Madhavan: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ (NEET) పేపర్ లీక్ వివాదం, విద్యార్థుల ఆందోళనలపై మౌనంగా ఉన్న సీనియర్ యాక్టర్, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII) ఛైర్మన్ ఆర్. మాధవన్పై విద్యార్థి లోకం తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. పుణేలోని ప్రసిద్ధ ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆవరణలో ఉన్న ఆయన ఆఫీస్ కేబిన్ డోర్పై విద్యార్థులు 'గాయబ్' (కనిపించకుండా పోయారు) మీమ్స్తో పాటు 'నీట్ ఫర్ సేల్' పోస్టర్లను అంటించి వినూత్నంగా నిరసన తెలిపారు.
సోషల్ మీడియాలో వైరల్ పిక్.. నెటిజన్ల ట్రోలింగ్

ఈ పోస్టర్ ఫొటో నెట్లో వైరల్ అవ్వగానే నెటిజన్లు, విద్యార్థులు మాధవన్ను ఏకిపారేస్తున్నారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫిలిం ఇన్స్టిట్యూట్కు హెడ్గా ఉంటూ, వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారినప్పుడు స్పందించకపోవడం ఏంటని సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు.
మాధవన్ లేటెస్ట్ మూవీ 'ధురంధర్ 3' షూటింగ్, ఆయన కొడుకు వేదాంత్ స్విమ్మింగ్ కెరీర్ కోసం దుబాయ్ షిఫ్ట్ అవ్వడాన్ని టార్గెట్ చేస్తూ నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. "సొంత కొడుకు ఫ్యూచర్ కోసం ఇండియా వదిలి వెళ్లిన మాధవన్కు సాధారణ విద్యార్థుల కష్టాలు ఏం తెలుస్తాయి?" అంటూ ఘాటుగా కామెంట్స్ పెడుతున్నారు.
జంతర్ మంతర్ వద్ద ఎడతెగని పోరాటం
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జూన్ 6 నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు జరుగుతున్నాయి. సామాజిక వేత్త సోనమ్ వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టగా, ఈ మధ్యే చేపట్టిన 'చలో సంసద్' మార్చ్తో వాతావరణం మరింత వేడెక్కింది.
ఈ నిరసనకు మద్దతుగా దాదాపు 50 వేల మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చారు. శాంతియుతంగా జరుగుతున్న ఈ మార్చ్పై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడంపై నేషనల్ వైడ్గా తీవ్ర దుమారం రేగుతోంది.
సినీ ప్రముఖుల మద్దతు.. మాధవన్ రాజీనామా డిమాండ్
{{/usCountry}}ఈ నిరసనకు మద్దతుగా దాదాపు 50 వేల మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చారు. శాంతియుతంగా జరుగుతున్న ఈ మార్చ్పై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడంపై నేషనల్ వైడ్గా తీవ్ర దుమారం రేగుతోంది.
సినీ ప్రముఖుల మద్దతు.. మాధవన్ రాజీనామా డిమాండ్
{{/usCountry}}ఈ విద్యార్థి ఉద్యమానికి ప్రకాష్ రాజ్, షబానా అజ్మీ, అనురాగ్ కశ్యప్, సోనమ్ బజ్వా, హనుమాన్ కైండ్, అమోల్ పరాశర్ లాంటి సినీ ప్రముఖులు నేరుగానూ, డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారానూ ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై పోలీసు బలప్రయోగం సరికాదని బహిరంగంగా ఖండించారు.
ఇలాంటి కీలక సమయంలో విద్యార్థుల పక్షాన నిలబడలేని మాధవన్ వెంటనే ఎఫ్టీఐఐ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలని ఆడియన్స్ డిమాండ్ చేస్తున్నారు. కేవలం తన సినిమాల ప్రమోషన్లకు మాత్రమే బయటకు వచ్చే హీరోలు, సమాజానికి ఉపయోగపడే విషయాల్లో నోరు విప్పకపోవడం దారుణమని కామెంట్స్ చేస్తున్నారు.