రాజమౌళితో షూటింగ్ హా.. టార్చర్, ఫర్పెక్ట్ ఔట్ పుట్ వచ్చేంతవరకూ వదిలిపెట్టడు, పని రాక్షసుడు.. ఇలా కంప్లయింట్స్ ఇచ్చిన హీరోలు చాలా మందే. అవును.. తాను అనుకున్నది అనుకున్నట్లు వచ్చేంతవరకూ రాజమౌళి వదలడు. ఇప్పుడు వారణాసి సినిమా కోసం కూడా మహేష్ బాబును ఆ రేంజ్ లోనే కష్టపెడుతున్నాడు. మూవీ కోసం పిండేస్తున్నాడు.
శ్రీరాముడి పాత్ర

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి సినిమా కోసం మహేష్ బాబు తెగ కష్టపడుతున్నాడు. ఈ యాక్షన్ అడ్వెంచరస్ మూవీలో శ్రీరాముడి పాత్రలోనూ మహేష్ బాబు కనిపించనున్నాడు. ఇందుకోసం ప్రత్యేక కసరత్తులు చేస్తున్నాడు. కఠోరమైన మార్షల్ ఆర్ట్స్ శిక్షణ శిక్షణ తీసుకున్నాడు. పురాతన యుద్ధ విద్య కళరిపయట్టును సాధన చేశాడు. రన్నింగ్ పైనా స్పెషల్ ఫోకస్ పెట్టాడు.
రాజమౌళి ప్రాసెస్
స్క్రీన్ రాంట్ ప్లస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వారణాసి సినిమా కోసం ఎలా కష్టపడుతున్నాడో మహేష్ బాబు వివరించాడు. ‘‘రాజమౌళికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఓ పద్ధతి ఉంటుంది. ఈ సినిమా (వారణాసి)లో నేను శ్రీరాముడి పాత్రలోనూ కనిపిస్తా. ఆ పాత్ర నడిచే విధానం, నిలబడే తీరు చాలా ముఖ్యం. అందుకే ఆ పాత్ర కోసం నా శరీరాన్ని మార్చుకున్నా’’ అని మహేష్ బాబు తెలిపాడు.
6 నెలలు
వారణాసి సినిమాలోని పాత్రకు తగ్గట్లుగా తన శరీరాన్ని మార్చుకోవడానికి మహేష్ బాబు ఏమేం చేశాడో చెప్పాడు. ‘‘కేరళ పురాతన యుద్ధ విద్య కళరిపయట్టులో మూడు నెలల శిక్షణ తీసుకున్నా. అతను (రాజమౌళి) నా రన్నింగ్ టెక్నిక్ ను కూడా మార్చాలనుకున్నాడు. ఇందు కోసం నేను ట్రాక్ అండ్ ఫీల్డ్ బృందంతో కలిసి 6 నెలల పాటు ట్రైనింగ్ పొందా. అయితే ఈ సినిమాలో ఆ షాట్లు రెండు మాత్రమే ఉంటాయి’’ అని మహేష్ బాబు వెల్లడించాడు.
కష్టమైన పని కాదు
వారణాసి సినిమా కోసం మహేష్ బాబు ఇంతలా కష్టపడుతున్నా.. నచ్చిన పని చేయడంలో కష్టం లేదని అంటున్నాడు. ‘‘ఈ సినిమా కోసం నేను కమిట్ అయి ఉన్నా. సరదాగా తీసుకుంటున్నా. షూటింగ్ ప్రాసెస్ ను ఆస్వాదిస్తున్నా. అలాంటప్పుడు పెద్ద కష్టంగా అనిపించదు’’ అని మహేష్ పేర్కొన్నాడు.
{{/usCountry}}వారణాసి సినిమా కోసం మహేష్ బాబు ఇంతలా కష్టపడుతున్నా.. నచ్చిన పని చేయడంలో కష్టం లేదని అంటున్నాడు. ‘‘ఈ సినిమా కోసం నేను కమిట్ అయి ఉన్నా. సరదాగా తీసుకుంటున్నా. షూటింగ్ ప్రాసెస్ ను ఆస్వాదిస్తున్నా. అలాంటప్పుడు పెద్ద కష్టంగా అనిపించదు’’ అని మహేష్ పేర్కొన్నాడు.
{{/usCountry}}మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న వారణాసి మూవీ ఏప్రిల్ 7, 2027న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు.