కొదమసింహం రీరిలీజ్ ట్రైలర్ రిలీజ్.. 4కే క్వాలిటీలో అదిరిపోయిన మెగాస్టార్ సూపర్ హిట్ మూవీ
మెగాస్టార్ చిరంజీవి 35 ఏళ్ల కిందట నటించిన సూపర్ హిట్ మూవీ కొదమసింహం. ఈ మూవీ రీరిలీజ్ కాబోతోంది. తాజాగా బుధవారం (నవంబర్ 12) మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 4కే క్వాలిటీలో ఈ ట్రైలర్ అదిరిపోయింది.
టాలీవుడ్లో రీరిలీజ్ల హవా నడుస్తున్న కాలం ఇది. ప్రతి స్టార్ హీరో పాత సినిమాలను ఏదో ఒక సందర్భంలో రీరిలీజ్ చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ మూవీ కొదమసింహం కూడా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. చిరుని కౌబాయ్ పాత్రలో చూపించిన ఈ మూవీ రీరిలీజ్ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు.

కొదమసింహం రీరిలీజ్ ట్రైలర్
మెగాస్టార్ చిరంజీవి 1990లో నటించిన సూపర్ హిట్ మూవీ కొదమసింహం. కే మురళీమోహన్ రావు డైరెక్ట్ చేశాడు. పరచూరి బ్రదర్స్ స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమాను ఇప్పుడు 35 ఏళ్ల తర్వాత నవంబర్ 21న రీరిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో చిరంజీవితోపాటు సోనమ్, మోహన్ బాబు, రాధ, కన్నడ ప్రభాకర్ లాంటి వాళ్లు నటించారు. మూవీ రీరిలీజ్ ట్రైలర్ 4కే క్వాలిటీలో రిలీజై అభిమానులకు కనులవిందు చేసింది.
చిరు కౌబాయ్ పాత్ర, నిధి వేట ఈ మూవీని ప్రత్యేకంగా నిలిపాయి. అప్పట్లోనే రూ.4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. దివంగత కైకాల సత్యనారాయణే ఈ సినిమాను నిర్మించి, అందులో నటించాడు. మూవీలో చిరంజీవి నటన, మ్యూజిక్ కు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. 20 సెంటర్లలో 100 రోజులు ఆడిన మూవీ ఇది. అలాంటి సినిమాను 4కే క్వాలిటీతో రీరిలీజ్ చేస్తుండటం అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
రీరిలీజ్ల హవా
టాలీవుడ్ లో కొంత కాలంగా పాత సినిమాలను రీరిలీజ్ చేసే ట్రెండ్ నడుస్తోంది. అయితే అది ఇప్పుడు మరీ పీక్ స్టేజ్ కు వెళ్లిపోయింది. ఎందుకంటే వచ్చే మూడు వారాల్లో ఏకంగా ఆరు సినిమాలు రీరిలీజ్ కానున్నాయి. ఈవారం అంటే నవంబర్ 14న శివ మూవీతో అది మొదలుకానుంది. నాగార్జున, ఆర్జీవీ సూపర్ హిట్ మూవీ అయిన శివ కూడా 4కే క్వాలిటీలో రాబోతోంది.
ఇక ఆ మరుసటి రోజే అంటే నవంబర్ 15న సిద్ధార్థ్, త్రిష మూవీ నువ్వొస్తానంటే నేనొద్దంటానా రానుంది. నవంబర్ 21న కొదమసింహం రానుండగా.. నవంబర్ 22న కార్తీ నటించిన ఆవారా, నవంబర్ 28న సూర్య నటించిన సికిందర్, నవంబర్ 29న మహేష్ బాబు నటించిన బిజినెస్మ్యాన్ రీరిలీజ్ కానున్నాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


