Netflix Movie: కిచెన్‌లో శవం.. కాలనీలో కలకలం.. నెట్‌ఫ్లిక్స్‌లోకి నేరుగా వస్తున్న స్పిరిట్ హీరోయిన్ డార్క్ కామెడీ

Netflix Movie: బాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ మాధురీ దీక్షిత్, స్పిరిట్ మూవీ హీరోయిన్ తృప్తి డిమ్రి ప్రధాన పాత్రల్లో నటించిన సరికొత్త డార్క్ క్రైమ్-కామెడీ మూవీ 'మా బహెన్' (Maa Behen) నేరుగా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం నేరుగా నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా జూన్ 4 నుండి స్ట్రీమింగ్ కానుంది.

Published on: May 21, 2026, 18:41:16 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Netflix Movie: బాలీవుడ్‌లో సరికొత్త జోనర్‌తో అలరించేందుకు సిద్ధమైంది 'మా బహెన్'. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్‌ను స్కిప్ చేసి, నేరుగా డిజిటల్ వేదికపైకి రాబోతోంది. 'తుమ్హారీ సులు', 'జల్సా' వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు సురేష్ త్రివేణి ఈ నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీని రూపొందించారు. ఒక విభిన్నమైన క్రైమ్ కామెడీ కథాంశంతో వస్తున్న ఈ సినిమాపై ప్రస్తుతం ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

Netflix Movie: కిచెన్‌లో శవం.. కాలనీలో కలకలం.. నెట్‌ఫ్లిక్స్‌లోకి నేరుగా వస్తున్న స్పిరిట్ హీరోయిన్ డార్క్ కామెడీ
Netflix Movie: కిచెన్‌లో శవం.. కాలనీలో కలకలం.. నెట్‌ఫ్లిక్స్‌లోకి నేరుగా వస్తున్న స్పిరిట్ హీరోయిన్ డార్క్ కామెడీ

జూన్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో ల్యాండింగ్

'మా బహెన్' మూవీ ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ లో ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న విడుదల కానుంది. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా స్ట్రీమింగ్ తేదీని ప్రకటించింది. ఈ మూవీతో ప్రముఖ డిజిటల్ కంటెంట్ క్రియేటర్ ధర్నా దుర్గా బాలీవుడ్‌లోకి నటిగా అడుగుపెడుతుండటం విశేషం.

కిచెన్‌లో శవం.. కాలనీలో కలకలం

ఒక మధ్యతరగతి కుటుంబంలో ఎవరూ ఊహించని విధంగా జరిగే విచిత్ర పరిణామాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. రేఖ (మాధురీ దీక్షిత్), ఆమె కూతుళ్లు జయ (తృప్తి డిమ్రి), సుష్మ (ధర్నా దుర్గా) ఒక సాధారణ కాలనీలో నివసిస్తుంటారు. వీరు ముగ్గురూ ఎప్పుడూ ఏదో ఒక విషయంలో గొడవపడుతూనే ఉంటారు. అయితే ఒకరోజు అనుకోకుండా వారి ఇంటి కిచెన్‌లో ఒక గుర్తుతెలియని శవం ప్రత్యక్షమవుతుంది.

ఆ శవాన్ని చూసి భయాందోళనకు గురైన ఆ తల్లి, కూతుళ్లు.. తాము చేయని నేరం నుండి ఎలా తప్పించుకోవాలి? ఆ శవాన్ని కాలనీ వాళ్లకు తెలియకుండా ఎలా దాచాలి? అని పడే తాపత్రయమే ఈ సినిమా. ఏ చిన్న రహస్యాన్ని కూడా దాచలేని పొరుగువారు ఉన్న కాలనీలో.. ఈ ముగ్గురు మహిళలు అబద్ధాలు ఆడుతూ, కంగారు పడుతూ చేసే పనుల వల్ల ఎలాంటి గందరగోళం సృష్టిస్తుందన్నదే ఈ సినిమా ముఖ్య కథాంశం.

టీజర్‌లో ఏముందంటే?

ఇటీవలే విడుదలైన టీజర్‌లో తృప్తి డిమ్రి తన ఆన్-స్క్రీన్ తల్లి మాధురీ దీక్షిత్ ప్రవర్తనపై గొడవపడుతూ కనిపిస్తుంది. సరిగ్గా అదే సమయంలో వారి ఇంట్లో ఒక శవం బయటపడుతుంది. దాంతో భయపడిపోయిన ఈ ముగ్గురూ.. ఆ శవాన్ని మాయం చేయడానికి చేతులు కలుపుతారు. అయితే ఆ మర్డర్ తాము చేయలేదని వారు వాదిస్తారు. ఇంతకీ ఆ శవం ఎవరిది? అసలు ఆ హత్య చేసింది ఎవరు? అనేది నెట్‌ఫ్లిక్స్‌లో తేలనుంది.

ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తోంది. మాధురీ దీక్షిత్ (రేఖగా), తృప్తి డిమ్రి, ధర్నా దుర్గా, భోజ్‌పురి స్టార్ రవి కిషన్ (కీలక పాత్రలో)లతోపాటు గీతాంజలి కుల్కర్ణి, అరుణోదయ్ సింగ్, శార్దూల్ భరద్వాజ్ నటిస్తున్నారు. సురేష్ త్రివేణి, పూజా తోలాని కలిసి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించారు.

మేకర్స్ ఏమన్నారంటే?

చిత్ర నిర్మాత, అబుండెన్షియా ఎంటర్‌టైన్‌మెంట్ సీఈఓ విక్రమ్ మల్హోత్రా మాట్లాడుతూ.. " 'మా బహెన్' అనేది ఒక అద్భుతమైన కథాంశంతో సాగుతూనే, మానవీయ సంబంధాల వెనుక ఉన్న ఎమోషనల్ నిజాలను చూపిస్తుంది. ఈ గందరగోళం, కామెడీ వెనుక.. ఒక కుటుంబం, సమాజం, ఈ జడ్జ్‌మెంటల్ ప్రపంచంలో బ్రతకడానికి మనుషులు తీసుకునే నిర్ణయాల చుట్టూ సాగే కథ ఇది" అని పేర్కొన్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More