...
...
Next Story

Kiran Abbavaram: అది తప్ప బడ్జెట్ గురించి ఆలోచించని నిర్మాత ఆయన- ఈ ఒక్క పాట కోసం కోటి రూపాయల సెట్ వేశారు: కిరణ్ అబ్బవరం

Kiran Abbavaram Speech At Chennai Love Story Song Launch Event: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ చెన్నై లవ్ స్టోరీ. శ్రీ గౌరి ప్రియ హీరోయిన్‌గా చేసిన ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన గుర్తుందా సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు.

Published on: Mar 31, 2026, 18:45:02 IST
Advertisement

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం చివరిగా క, కే ర్యాంప్ సినిమాలతో అలరించాడు. ఇప్పుడు తాజాగా చెన్నై లవ్ స్టోరీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శ్రీ గౌరి ప్రియ హీరోయిన్‌గా చేస్తున్న ఈ సినిమాకు రవి నంబూరి దర్శకత్వం వహించారు. నిర్మాత ఎస్‌కేఎన్, డైరెక్టర్ సాయి రాజేష్ ప్రొడ్యూసర్స్‌గా నిర్మించారు.

గుర్తుందా సాంగ్ లాంచ్ ఈవెంట్

అది తప్ప బడ్జెట్ గురించి ఆలోచించని నిర్మాత ఆయన- ఈ ఒక్క పాట కోసం కోటి రూపాయల సెట్ వేశారు: కిరణ్ అబ్బవరం
అది తప్ప బడ్జెట్ గురించి ఆలోచించని నిర్మాత ఆయన- ఈ ఒక్క పాట కోసం కోటి రూపాయల సెట్ వేశారు: కిరణ్ అబ్బవరం

పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందించిన చెన్నై లవ్ స్టోరీ నుంచి గుర్తుందా సాంగ్ రిలీజ్ చేశారు. ఇందుకోసం హైదరాబాద్‌లో గుర్తుందా సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో కిరణ్ అబ్బవరం ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపాడు.

హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. "చెన్నై లవ్ స్టోరీ మూవీ డాల్బీలో చేస్తుండటం సంతోషంగా ఉంది. సినిమా కోసం మా టీమ్ అంతా చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఎడిటర్ సంతోష్ ఒక్కో సీన్ కట్ చేసి చూపిస్తూ, మంచి సజెషన్స్ ఇస్తున్నాడు. అలాగే విశ్వాస్ డీవోపీగా నాతో ట్రావెల్ చేస్తూ వస్తున్నాడు. మనవాళ్లు మనతో సినిమా చేస్తున్నప్పుడు ప్రాజెక్ట్ మీద మరింత నమ్మకం కలుగుతుంటుంది" అని అన్నాడు.

దేవతలా హీరోయిన్ అనిపించాలి

"విజయ్ పొలాకీ మాస్టర్ నాతో మంచి కూల్ స్టెప్స్ చేయించాడు. అనంత శ్రీరామ్ గారు అన్ని సాంగ్స్ బ్యూటిఫుల్‌గా రాశారు. ఈ మూవీలో హీరోయిన్ ఒక దేవతలా అనిపించాలి. అలాంటి నిడివి గల పాత్రలో శ్రీ గౌరి చాలా బాగా పర్‌ఫార్మ్ చేసింది. ఆమె నటన ఎంత బాగుందో త్వరలో స్క్రీన్స్ మీద చూస్తారు" అని కిరణ్ అబ్బవరం తెలిపాడు.

"ఎస్‌కేఎన్ గారికి మూవీ అంటే చాలా ప్యాషన్. ఎప్పుడూ హిట్ సినిమా చేయాలనే మాట్లాడుతుంటారు తప్ప బడ్జెట్ ఎంత ఏంటి అని ఆలోచించరు. ఈ ఒక్క పాట కోసం కోటి రూపాయల ఖర్చు చేసి సెట్ వేశారు. ఆయనకు మూవీ పట్ల ఉన్న ప్యాషన్ హీరోగా నన్ను చాలా ఎగ్జైట్, ఇన్స్‌పైర్ చేసింది. నన్ను ఎంతో బాగా చూసుకున్నారు" అని నిర్మాతను పొగిడాడు కిరణ్ అబ్బవరం.

"సాయి రాజేశ్ గారు కథ చెప్పినప్పుడే ఈ సినిమా బలంగా ఉండబోతోందని అర్థమైంది. రాజా వారు రాణి గారు తర్వాత నేను ఈ సినిమాలో సెటిల్డ్‌గా ఉండే క్యారెక్టర్ చేస్తున్నా. సాయి రాజేశ్ గారు ఉంటే మనం పూర్తి నమ్మకంతో ఉండొచ్చు అని అర్థమైంది. ఈ రోజు మా మూవీ ప్రమోషన్ కంటెంట్‌కు వస్తున్న రెస్పాన్స్, సినిమా మీద ఏర్పడిన క్రేజ్, మా మూవీ గురించి అందరూ మాట్లాడుకోవడం సంతోషంగా ఉంది" అని హీరో ఆనందం వ్యక్తం చేశాడు.

థియేటర్స్‌లో మ్యాజిక్ కాన్సర్ట్ అయినట్లు

"మణిశర్మ గారు ఏడు పాటలు కంపోజ్ చేశారు. ఏడు పాటల్ని మీరు థియేటర్స్‌లో సెలబ్రేట్ చేసుకుంటారు. మా మూవీ రిలీజ్ అయిన రోజు థియేటర్స్‌లో మ్యూజిక్ కాన్సర్ట్ అయినట్లు ఉంటుంది. ఇండియన్ సినిమా గ్రేటెస్ట్ లవ్ స్టోరీస్‌లో ఒకటిగా చెన్నై లవ్ స్టోరీ మూవీ మీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది" అని ధీమాగా చెప్పాడు హీరో కిరణ్ అబ్బవరం.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe