నేను ఒరిజినల్.. డూప్లికేట్ కాదు: బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. గ్రీన్ మ్యాట్ ముందు షూట్ చేసే హీరోలపై సెటైర్

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫ్ఫి) ఈవెంట్లో నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రీన్ మ్యాట్ ముందు యాక్ట్ చేసే హీరోను కాదని, తాను ఒరిజినల్ అని పేర్కొన్నారు. 

Published on: Nov 22, 2025 9:45 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నట సింహం నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోవాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫ్ఫి) 2025 ఈవెంట్ సందర్భంగా ఆయన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. సినిమా ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రజనీకాంత్, బాలకృష్ణను సత్కరించాలని ఇఫ్ఫి నిర్ణయించిన సంగతి తెలిసిందే.

నందమూరి బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ

బాలకృష్ణ కామెంట్లు

నటుడు నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది జూన్‌లో 65వ పడిలోకి అడుగుపెట్టారు. గత ఏడాది సినీ పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ నటుడిని గోవాలో జరిగిన అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవం సందర్భంగా సత్కరించారు. ఈ క్రమంలో విలేకరులతో మాట్లాడుతూ సెట్‌కు రాకుండా గ్రీన్ స్క్రీన్‌ల ముందు షూటింగ్ చేసే నటులపై ఆయన సెటైర్ వేశారు.

టెక్నికల్ డామినేషన్

బాలకృష్ణ గ్రీన్ స్క్రీన్‌తో షూటింగ్ చేసే నటులపై సెటైర్ వేశారు. తన 50 ఏళ్ల సినీ ప్రస్థానం గురించి చెబుతూ దర్శకత్వంలో 'టెక్నికల్ డామినేషన్' గురించి బాలకృష్ణ ప్రస్తావించారు. ఏఎన్ఐ ప్రకారం.. “నేను సినీ పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. ఎందుకంటే? నేను ఎన్టీఆర్ కుమారుడిని కాబట్టే కొనసాగుతున్నాను అని కాదు. నాకు సినిమాలపై ఉన్న అవగాహన, నేను తీసుకుంటున్న వారసత్వం. దానికోసం నేను గర్విస్తున్నా. ఈ రోజుల్లో సినిమా నిర్మాణం పూర్తిగా టెక్నిక్‌పై ఆధారపడి ఉంది” అని బాలకృష్ణ అన్నారు.

నేను ఒరిజినల్

తన పని కోసం టెక్నాలజీపై ఆధారపడే నటులతో పోలిస్తే తనను తాను 'ఒరిజినల్' అని పిలుచుకుంటూ బాలకృష్ణ ఇలా అన్నారు. “నా సినిమాలు పెద్దవి. కాబట్టి నా కథలు నాకు ముఖ్యం. అవసరమైనప్పుడు మేము (టెక్నాలజీ) ఉపయోగిస్తాము. ఈ రోజుల్లో వారు ప్రతిదానికీ దానిని ఉపయోగిస్తున్నారు. హీరోలు కూడా సెట్‌లకు రావడం లేదు. వారు కేవలం గ్రీన్ మ్యాట్ లేదా బ్లూ మ్యాట్ ముందు షూట్ చేస్తారు. నేను ఒరిజినల్. నేను డూప్లికేట్ కాదు” అని బాలకృష్ణ పేర్కొన్నారు.

బాలకృష్ణ కెరీర్

బాలకృష్ణ 1974లో 'తాతమ్మ కల' చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆయన తొలిసారిగా కథానాయకుడిగా నటించిన చిత్రం 1984 నాటి 'సాహసమే జీవితం'. గత కొంతకాలంగా 'అఖండ' (2021), 'వీర సింహారెడ్డి' (2023), 'భగవంత్ కేసరి' (2023), 'డాకు మహారాజ్' (2025) వంటి చిత్రాలతో వరుస విజయాలు సాధిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఆయన తదుపరి చిత్రం 'అఖండ 2' మూవీ ఆఖండకు సీక్వెల్‌గా రానుంది. సంయుక్త, హర్షాలీ మల్హోత్రాలతో కలిసి నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది.

News/Entertainment/నేను ఒరిజినల్.. డూప్లికేట్ కాదు: బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. గ్రీన్ మ్యాట్ ముందు షూట్ చేసే హీరోలపై సెటైర్
News/Entertainment/నేను ఒరిజినల్.. డూప్లికేట్ కాదు: బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. గ్రీన్ మ్యాట్ ముందు షూట్ చేసే హీరోలపై సెటైర్