నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 11 ఎపిసోడ్ లో.. జల రాజ్ ట్రావెల్స్ ఆఫీస్ స్టార్ట్ చేస్తాడు. మొదటి పేమెంట్ తన భార్య చేతుల మీదుగా జరగాలని రాజ్ కోరుకుంటాడు. ఆఫీస్ చెయిర్ లో శ్రుతిని కూర్చోబెడతాడు. రూ.20 వేలను ఆన్ లైన్ పేమెంట్ చేయమని కస్టమర్ ను కోరతాడు. నా షేర్ నాకు కావాలని శ్రుతి అడుగుతుంది.
శ్రుతి షాక్

ఆ మనీ అమ్మ అకౌంట్లో పడింది. ఆ అకౌంట్ కు డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లాంటివి ఏమీ లేవు. డబ్బులు తీయాలంటే బ్యాంక్ కు వెళ్లి అమ్మ సంతకం చేయాల్సిందేనని రాజ్ చెప్పడంతో శ్రుతి షాక్ అవుతుంది. మరోవైపు మాయను విరాట్ కాపాడటంపై ఫ్యామిలీ ప్రశ్నలు వేస్తుంది. శ్రుతి డ్రెస్ వేసుకుని మాయ బయటకు వస్తుంది.
మాయ గతం
మాయకు తన ఫ్యామిలీని విరాట్ పరిచయం చేస్తాడు. మాయ నీకు ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ నీకు మేమున్నామని రఘురాం అడుగుతాడు. మాయ ఏడుస్తూ తన గురించి చెప్తుంది. భర్త బిజినెస్ మ్యాన్ అని, కోట్లు సంపాదిస్తున్న రాక్షసుడు అని మాయ చెప్తుంది. క్యాంపస్ సెలక్షన్ లో నాకు జాబ్ వచ్చింది. ఆఫీస్ లో పనిచేసే అబ్బాయి లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత నా స్టార్టప్ ఐడియాను తీసుకుని నన్ను ఇంటికే పరిమితం చేశాడని మాయ చెప్తుంది.
చనిపోవాలని
నన్ను ఇంట్లో నుంచి బయటకు రాకుండా టార్చర్ చేశాడు. తప్పించుకుని బయటకు వచ్చినా అతని పలుకుబడితో ఎవరూ నాకు సపోర్ట్ చేయలేదు. హైదరాబాద్ లో కూడా నాకు జాబ్ రాకుండా చేశాడు. అతణ్ని ఎదుర్కొనే శక్తి లేక చనిపోవాలని అనుకున్నానని మాయ అంటుంది. వాడిని ఊరికే వదలకూడదు, ఎవరు వాడు అని విరాట్, చంద్రకళ అడుగుతారు.
నువ్వు ఓడిపోకూడదు, వాడి ముందు గెలిచి నిలబడాలని జగదీశ్వరి చెప్తుంది. ఇప్పుడు నువ్వు అలసిపోయావు మాయ. తిరిగి కొత్త శక్తి తెచ్చుకోవాలి. అప్పటివరకూ ఇక్కడే ఉండమని చంద్రకళ చెప్తుంది.
విరాట్ కు చంద్ర సపోర్ట్
{{/usCountry}}నువ్వు ఓడిపోకూడదు, వాడి ముందు గెలిచి నిలబడాలని జగదీశ్వరి చెప్తుంది. ఇప్పుడు నువ్వు అలసిపోయావు మాయ. తిరిగి కొత్త శక్తి తెచ్చుకోవాలి. అప్పటివరకూ ఇక్కడే ఉండమని చంద్రకళ చెప్తుంది.
విరాట్ కు చంద్ర సపోర్ట్
{{/usCountry}}మాయను ఇంటికి తీసుకొచ్చి తొందరపడ్డానేమో చంద్ర. నీకు ఇబ్బంది అవుతుందని విరాట్ అంటాడు. మాయ ఇక్కడే ఉండటం బెటర్. నీ డిసిషన్ తప్పేమీ కాదు. మాయ నీ ఫ్రెండ్ బావ. నాకు ఏ ఇబ్బంది లేదని చంద్ర చెప్తుంది. మాయ లాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదని చంద్ర అంటుంది. మరోవైపు రాజ్ కు సరోజా దిష్టి తీస్తుంది. శ్రుతిని, కామాక్షిని కంట్రోల్ లో ఉండమని సరోజా చెప్తుంది.
క్రాంతి ఫైర్
మాయను కాస్త చూసుకోమ్మని శ్యామలకు విరాట్ చెప్తాడు. ఇప్పుడు మాయను కూడా మరో కూతురు అనుకుంటానని శ్యామల అంటుంది. టూ డేస్ తర్వాత ల్యాండ్ ఓనర్ ను కలిసేందుకు బెంగళూరు వెళ్తానని క్రాంతితో విరాట్ చెప్తాడు. సిటీ మేయర్ తో మాట్లాడతానని శాలిని అంటే క్రాంతి ఫైర్ అవుతాడు. అలాంటి మనిషిని ఎంత దూరం పెడితే అంత మంచిదని క్రాంతి అనడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.