...
...
Next Story

బోర్డర్ 2 రిలీజ్‌కు ముందే ఇండియన్ ఆర్మీ ధైర్యసాహసాలను కళ్లకు కట్టే ఈ టాప్ 8 మూవీస్ చూసేయండి

బోర్డర్ 2 సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా భారతీయ సైనికుల ధైర్యసాహసాలను, త్యాగాలను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన కొన్ని పాత సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. బోర్డర్, షేర్ షా, ఉరి, కేసరి వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడమే కాకుండా, ప్రేక్షకులలో దేశభక్తిని నింపాయి.

Published on: Jan 22, 2026, 16:05:35 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఈసారి రిపబ్లిక్ డేకి ముందే మనలో దేశభక్తిని నింపేందుకు ఓ అదిరిపోయే సినిమా రాబోతోంది. ఈ మూవీ పేరు 'బోర్డర్ 2'. ఈ సినిమా విడుదల కంటే ముందే అభిమానుల్లో భారీ అంచనాలు, ఆసక్తి నెలకొన్నాయి. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సన్నీ డియోల్, వరుణ్ ధావన్, అహాన్ శెట్టి, దిల్జీత్ దోసాంజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శుక్రవారం (జనవరి 23) 'బోర్డర్ 2' విడుదల కానుండగా అంతకుముందే ఇండియన్ ఆర్మీ అద్భుతమైన సాహసాన్ని, త్యాగాలను వెండితెరపై చూపించిన టాప్ సినిమాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

బోర్డర్ (Border)

బోర్డర్ 2 రిలీజ్‌కు ముందే ఇండియన్ ఆర్మీ ధైర్యసాహసాలను కళ్లకు కట్టే ఈ టాప్ 8 మూవీస్ చూసేయండి
బోర్డర్ 2 రిలీజ్‌కు ముందే ఇండియన్ ఆర్మీ ధైర్యసాహసాలను కళ్లకు కట్టే ఈ టాప్ 8 మూవీస్ చూసేయండి

1971లో జరిగిన భారత పాకిస్థాన్ యుద్ధం సమయంలోని లోంగేవాలా చారిత్రక పోరాటం ఆధారంగా ఈ బోర్డర్ సినిమా తెరకెక్కింది. ఇందులో కేవలం 120 మంది భారతీయ సైనికులు, ఒక రాత్రంతా పాకిస్థాన్ ట్యాంక్ రెజిమెంట్‌ను ఒంటరిగా ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఈ సినిమా 1997లో విడుదలైంది. ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఇప్పటికీ ఈ సినిమా పాటలు, సన్నివేశాలు ప్రేక్షకులను కదిలిస్తాయి.

షేర్ షా (Shershaah)

సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన 'షేర్ షా' సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. కార్గిల్ యుద్ధంలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవిత కథను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. దేశం కోసం ఆయన ఎలా పోరాడారు, ఎలా అమరులయ్యారు అనేది చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు.

ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ (Uri: The Surgical Strike)

విక్కీ కౌశల్ నటించిన 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. ఉగ్రవాదుల స్థావరాలపై భారత సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో ఇది రూపొందింది. ఈ సినిమాలోని నటనకు గాను విక్కీ కౌశల్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును కూడా అందుకున్నాడు.

ద ఘాజీ అటాక్ (The Ghazi Attack)

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన 'ఫైటర్' సినిమా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందింది. ఈ సినిమాలో ఎయిర్‌ఫోర్స్ పనితీరును, యుద్ధ విమానాల పైలట్ల జీవితాలను చాలా నిశితంగా, వివరంగా చూపించారు. ఈ మూవీలో హృతిక్ రోషన్, దీపికా పదుకోన్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటించారు. గగనతలంలో సాగే యాక్షన్ సీన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

కేసరి (Kesari)

ఈ సినిమా కథ 1897 నాటి సారాగర్హి యుద్ధం ఆధారంగా రూపొందింది. ఇందులో అక్షయ్ కుమార్ హవల్దార్ ఇషర్ సింగ్ పాత్రలో జీవించారు. బ్రిటిష్ భారతీయ సైన్యంలోని కేవలం 21 మంది సిక్కు సైనికులు, వేల మంది శత్రువులతో చేసిన పోరాటాన్ని, వారి వీరత్వాన్ని ఈ సినిమా ప్రతిబింబిస్తుంది. వారి త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.

భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా (Bhuj: The Pride of India)

1971 ఇండో పాక్ యుద్ధం ఆధారంగా వచ్చిన 'భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా' సినిమా కూడా ఎంతో స్ఫూర్తినిచ్చే కథాంశంతో వచ్చింది. యుద్ధంలో ధ్వంసమైన రన్ వేను స్థానిక మహిళల సహాయంతో ఎలా పునర్నిర్మించారు అనేది ఇందులో చూపించారు. ఈ సినిమాలో అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో కనిపించాడు.

ఎల్.ఓ.సి కార్గిల్ (LOC Kargil)

ఈ సినిమాలో 1999 కార్గిల్ యుద్ధం (ఆపరేషన్ విజయ్)లో తమ ప్రాణాలను అర్పించిన అనేక మంది భారతీయ సైనికుల కథలను చూపించారు. ఇందులో కెప్టెన్ విక్రమ్ బాత్రా, కెప్టెన్ మనోజ్ పాండే వంటి వీరుల త్యాగాల గురించి వివరించారు. చాలా మంది నటీనటులు నటించిన ఈ సినిమా యుద్ధం తాలూకు భావోద్వేగాలను పండించింది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe