Niharika Konidela On Being Deserves In Mega Family: బుల్లితెరపై యాంకర్గా, వెండితెరపై హీరోయిన్గా ఇచ్చిన మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా మారి మంచి సక్సెస్ అందుకుంది. ఇటీవల ఆమె నిర్మాతగా మారి రూపొందించిన కమిటీ కుర్రోళ్లు సినిమాకు 2 నేషనల్ అవార్డ్స్ వచ్చిన విషయం తెలిసిందే.
72 నేషనల్ అవార్డ్స్

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్లపై పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాణంలో రూపొందిన కమిటీ కుర్రోళ్లు సినిమాతో యదు వంశీ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా 72వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో సత్తా చాటుకుంది.
ఉత్తమ జాతీయ తెలుగు చిత్రం, బెస్ట్ మేకప్ కేటగిరీల్లో రెండు జాతీయ అవార్డులను ‘కమిటీ కుర్రోళ్లు’ కొల్లగొట్టింది. ఈ సందర్భంగా ఇటీవల చిత్రయూనిట్ తమ ఆనందాన్ని పంచుకునేందుకు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడిన నిహారిక కొణిదెల కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
నా 32 ఏళ్ల జీవితంలో
నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ .. "‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంలో పని చేసిన ప్రతీ ఒక్కరి జర్నీ నాకు తెలుసు. ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రానికి జాతీయ అవార్డులు రావడంతో నా మనసు సంతృప్తితో నిండిపోయింది. నా 32 ఏళ్ల ఈ జీవితంలో ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాకి ఓకే చెప్పడంతో గొప్ప నిర్ణయం" అని అన్నారు.
"ఇది నా సినిమా, ప్రాణం పెట్టాలని అప్పుడే ఫిక్స్ అయ్యాను. మంచి సినిమా తీసినా కూడా అది ఆడియెన్స్ వరకు తీసుకు వెళ్లగలగాలి. ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంలో అందరి కష్టం ఉంది. మంచి సినిమా తీసినప్పుడు ఇలాంటి ఓ గొప్ప ఫీలింగ్ కలుగుతుందంటే.. నా జీవితంలో ఎప్పుడూ ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్లను" అని నిహారిక కొణిదెల తెలిపింది.
నేషనల్ అవార్డ్ కోసం సినిమా తీయలేదు
"యదు వంశీ గారు ఎప్పుడూ నేషనల్ అవార్డ్ వస్తుందని చెబుతూనే ఉండేవారు. కానీ, నేను ఒక నేషనల్ అవార్డ్ సినిమా తీయాలని ‘కమిటీ కుర్రోళ్లు’ని నిర్మించలేదు. ఈ జర్నీలో మాత్రం నేను కూడా జాతీయ అవార్డు రావాలని కోరుకున్నాను. 72వ జాతీయ అవార్డుల్లో మేం కూడా ఉండాలని అనుకున్నాను. నా కల నేడు నెరవేరింది" అని నిహారిక సంతోషం వ్యక్తం చేసింది.
{{/usCountry}}"యదు వంశీ గారు ఎప్పుడూ నేషనల్ అవార్డ్ వస్తుందని చెబుతూనే ఉండేవారు. కానీ, నేను ఒక నేషనల్ అవార్డ్ సినిమా తీయాలని ‘కమిటీ కుర్రోళ్లు’ని నిర్మించలేదు. ఈ జర్నీలో మాత్రం నేను కూడా జాతీయ అవార్డు రావాలని కోరుకున్నాను. 72వ జాతీయ అవార్డుల్లో మేం కూడా ఉండాలని అనుకున్నాను. నా కల నేడు నెరవేరింది" అని నిహారిక సంతోషం వ్యక్తం చేసింది.
{{/usCountry}}"ఆర్టిస్టుల్ని 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లుగా మారేందుకు ఎంతో మేకోవర్ జరిగింది. ఈ జర్నీలో రవి, అక్షయ్ మాకు ఎంతో సపోర్ట్ చేశారు. రవికి నేషనల్ అవార్డ్ రావడం ఆనందంగా ఉంది. మా నాన్న తీసిన ‘రుద్రవీణ’కి మూడు జాతీయ అవార్డులు వచ్చాయి. మా పెదనాన్న గారు, బాబాయ్ గారు సినిమాకి సేవ చేశారు. నేను కొణిదెల ఫ్యామిలీ నుంచి వచ్చాను.. ఏదో ఒకటి చేశాను అని ఇప్పుడు అనిపిస్తోంది" అని నిహారిక కొణిదెల పేర్కొన్నారు.
ఇప్పుడు అర్హురాలిని
"నేను మెగా ఫ్యామిలీలో ఉన్నాను.. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాను అని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఈ ఫ్యామిలీలో నేను ఉండేందుకు అర్హురాలిని అని ఇప్పుడు గర్వంగా చెప్పుకోగలను. జాతీయ అవార్డులు సాధించిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. సినిమా చూసిన తర్వాత మీడియా, ఆడియెన్స్ ఇలా అందరూ కూడా నేషనల్ అవార్డ్ వస్తుందని అన్నారు. మాకు రెండు జాతీయ అవార్డులు వచ్చాయి" అని నిహారిక వెల్లడించారు.
"ఈ జర్నీలో సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్. చిరంజీవి గారే అందరికీ గర్వకారణం అని నేను ఫీల్ అవుతుంటాను. ఆయనే నన్ను గర్వకారణం అని అనడంతో ఎంతో ఆనందంగా ఉంది. ‘రుద్రవీణ’కి మీ నాన్న (నాగబాబు) తీసుకున్నారు.. ఇప్పుడు నువ్వు తీసుకుంటున్నావ్.. మాకెంతో గర్వంగా ఉంది’ అని ఆయన అనడం నాకు మరింత గర్వంగా ఉంది" అని మెగా డాటర్ నిహారిక కొణిదెల చెప్పుకొచ్చారు.