రాజకీయ విమర్శల్లో స్థాయిని మరచి ప్రవర్తించడం ఇటీవల కాలంలో ఎక్కువైపోతోంది. తాజాగా తమిళనాడుకు చెందిన ఏఐఏడీఎంకే ఎంపీ సీవీ షణ్ముగం, హీరోయిన్ నయనతారను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.

నాకు నయనతార కావాలి
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రవేశపెట్టిన 'నీ కనవు ననవాగ' (మీ కల మాకు చెప్పండి) అనే పథకాన్ని ఎద్దేవా చేసే క్రమంలో.. "నాకు నయనతార కావాలని కల వస్తే, ముఖ్యమంత్రి నెరవేరుస్తారా?" అంటూ ఎంపీ సీవీ షణ్ముగం కామెంట్స్ చేశారు. దీనిపై సోషల్ మీడియాలో నిరసనలు వ్యక్తమవ్వగా, సినీ ప్రముఖులు మంచు విష్ణు, ఖుష్బూ సుందర్ తాజాగా గట్టిగా బదులిచ్చారు.
దారినపోయే ప్రతివాడు
ఈ వ్యవహారంపై నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా నిప్పులు చెరిగారు. "మహిళలు, ముఖ్యంగా నటీమణులు ఎవరికీ సొంత ఆస్తి కాదు. దారినపోయే ప్రతివాడు తమ సంభాషణల్లోకి లాగడానికి వారేమీ (నటీమణులు) వస్తువులు కాదు. ఒక నటి పేరును మీ చౌకబారు జోకులకు, అవమానాలకు వాడుకోవడం మీ నీచమైన మనస్తత్వాన్ని, పెరిగిన పద్ధతిని బయటపెడుతోంది" అని ఖుష్బూ సుందర్ మండిపడ్డారు.
నీ ఇంట్లో మహిళల గురించి ఇలాగే మాట్లాడతావా?
"ప్రతి మగాడు ఒక మహిళకు జన్మించినవాడే. ఒక నటి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేసేముందు.. నీ తల్లి, సోదరి లేదా భార్య గురించి ఎవరైనా ఇలాగే మాట్లాడితే ఊరుకుంటావా? అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నటీమణులు ప్రజల మధ్య ఉండవచ్చు కానీ వారు ఎవరికీ వ్యక్తిగత ఆస్తి కాదు. వారి వృత్తి ఏదైనా సరే గౌరవం ఇవ్వడం నేర్చుకోండి" అని ఖుష్బూ హితవు పలికారు.
నటీమణులు రాజకీయ పంచ్ బ్యాగులు కాదు
మా అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. "తమిళనాడు రాజకీయ ప్రచారాల గురించి చదువుతుంటే బాధేస్తోంది. రాజకీయ ప్రయోజనాల కోసం నటీమణులను ఇలాంటి చర్చల్లోకి లాగడం చాలా తక్కువ స్థాయి చర్య" అని మంచు విష్ణు అభిప్రాయపడ్డారు.
హెడ్ లైన్స్ కోసం వాడుకోవడం మానుకోండి
"ఇది కేవలం తమిళనాడులోనే కాదు, ఎక్కడ జరిగినా తప్పే. నటీమణులు అంటే రాజకీయ పంచ్ బ్యాగులు కాదు. వారికి కుటుంబాలు, ఆత్మగౌరవం, వెండితెరకు అవతల ఒక జీవితం ఉంటాయని గుర్తుంచుకోండి. భారతీయ సంస్కృతి మహిళను 'శక్తి'గా చూస్తుంది. వారిని కేవలం హెడ్ లైన్స్ కోసం వాడుకోవడం మానుకోండి" అని విష్ణు మంచు పేర్కొన్నారు.
{{/usCountry}}"ఇది కేవలం తమిళనాడులోనే కాదు, ఎక్కడ జరిగినా తప్పే. నటీమణులు అంటే రాజకీయ పంచ్ బ్యాగులు కాదు. వారికి కుటుంబాలు, ఆత్మగౌరవం, వెండితెరకు అవతల ఒక జీవితం ఉంటాయని గుర్తుంచుకోండి. భారతీయ సంస్కృతి మహిళను 'శక్తి'గా చూస్తుంది. వారిని కేవలం హెడ్ లైన్స్ కోసం వాడుకోవడం మానుకోండి" అని విష్ణు మంచు పేర్కొన్నారు.
{{/usCountry}}చివరకు ఎంపీ విచారం..
విల్లుపురం నిరసన కార్యక్రమాల్లో తాను చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో ఎంపీ షణ్ముగం వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యలు 'పొరపాటున' వచ్చినవని, ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం లేదని చెబుతూ విచారం వ్యక్తం చేశారు. అయితే, ఏఐఏడీఎంకే పార్టీ మాత్రం ఇది ఆయన వ్యక్తిగత వ్యాఖ్యేనని, పార్టీకి దీనితో సంబంధం లేదని స్పష్టం చేసింది.