Krishnavataram Part 1 Hridayam Tax Free: భారతీయ వెండితెరపై పురాణగాథలకు, ఆధ్యాత్మిక చిత్రాలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. తాజాగా ‘కృష్ణావతారం పార్ట్ 1: హృదయం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.
ట్యాక్స్ ఫ్రీ సదుపాయం

రాష్ట్రవ్యాప్తంగా కృష్ణావతారం పార్ట్ 1 హృదయం చిత్రానికి పన్ను మినహాయింపు (Tax-Free) కల్పిస్తూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిర్ణయం తీసుకున్నారు. శ్రీకృష్ణుడి జీవన పరమార్థాన్ని, భారతీయ సంస్కృతిని అద్భుతంగా ఆవిష్కరించినందుకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది.
సాధారణంగా ఒక సినిమాను ట్యాక్స్ ఫ్రీగా ప్రకటించారంటే, టికెట్ ధరలపై వినోదపు పన్ను ఉండదు. దీనివల్ల సామాన్య ప్రేక్షకులకు తక్కువ ధరకే టికెట్లు అందుబాటులోకి వస్తాయి. తద్వారా మరింత ఎక్కువ మంది ప్రజలు థియేటర్లకు వెళ్లి ఈ పౌరాణిక గాథను వీక్షించే అవకాశం కలుగుతుంది.
యువత కోసమే ఈ ప్రత్యేక చొరవ
కృష్ణావతారం పార్ట్ 1: హృదయం సినిమా బృందంతో భేటీ అయిన సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఈ సినిమాకు సంబంధించి ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సమాచార శాఖను ఆదేశించారు.
"నేటి యువత, విద్యార్థులు మన దేశ సంస్కృతిని, ఘనమైన వారసత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఇలాంటి చిత్రాలు వారిలో ఆధ్యాత్మిక స్పృహను పెంపొందిస్తాయి" అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అభిప్రాయపడ్డారు.
ఈ ప్రత్యేక భేటీలో చిత్ర దర్శకుడు హార్దిక్ గజ్జర్, నిర్మాత సాజన్ రాజ్ కురుప్, కథానాయకుడు సిద్ధార్థ్ గుప్త, కథానాయిక సంస్కృతి జయానా పాల్గొన్నారు. వీరితో పాటు నిర్మాతలు శోభా సంత్, పూనమ్ ష్రాఫ్ గజ్జర్ కూడా ముఖ్యమంత్రిని యోగి ఆదిత్యనాథ్ను కలిసి కృష్ణావతారం పార్ట్ 1: హృదయం సినిమా విజయ విశేషాలను పంచుకున్నారు.
బాక్సాఫీస్ వద్ద పుంజుకున్న వసూళ్లు
{{/usCountry}}ఈ ప్రత్యేక భేటీలో చిత్ర దర్శకుడు హార్దిక్ గజ్జర్, నిర్మాత సాజన్ రాజ్ కురుప్, కథానాయకుడు సిద్ధార్థ్ గుప్త, కథానాయిక సంస్కృతి జయానా పాల్గొన్నారు. వీరితో పాటు నిర్మాతలు శోభా సంత్, పూనమ్ ష్రాఫ్ గజ్జర్ కూడా ముఖ్యమంత్రిని యోగి ఆదిత్యనాథ్ను కలిసి కృష్ణావతారం పార్ట్ 1: హృదయం సినిమా విజయ విశేషాలను పంచుకున్నారు.
బాక్సాఫీస్ వద్ద పుంజుకున్న వసూళ్లు
{{/usCountry}}మే 7న థియేటర్లలో విడుదలైన ‘కృష్ణావతారం పార్ట్ 1: హృదయం’ విడుదల అయింది. బాక్సాఫీస్ వద్ద తొలుత కాస్త నెమ్మదిగా కలెక్షన్స్ రాబట్టిన కృష్ణావతారం పార్ట్ 1: హృదయం సినిమా వీకెండ్లో పుంజుకుంది. మౌత్ టాక్ బాగుండటంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.
ఈ సినిమా వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి:
మొదటి రోజు గురువారం: రూ. 42 లక్షలు
శుక్రవారం: రూ. 1.15 కోట్లు
శనివారం: రూ. 2.25 కోట్లు
ఆదివారం: రూ. 3.50 కోట్లు
4 రోజుల కలెక్షన్స్
మొత్తంగా ఇప్పటివరకు కృష్ణావతారం పార్ట్ 1: హృదయం చిత్రం 4 రోజుల్లో రూ. 7.32 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయంతో రానున్న రోజుల్లో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
సిద్ధార్థ్ గుప్త, సంస్కృతి జయానా, సుస్మితా భట్ కీలక పాత్రల్లో నటించిన కృష్ణావతారం పార్ట్ 1: హృదయం చిత్రానికి హార్దిక్ గజ్జర్ దర్శకత్వం వహించారు. క్రియేటివ్ ల్యాండ్ స్టూడియోస్ ఎంటర్టైన్మెంట్, అతశ్రీకథా మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మించాయి.
మూడు భాగాలుగా ఫ్రాంచైజీ
మొత్తం మూడు భాగాలుగా రానున్నా ఈ కృష్ణావతారం ఫ్రాంచైజీలో ‘హృదయం’ మొదటి అధ్యాయం. ప్రస్తుతం విజయవంతంగా రన్ అవుతోన్న కృష్ణావతారం పార్ట్ 1: హృదయం సినిమా ఆధ్యాత్మిక ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది.