Nag Ashwin: 94 ఏళ్ల వయసులోనూ అలుపెరగని తపనతో తన కలల సినిమాను తెరకెక్కించేందుకు మెగాఫోన్ పట్టారు సింగీతం శ్రీనివాసరావు. ‘సింగ్ గీతం’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీని తీస్తున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నాడు. తాజాగా డిలీటెడ్ సాంగ్ అంటూ ఓ వెరైటీ ఈవెంట్ నిర్వహించారు.
నాగ్ అశ్విన్ కామెంట్లు

సింగ్ గీతం సినిమా నుంచి ‘హలో బాసు’ అనే డిలీటెడ్ సాంగ్ ను ఇవాళ (మే 16) లాంఛ్ చేశారు. అయితే సినిమాలో ఉండని ఈ పాటను ఇలా ఈవెంట్ పెట్టి మరీ లాంఛ్ చేయడమే ఇక్కడ వెరైటీ. ఈ పాటను కమెడియన్ వంశీ పాడాడు. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
పుష్పక విమానం కంటే ముందే
సింగీతం శ్రీనివాస రావు లాంటి దిగ్గజ డైరెక్టర్ సినిమాను ప్రొడ్యూస్ చేయడంపై నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఆయన సినిమాకు ఎంతో చేశారు. తిరిగి ఆయనకు ఎంతో కొంత చేయడం కోసమే ఈ మూవీ తీస్తున్నాం’’ అని నాగ్ అశ్విన్ తెలిపాడు.
‘‘పుష్పక విమానం కంటే ముందే కమల్ హాసన్ కు సింగీతం శ్రీనివాసరావు ఈ స్టోరీ చెప్పారు. ఆల్మోస్ట్ 40 ఏళ్లు అయింది. ఇది ఆయన కల’’ అని నాగ్ అశ్విన్ వెల్లడించాడు.
దేవిశ్రీకి చెప్తే
దేవిశ్రీ ప్రసాద్ ఎంతో కష్టపడి కంపోజ్ చేసిన ‘హలో బాసు’ సాంగ్ ను డిలీట్ చేయడంపై రిపోర్టర్ల ప్రశ్నలకు నాగ్ అశ్విన్ సమాధానమిచ్చాడు. ఈ విషయం తెలిసిన తర్వాత సింగ్ గీతం మూవీ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తనతో మాట్లాడటం లేదని, కాల్ లిఫ్ట్ చేయడం లేదని నాగ్ అశ్విన్ చెప్పాడు.
కల్కి 2 ఎప్పుడంటే?
{{/usCountry}}దేవిశ్రీ ప్రసాద్ ఎంతో కష్టపడి కంపోజ్ చేసిన ‘హలో బాసు’ సాంగ్ ను డిలీట్ చేయడంపై రిపోర్టర్ల ప్రశ్నలకు నాగ్ అశ్విన్ సమాధానమిచ్చాడు. ఈ విషయం తెలిసిన తర్వాత సింగ్ గీతం మూవీ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తనతో మాట్లాడటం లేదని, కాల్ లిఫ్ట్ చేయడం లేదని నాగ్ అశ్విన్ చెప్పాడు.
కల్కి 2 ఎప్పుడంటే?
{{/usCountry}}ప్రభాస్ హీరోగా కల్కి 2 మూవీ తీస్తున్నాడు నాగ్ అశ్విన్. అయితే ఈ మూవీ అప్ డేట్ పై మాత్రం అతను ఎలాంటి కామెంట్ చేయలేదు. రిపోర్టర్లు కల్కి 2 గురించి అడిగితే వినపడట్లేదని నాగ్ అశ్విన్ తప్పించుకున్నాడు.
సింగ్ గీతం రిలీజ్
సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో వస్తున్న సింగ్ గీతం మూవీ జూన్ 11న థియేటర్లకు రాబోతుంది. ఇటీవల రిలీజ్ చేసిన ఈ మూవీ టీజర్ కు అదిరే రెస్పాన్స్ వస్తుంది. ఈ వయసులోనూ సింగీతం శ్రీనివాస రావు తనదైన స్టైల్లో ప్రయోగం చేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.