నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 26 ఎపిసోడ్ లో.. సిద్ధాంతిని శాలిని తల్లి సునంద కలుస్తుంది. మీరే నా సమస్య సిద్ధాంతి. మీ దగ్గరకు వచ్చి సహాయం అడిగిన శాలిని నా కూతురు. ఆమె చెప్పిన విషయం మీరు అంగీకరించలేదని తెలిసింది. కొన్ని సార్లు పరిస్థితుల ప్రభావం వల్ల తప్పులు చేయాలి. మీ కూతురు చస్తే తప్పు చేస్తారా? అని సునంద వార్నింగ్ ఇస్తుంది.
బెదిరించిన సునంద

మీ కూతురు బెంగళూరులో జాబ్ చేస్తోంది. మీ భార్య ఇప్పుడు రైతు బజార్ లో కూరగాయలు కొంటుంది. వీళ్లకు ఏమైనా అయితే ఎలా అని సిద్ధాంతిని సునంద బెదిరిస్తుంది. గన్ తీసి గురి పెడుతుంది. భయపడ్డ సిద్ధాంతి జాతకం తప్పుగా చెప్పేందుకు ఒప్పుకొంటాడు. ఆ తర్వాత రఘురాం ఇంటికి వెళ్లి చంద్రకళ కడుపులో బిడ్డతో జగదీశ్వరికి ప్రాణగండం ఉందని అబద్ధం చెప్తాడు.
శాలిని సైకో ఆనందం
సునందను కలిసిన శాలిని సంతోషంతో ఎగిరి గంతులేస్తుంది. ఇల్లు శోకసంద్రంలో మునిగిపోయిందని శాలిని చెప్తుంది. ఏ కన్ను పొడుచుకోవాలో తెలియక చంద్ర ఏడుస్తుంది. క్రాంతి ఒక్కడే నమ్మలేదు. కానీ ఫ్యామిలీ అంతా ఎమోషనల్ పూల్స్ కదా. వెళ్లి ఇంట్లో జరిగే తమాషా చూడాలని శాలిని వెళ్లిపోతుంది.
కారంగా చేపల పులుసు
మరోవైపు శ్రుతి చేపల పులుసు ప్రిపేర్ చేస్తుంది. మొదటి సారి కోడలి చేతి వంట రుచి చూడబోతున్నానని సరోజ ఎదురు చూస్తుంది. తీరా చూస్తే అన్నం కిచిడీ అవుతుంది. పులుసులో చేపలు కనిపించడం లేదని రాజ్ అడుగుతాడు. బాగా ఉడికించాను కాబట్టి అందులోనే కలిసిపోయాయని శ్రుతి చెప్తుంది. నోట్లో ముద్ద పెట్టుకోగానే కారం అంటూ రాజ్, సరోజ హడలెత్తిపోతారు.
చంద్ర కన్నీళ్లు
ఇక సిద్ధాంతి చెప్పిన మాటలు తలుచుకుంటూ చంద్రకళ ఏడ్చేస్తుంది. దేవుడికి మొర పెట్టుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అది చూసిన జగదీశ్వరి కూడా ఫీల్ అవుతుంది. ఇంటి వారసుడి కోసం అత్తయ్య, మామయ్య ఎదురు చూస్తున్నారు. వాళ్ల కోరిక తీర్చే అవకాశం నాకు వచ్చినందుకు సంతోషపడ్డా. కానీ ఇప్పుడు ఏ ప్రాణాన్ని కాపాడుకోవాలి? అని దేవుడి ముందు చంద్ర బాధపడుతుంది.
{{/usCountry}}ఇక సిద్ధాంతి చెప్పిన మాటలు తలుచుకుంటూ చంద్రకళ ఏడ్చేస్తుంది. దేవుడికి మొర పెట్టుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అది చూసిన జగదీశ్వరి కూడా ఫీల్ అవుతుంది. ఇంటి వారసుడి కోసం అత్తయ్య, మామయ్య ఎదురు చూస్తున్నారు. వాళ్ల కోరిక తీర్చే అవకాశం నాకు వచ్చినందుకు సంతోషపడ్డా. కానీ ఇప్పుడు ఏ ప్రాణాన్ని కాపాడుకోవాలి? అని దేవుడి ముందు చంద్ర బాధపడుతుంది.
{{/usCountry}}నాకు రెండు ప్రాణాలు ముఖ్యమే. ఒక్క ప్రాణాన్ని ఎంచుకోమనడం అన్యాయం స్వామి. నా భర్తకు ఎలా చెప్పగలను? ఆయన ఎలా తట్టుకుంటారు? అని చంద్ర ఏడ్చేస్తుంది. చంద్ర దగ్గరకు జగదీశ్వరి వెళ్తుంది.
ప్రాణాలు వదిలేయడానికి
ఏం జరగాలని రాసి ఉంటే, అదే జరుగుతుంది. నీ స్థానంలో ఎవరున్నా అత్త ప్రాణాల కంటే బిడ్డ ప్రాణాలే ముఖ్యమని కోరుకుంటారు. కానీ నువ్వు నా ప్రాణాల గురించి ఆలోచిస్తున్నావు. నా బిడ్డ కోసం, వాడికి పుట్టబోయే బిడ్డ కోసం ప్రాణాలు వదలేయడానికి సంతోషంగా సిద్ధపడతానని జగదీశ్వరి అంటుంది. ఎప్పుడో ఒకప్పుడు ప్రాణం పోవాల్సిందేనని చెప్తుంది.
నా తర్వాత ఈ ఇంటిని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావనే నమ్మకం నాకుంది. నాకు ఏ బాధ లేదని చంద్రతో జగదీశ్వరి చెప్తుంది. మరోవైపు క్రాంతి కోసం శాలిని షర్ట్ తీసుకువస్తుంది. అసలు మనిషివేనా నువ్వు? ఇంట్లో అందరు ఏ మూడ్ లో ఉన్నారు? నువ్వు ఏం చేస్తున్నావని క్రాంతి ఫైర్ అవుతాడు. ఇక్కడతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.