...
...
Next Story

మెగాస్టార్ మేనియా-ఇండియాలోనే 100 కోట్లు కొల్లగొట్టేసిన మన శంకర వర ప్రసాద్ గారు-ఆ సినిమాలను దాటి

'మన శంకర వర ప్రసాద్ గారు' మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతోంది! చిరంజీవి, నయనతార నటించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ 4వ రోజున కూడా అదరగొట్టింది. ఇండియాలోనే రూ.100 కోట్ల కలెక్షన్లు దాటేసింది.

Published on: Jan 16, 2026, 05:42:26 IST
Advertisement

మెగాస్టార్ చిరంజీవి హీరగా నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'మన శంకర వర ప్రసాద్ గారు' (MSVPG). సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లలో విడుదలైంది ఈ చిత్రం. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ పాజిటివ్ టాక్ తో సాగిపోతుంది. బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది.

మన శంకర వర ప్రసాద్ గారు కలెక్షన్లు

మన శంకర వరప్రసాద్ గారులో నయనతార, చిరంజీవి
మన శంకర వరప్రసాద్ గారులో నయనతార, చిరంజీవి

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఫ్యామిలీ చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరుస్తోంది. సక్నిల్క్ ప్రకారం చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం దేశీయంగా రూ.100 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించింది. సంక్రాంతి రోజు (జనవరి 15) ఈ మూవీ ఇండియాలో రూ.24.14 కోట్ల నెట్ వసూళ్లు కథలో వేసుకుందని ట్రేబ్ అనలిస్ట్ వెబ్ సైట్ సక్నిల్క్ పేర్కొంది.

రూ.100 కోట్ల క్లబ్

చిరంజీవి హీరోగా వచ్చిన మన శంకర వర ప్రసాద్ గారు సినిమా ఇండియాలోనే నెట్ కలెక్షన్ల పరంగా రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. నివేదిక ప్రకారం ప్రీమియర్‌ల ద్వారా చిత్రం రూ.9.35 కోట్లు వసూలు చేసింది. విడుదలైన మొదటి రోజు రూ.32.25 కోట్లు, 2వ రోజు రూ.18.75 కోట్లు, 3వ రోజు రూ.19.5 కోట్లు వసూలు చేసింది. 4వ రోజున రూ.24.14 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఇప్పటివరకు ఇండియాలో రూ.103.99 కోట్ల నెట్ కలెక్షన్లు సొంతం చేసుకుంది. గురువారం శంకర వరప్రసాద్ చిత్రానికి మొత్తం 75.10% తెలుగు ఆక్యుపెన్సీ ఉంది.

ఆ సినిమాలను దాటి

ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు. ఈ చిత్రంలో వెంకటేష్, కేథరిన్ ట్రెసా కూడా నటించారు. ఈ కథ ఒక జాతీయ భద్రతా అధికారి తన విడిపోయిన భార్య, పిల్లలను రక్షించి, వారితో తిరిగి కలవడానికి ప్రయత్నించే నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాకు చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్ నుంచి టైటిల్ పెట్టారు.

ఆరు సంవత్సరాల తర్వాత విడిపోయిన తన భార్య, పిల్లలను ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్న మాజీ పోలీసు నుండి రక్షించే భద్రతా అధికారి, వారి సంబంధాన్ని తిరిగి నిర్మించుకోవడానికి ఒక అవకాశంగా భావిస్తాడు. ఈ మూవీకి అదనపు షోలు కూడా యాడ్ చేశారు. చిత్ర విజయాన్ని జరుపుకోవడానికి చిరంజీవి తన జూబ్లీహిల్స్ నివాసంలో ఒక పార్టీని ఏర్పాటు చేశారు. రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి దుర్గా తేజ్ తో సహా మెగా కుటుంబ సభ్యులు పలువురు అభిమానులతో కలిసి థియేటర్లలో చిత్రాన్ని వీక్షించారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks