నిహారిక కొణిదెల సంచలన పోస్టు పెట్టింది. ఫిల్మ్ఫేర్ అవార్డులు సౌత్ 2026 ఈవెంట్ ఆర్గనైజర్లపై మండిపడింది. డెబ్యూ విన్నర్స్ కు స్టేజీపై మాట్లాడే ఛాన్స్ ఇవ్వరా? అని ప్రశ్నించింది. ఒక్క నిమిషం దొరకలేదా? అని అడిగింది. ఈ పోస్టు వైరల్ గా మారింది.
ఫిల్మ్ఫేర్ అవార్డులు

ఫిల్మ్ఫేర్ అవార్డులు సౌత్ 2026 ఈవెంట్ కేరళలోని కొచ్చిలో ఘనంగా జరిగింది. కానీ ఈ ఈవెంట్ జరిగిన తీరు పట్ల నిహారిక కొణిదెల నిరాశ వ్యక్తం చేసింది. తన మనసులోని మాటను నిర్మొహమాటంగా పంచుకుంది. ఆదివారం (ఫిబ్రవరి 22) ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు పెట్టింది.
అద్భుతంగా ఉన్నా
ఫిల్మ్ఫేర్ అవార్డులు సౌత్ 2026 ఈవెంట్ లో డెబ్యూ అవార్డులు గెలిచిన వాళ్లకు స్టేజీపై మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపై నిహారిక ఫైర్ అయింది.
‘‘ఫిల్మ్ఫేర్ అవార్డులలో ఇండియన్ సినిమా టాలెంట్ ను గుర్తించడం ఎప్పుడూ ప్రత్యేకమే. అద్భుతమైన ప్రతిభను ఒకే చోట చూడటం నిజంగా ఎంతో స్పెషల్ గా అనిపించింది’’ అని నిహారిక తన పోస్టులో రాసుకొచ్చింది.
కల నెరవేరినట్లు
‘‘తెలుగు, తమిళ, కన్నడ సినిమా రంగాల్లోంచి డెబ్యూ అవార్డులు అందుకున్న వారికి స్టేజీపై మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఇది ఒక మంచి అవకాశాన్ని కోల్పోవడమే అని నేను అనుకుంటున్నా. డెబ్యూ అవార్డులు గెలిచిన వాళ్లు ఇప్పుడే తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఈ స్టేజ్ వీళ్లకు ఒక పర్ఫార్మెన్స్ స్టేజీ మాత్రమే కాదు. అవార్డు అందుకోవడమంటే వాళ్ల కల నెరవేరినట్లు’’ అని నిహారిక కొణిదెల పేర్కొంది.
ఒక్క నిమిషం
{{/usCountry}}‘‘తెలుగు, తమిళ, కన్నడ సినిమా రంగాల్లోంచి డెబ్యూ అవార్డులు అందుకున్న వారికి స్టేజీపై మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఇది ఒక మంచి అవకాశాన్ని కోల్పోవడమే అని నేను అనుకుంటున్నా. డెబ్యూ అవార్డులు గెలిచిన వాళ్లు ఇప్పుడే తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఈ స్టేజ్ వీళ్లకు ఒక పర్ఫార్మెన్స్ స్టేజీ మాత్రమే కాదు. అవార్డు అందుకోవడమంటే వాళ్ల కల నెరవేరినట్లు’’ అని నిహారిక కొణిదెల పేర్కొంది.
ఒక్క నిమిషం
{{/usCountry}}‘‘వాళ్ల మాటలు వింటే సినిమాలపై ఎందుకు ప్రేమ పెంచుకున్నామో అందరికీ గుర్తుకు వచ్చేది. ఇంత భారీ ఈవెంట్లో సమయ పరిమితులు తప్పనిసరి అని నాకు తెలుసు. కానీ మొదటి సారి వేదికపై నిలబడ్డ వాళ్లకు ఒక్క నిమిషం ఇస్తే బాగుండేది. ఇప్పుడు ఆ నిమిషమే తన లైఫ్ టైమ్ ను కోల్పోయింది’’ అని నిహారిక తన పోస్టులో పేర్కొంది.
ఈ అవార్డులు
నిహారిక కొణిదెల నటిగా తన జర్నీ కొనసాగిస్తూనే ప్రొడ్యూసర్ గానూ అదరగొడుతోంది. ఆమె నిర్మాతగా వచ్చిన కమిటీ కుర్రోళ్లు సినిమా హిట్ గా నిలిచింది. ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా కమిటీ కుర్రోళ్లు సినిమా డైరెక్టర్ యధు వంశీ, బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా కమిటీ కుర్రోళ్లు నటుడు సందీప్ సరోజ్ పురస్కారాలు అందుకున్నారు. వీళ్లకు ఆ స్టేజీపై మాట్లాడే ఛాన్స్ రాలేదు.