగ్ తన తదుపరి చిత్రం ‘ధురంధర్ 2’ (Dhurandhar 2) విడుదలకు రెడీ ఉంది. మార్చి 19న విడుదల కానున్న ఈ సినిమా యశ్ నటించిన ‘టాక్సిక్’తో పోటీ పడనుంది. ఇలాంటి సమయంలో ఈ చట్టపరమైన వివాదాలు రణ్‌వీర్‌ను కాస్త ఆందోళనకు గురిచేస్తున్నాయని అభిమానులు వాపోతున్నారు.