తమిళనాడు రాజకీయాలకు ఇప్పుడు సినీ గ్లామర్ తోడై హీటెక్కుతున్నాయి. ప్రముఖ నటుడు, దర్శకుడు సుందర్ సి ఈ ఎన్నికల ద్వారా తన రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. మదురై సెంట్రల్ నియోజకవర్గం నుంచి 'పుదియ నీది కట్చి' (PNK) అభ్యర్థిగా, AIADMK కూటమి మద్దతుతో సుందర్ సి బరిలోకి దిగుతున్నారు. అయితే, ఆయన ప్రచార పర్వం మొదలవ్వకముందే సోషల్ మీడియాలో ఒక వివాదాస్పద వార్త చక్కర్లు కొడుతోంది.

అసలేం జరిగింది?
మదురై సెంట్రల్ నియోజకవర్గంలో తాను గెలిస్తే, అక్కడ ఉన్న మాంసం దుకాణాలను పూర్తిగా నిషేధిస్తానని సుందర్ సి అన్నట్లుగా మంగళవారం (ఏప్రిల్ 7) కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి. ప్రసిద్ధ మదురై మీనాక్షి అమ్మవారి ఆలయ పవిత్రతను కాపాడటానికే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పోస్టుల సారాంశం. ఈ వార్త స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది.
సుందర్ సి క్లారిటీ: "అవన్నీ పచ్చి అబద్ధాలు"
ఈ ప్రచారంపై సుందర్ సి వెంటనే స్పందించారు. "నేను గెలిస్తే మాంసం దుకాణాలను మూసివేయిస్తానంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. ప్రజల మనోభావాలను, వారి హక్కులను నేను ఎప్పుడూ గౌరవిస్తాను. నాతో నేరుగా తలపడే ధైర్యం లేని వారు, ఇలాంటి అడ్డదారులు తొక్కుతూ నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారు. మా ఐక్యతతో, విజయంతో వీరికి తగిన బుద్ధి చెబుతాం" అని సుందర్ సి తమిళంలో ఘాటుగా పోస్ట్ చేశారు.
విరుచుకుపడ్డ ఖుష్బూ.. టార్గెట్ డీఎంకే!
సుందర్ సి భార్య, బీజేపీ సీనియర్ నాయకురాలు, ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఖుష్బూ తన భర్తకు అండగా నిలిచారు. ఈ ఫేక్ వార్తలకు అధికార డీఎంకే (DMK) పార్టీయే కారణమని ఖుష్బూ సుందర్ ఆరోపించారు.
"నిజాయితీ గల వ్యక్తిని నేరుగా ఎదుర్కోలేక, ఇలాంటి అబద్ధపు కథనాలను సృష్టిస్తున్నారు. డీఎంకేకు ఓటమి భయం పట్టుకుందని అర్థమవుతోంది. ప్రజల మద్దతు కోసం ఇలాంటి పనులు చేయడం వారికే చేటు చేస్తుంది. మదురై ప్రజలకు అంతా తెలుసు, వారంతా సుందర్ సి వెంటే ఉన్నారు" అని ఖుష్బూ సుందర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మండిపడ్డారు.
రాజకీయ ప్రస్థానం
{{/usCountry}}"నిజాయితీ గల వ్యక్తిని నేరుగా ఎదుర్కోలేక, ఇలాంటి అబద్ధపు కథనాలను సృష్టిస్తున్నారు. డీఎంకేకు ఓటమి భయం పట్టుకుందని అర్థమవుతోంది. ప్రజల మద్దతు కోసం ఇలాంటి పనులు చేయడం వారికే చేటు చేస్తుంది. మదురై ప్రజలకు అంతా తెలుసు, వారంతా సుందర్ సి వెంటే ఉన్నారు" అని ఖుష్బూ సుందర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మండిపడ్డారు.
రాజకీయ ప్రస్థానం
{{/usCountry}}తెలుగు, తమిళంలో హీరోయిన్గా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఖుష్బూ 2010లో డీఎంకే ద్వారా రాజకీయాల్లోకి వచ్చి, ఆ తర్వాత కాంగ్రెస్, ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. 2025లో ఆమె తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఇక సుందర్ సి ఏప్రిల్ 23న జరగనున్న ఎన్నికల ద్వారా తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
ఖుష్బూ సినిమాలు
సినిమాల విషయానికొస్తే.. ఖుష్బూ ఇటీవల 'నేసిప్పాయా', 'సుబేదార్' చిత్రాల్లో నటించారు. సుబేదార్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. సుందర్ సి 'మూకుత్తి అమ్మన్ 2', 'పురుషన్' వంటి చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ బిజీగా ఉన్నారు. రాజకీయాల్లోకి ఆయన ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్గా మారింది.