బీచ్ ఒడ్డున కూతురు ఇవారాతో క్రికెటర్ కేఎల్ రాహుల్, భార్య అతియా శెట్టి- 2026కి గ్రాండ్ వెల్కమ్- ఫొటోలు వైరల్
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, హీరోయిన్ అతియా శెట్టి దంపతులు కొత్త ఏడాది 2026కి ఘనంగా స్వాగతం పలికారు. తమ గారాల పట్టి ఇవారాతో కలిసి బీచ్ వెకేషన్లో గడిపిన క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అవి ఇప్పుడు నెట్టింట గింగిరాలు తిరుగుతున్నాయి.
ప్రపంచమంతా కొత్త ఏడాది వేడుకల్లో, పార్టీల్లో మునిగితేలుతుంటే.. టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి మాత్రం ప్రశాంతతను కోరుకున్నారు. ఆర్భాటాలకు దూరంగా, తమ ముద్దుల కూతురు 'ఇవారా' (Evaarah) తో కలిసి సముద్రపు అలల సాక్షిగా 2026కి స్వాగతం పలికారు.

ప్రేమతో నిండిన 2026
ఈ బీచ్ వెకేషన్కు సంబంధించిన కొన్ని అందమైన ఫోటోలను అతియా శెట్టి గురువారం (జనవరి 1) ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. "2026.. మా హృదయాలు నీకోసం వేచి చూస్తున్నాయి" అనే అర్థం వచ్చేలా అతియా శెట్టి పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నెటిజన్ల మనసు గెలుచుకున్న దృశ్యం
సముద్రపు నీటి అంచున నిలబడి ఉన్న ఈ జంట, తమ చిన్నారిని ఎత్తుకుని ప్రకృతిని ఆస్వాదిస్తున్న దృశ్యం నెటిజన్ల మనసు గెలుచుకుంది. ఇదిలా ఉంటే, ఒక ఫోటోలో కేఎల్ రాహుల్ క్యాజువల్ టీ-షర్ట్, షార్ట్స్లో కనిపిస్తుండగా, అతియా శెట్టి తన కూతురిని గుండెలకు హత్తుకుని ఉంది.
ఫ్యాన్స్ ఫిదా
మరో వీడియోలో రాహుల్ చేతిని పట్టుకుని అతియా శెట్టి బీచ్ వెంబడి నడుస్తున్న దృశ్యం ఎంతో మనోహరంగా ఉంది. చాలా కాలం తర్వాత ఈ క్రేజీ కపుల్ కేఎల్ రాహుల్, అతియా శెట్టి తమ చిన్నారితో కలిసి కనిపించడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
అత్యంత క్యూట్ ఫొటో ఇదే
"ఇంటర్నెట్లో ఈరోజే చూసిన అత్యంత క్యూట్ ఫోటో ఇదే", "మీ ముగ్గురికీ ఎప్పుడూ ఆనందం కలగాలి" అంటూ నెటిజన్లు కామెంట్లతో ముంచెత్తుతున్నారు. కాగా, బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అయిన అతియా శెట్టి, కేఎల్ రాహుల్ను 2023 జనవరిలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
దేవుడు ఇచ్చిన వరం ‘ఇవారా’
ఖండాలాలోని సునీల్ శెట్టి ఫామ్హౌస్లో కేఎల్ రాహుల్, అతియా శెట్టి వివాహం అత్యంత సన్నిహితుల మధ్య వైభవంగా జరిగింది. అనంతరం 2024 నవంబర్లో తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ఈ జంట ప్రకటించింది. అనంతరం 2025 మార్చిలో ఇవారాకు ఈ దంపతులు జన్మనిచ్చారు. 'ఇవారా' అంటే 'దేవుడు ఇచ్చిన వరం' అని అర్థం వస్తుంది.
అతియా శెట్టి సినిమాలు
సినిమాలకు కొంతకాలంగా దూరంగా ఉంటున్న అతియా, ప్రస్తుతం తన కుటుంబంతో గడుపుతున్న మధుర క్షణాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్తో పంచుకుంటూనే ఉన్నారు. ఇదిలా ఉంటే సునీల్ శెట్టి కుమార్తెగా బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టింది అతియా శెట్టి. హీరో, మోతిచూర్ చక్నాచూర్, ముబారకన్, నవాబ్జాదే వంటి హిందీ చిత్రాల్లో నటించింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


