...
...
Next Story

కేఎల్ రాహుల్‌, హార్దిక్ కాంట్ర‌వ‌ర్సీ-కోహ్లీని కాఫీ విత్ క‌ర‌ణ్ షోకు అందుకే పిల‌వ‌లేదు-క‌ర‌ణ్ జోహార్ సంచ‌ల‌న వ్యాఖ్యలు

2019లో కరణ్ జోహార్ చాట్ షోలో కనిపించిన హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ సోషల్ మీడియాలో ఎదురుదెబ్బతిన్నారు. మరియు చిత్రనిర్మాత ఇప్పటికీ బాధ్యత వహిస్తాడు.

Published on: Nov 10, 2025, 09:30:00 IST
Advertisement

నిర్మాత కరణ్ జోహార్ హిట్ టాక్ షో 'కాఫీ విత్ కరణ్'. ఇది చాలా పాపులర్. ఇందులో ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. సినిమా, క్రికెట్ స్టార్లు కనిపించారు. కానీ భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లి అనే ఒక పెద్ద పేరు ఇప్పటికీ మిస్సవుతోంది. అనుష్క శర్మ అనేకసార్లు హాజరైనప్పటికీ, విరాట్ రాలేకపోవడానికి గల కారణం హార్దిక్ పాండ్యా–కేఎల్ రాహుల్ వివాదమేనని కరణ్ జోహార్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

సానియా మీర్జాతో

కరణ్ జోహార్ కామెంట్లు
కరణ్ జోహార్ కామెంట్లు

ఇటీవల భారత టెన్నిస్ లెజెండ్ సానియా మీర్జా పోడ్‌కాస్ట్ 'సర్వింగ్ ఇట్ అప్ విత్ సానియా' లో కరణ్ జోహార్ పాల్గొన్నాడు. ఈ సంభాషణలో కాఫీ విత్ కరణ్ షోకి రావడానికి నిరాకరిస్తూనే ఉన్న సెలబ్రిటీ ఎవరు అని సానియా అడగగా, కరణ్ ‘రణబీర్ కపూర్’ పేరు చెప్పాడు. "అతను గతంలో వచ్చాడు. కానీ గత మూడు సీజన్ల నుండి అతను రానని చెప్పాడు" అని రణబీర్ పంచుకున్నాడు. రణబీర్ చివరిసారిగా 2016 లో రణవీర్ సింగ్‌తో కలిసి ఆ షోకు వచ్చాడు.

కోహ్లీని పిలవలేదు

అనుష్క శర్మను వివాహం చేసుకున్న విరాట్‌ కోహ్లీని ఇప్పటివరకు ఎందుకు షోకి ఆహ్వానించలేదో కరణ్ జోహార్ వెల్లడించాడు. 'కాఫీ విత్ కరణ్' కౌచ్‌పైకి ఎప్పుడూ రాని వ్యక్తి పేరు చెప్పమని సానియా కరణ్‌ను అడిగినప్పుడు, ఆ నిర్మాత ఆలోచించడానికి కాసేపు ఆగిపోయాడు. ఆమె విరాట్ పేరును ప్రస్తావించగానే, ఆ క్రికెటర్‌ను తాను ఎప్పుడూ షోకి ఆహ్వానించలేదని కరణ్ అంగీకరించాడు.

"నేను విరాట్‌ను ఎప్పుడూ అడగలేదు. హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్ కాంట్రవర్సీ తర్వాత నేను ఏ క్రికెటర్లను రమ్మని అడగడం లేదు. చాలా మంది రారని నేను అనుకున్నా. అందుకే నేను వారిని మొదటి నుంచీ అడగలేదు" అని కరణ్ వెల్లడించాడు.

హార్దిక్, రాహుల్ కాంట్రవర్సీ

క్రికెటర్లు హార్దిక్, కేఎల్ రాహుల్ ‘కాఫీ విత్ కరణ్’ షో లో చేసిన అనుచిత వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంతో ఆ సమయంలో వారి ఎపిసోడ్‌ను డిస్నీ+ హాట్‌స్టార్ తొలగించింది. వారిద్దరూ క్షమాపణలు చెప్పినప్పటికీ ఆస్ట్రేలియాతో తొలి వన్డేకు ముందు వీళ్లిద్దరినీ బీసీసీఐ సస్పెండ్ చేసింది. అయితే ఆ క్రికెటర్లు ఎదుర్కోవలసి వచ్చిన దానికి తాను బాధ్యత వహిస్తానని కూడా కరణ్ పేర్కొన్నాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe