Kriti Sanon Houses: ఒకేసారి 4 లగ్జరీ ఇళ్లను అమ్మేసుకున్న హీరోయిన్ కృతి సనన్- కొనేసిన ఆ డైరెక్టర్- అందుకు కారణం ఏంటంటే?
Kriti Sanon Sold 4 Apartments Reasons: స్టార్ హీరోయిన్ కృతి సనన్ ముంబైలోని అంధేరీ వెస్ట్లో ఉన్న తన నాలుగు లగ్జరీ ఇళ్లను విక్రయించారు. క్యాస్టింగ్ డైరెక్టర్ ఈ ఇళ్లను కొనుగోలు చేశారు. అయితే, కృతి సనన్ తన 4 అపార్ట్మెంట్లను అమ్మడానికి గల కారణం ఏంటీ, స్టాంప్ డ్యూటీ వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
Kriti Sanon Sold 4 Apartments Reasons Here: సినీ తారలు కేవలం వెండితెరపైనే కాదు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులలోనూ భారీగా లాభాలు అర్జిస్తుంటారు. మన టాలీవుడ్లో హైదరాబాద్లోని జూబ్లీహిల్స్, గచ్చిబౌలి ప్రాంతాలలో హీరో హీరోయిన్లు ఇళ్లు కొని ఎలా లాభాలు సాధిస్తారో, బాలీవుడ్లోనూ అదే క్రయ విక్రయ ట్రెండ్ నడుస్తోంది.

ఒకేసారి నాలుగు ఇళ్లను
అయితే, తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ తన తల్లి గీతా సనన్, సోదరి నుపుర్ సనన్లతో కలిసి ముంబైలో ఉన్న నాలుగు లగ్జరీ అపార్ట్మెంట్లను ఒకేసారి విక్రయించి వార్తల్లో నిలిచారు. ముంబైలోని అత్యంత డిమాండ్ ఉన్న అంధేరీ వెస్ట్ ప్రాంతంలో ఉన్న ఈ ఇళ్లను భారీ ధరకు అమ్మేశారు కృతి సనన్.
కొనుగోలుదారు ఎవరంటే?
ప్రముఖ రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ 'స్క్వేర్ యార్డ్స్' సేకరించిన రిజిస్ట్రేషన్ పత్రాల ద్వారా ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. కృతి సనన్ కుటుంబం నుంచి ఈ నాలుగు ఫ్లాట్లను ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్, స్టార్ కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ ఛాబ్రా కొనుగోలు చేశారు. మొత్తం నాలుగు వేర్వేరు లావాదేవీల ద్వారా ఈ విక్రయ ప్రక్రియ పూర్తయింది.
ఈ ఏడాది ఏప్రిల్ 24, 2026న ఈ ఆస్తుల రిజిస్ట్రేషన్ అధికారికంగా ముగిసింది. ముంబైలోని ప్రముఖ 'రహేజా క్లాసిక్' బిల్డింగ్లో ఈ ఫ్లాట్లు ఉన్నాయి. కృతి సనన్ ఇటీవలే ముంబైలోని బాంద్రా ప్రాంతంలో రూ. 78 కోట్ల విలువైన సీ-ఫేసింగ్ లగ్జరీ పెంట్హౌస్ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. బహుశా అందుకే పాత ప్రాపర్టీలను కృతి సనన్ విక్రయించి ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
పెట్టుబడికి రెట్టింపు లాభం
సనన్ కుటుంబం ఈ నాలుగు అపార్ట్మెంట్లను 2013 నుంచి 2017 మధ్య కాలంలో విడతల వారీగా కొనుగోలు చేసింది. అప్పట్లో వీటన్నింటికీ కలిపి వీరు పెట్టిన పెట్టుబడి సుమారు రూ. 4.31 కోట్లు మాత్రమే. తాజాగా ముఖేష్ ఛాబ్రాకు ఈ ఇళ్లను మొత్తం రూ. 8.9 కోట్లకు విక్రయించారు.
అంటే, దాదాపు 9 నుంచి 13 ఏళ్ల వ్యవధిలో కృతి సనన్ కుటుంబానికి ఏకంగా రూ. 4.6 కోట్ల నికర లాభం లభించింది. శాతాల పరంగా చూస్తే ఇది దాదాపు 107 శాతం క్యాపిటల్ గెయిన్ కావడం అనుకోవచ్చు.
అపార్ట్మెంట్ల పూర్తి వివరాలు, స్టాంప్ డ్యూటీ
ఈ నాలుగు ఇళ్లలో రెండు పెద్ద అపార్ట్మెంట్లు కాగా, మిగిలిన రెండు కాస్త చిన్నవి. రహేజా క్లాసిక్లో ఉన్న రెండు పెద్ద ఫ్లాట్లు ఒక్కొక్కటి రూ. 3.23 కోట్లకు అమ్ముడయ్యాయి. వీటిలో ప్రతి ఫ్లాట్ బిల్ట్-అప్ ఏరియా 654.23 చదరపు అడుగులు ఉంటుంది. వీటికి ఒక్కో కారు పార్కింగ్ సదుపాయం కూడా ఉంది.
ఈ రెండు పెద్ద ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం ఒక్కొక్క దానికి రూ. 19.41 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. ఈ రెండు ఫ్లాట్లను జూలై 2013లో కృతి తల్లి గీతా సనన్ రూ. 1.40 కోట్లకు కొనుగోలు చేశారు.
మిగిలిన రెండు చిన్నవి
అదే బిల్డింగ్లో ఉన్న మిగిలిన రెండు చిన్న అపార్ట్మెంట్లు ఒక్కొక్కటి రూ. 1.21 కోట్లకు అమ్ముడయ్యాయి. వీటి బిల్ట్-అప్ ఏరియా 246.06 చదరపు అడుగులు. ఈ చిన్న ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం ఒక్కో దానికి రూ. 7.29 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు అయ్యాయి. ఈ రెండు ఫ్లాట్లను జూన్ 2017లో కృతి సనన్, ఆమె సోదరి నుపుర్ సనన్ కలిసి రూ. 2.90 కోట్లకు కొన్నారు.
అంధేరీ వెస్ట్కు ఎందుకంత క్రేజ్?
"ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్లో అంధేరీ వెస్ట్కు ఎప్పుడూ తిరుగులేని డిమాండ్ ఉంటుంది" అని స్క్వేర్ యార్డ్స్ ప్రతినిధులు పేర్కొన్నారు. మన హైదరాబాద్లోని ఫిలింనగర్ లాగే ముంబైలో అంధేరీ వెస్ట్ ప్రాంతం సినీ ప్రముఖులకు, వ్యాపారవేత్తలకు కేరాఫ్ అడ్రస్గా మారింది.
వెస్ట్రన్ ఎక్స్ప్రెస్ హైవే, లింక్ రోడ్, మెట్రో నెట్వర్క్, అంతర్జాతీయ విమానాశ్రయం వంటి రవాణా సౌకర్యాలు ఇక్కడి నుంచి చాలా దగ్గరగా ఉంటాయి. దీనికి తోడు ఫిల్మ్ సిటీ, బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC), సీప్జ్ (SEEPZ) వంటి ప్రధాన ఉపాధి, వినోద కేంద్రాలు పక్కనే ఉండటంతో ఇక్కడ ఇళ్లకు విపరీతమైన డిమాండ్ పలుకుతోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


