...
...
Next Story

Ninnu Kori September 3 Episode: నిన్ను కోరి- మదన్ కిడ్నాప్- ఆగిపోయిన చంద్ర ఎంగేజ్‌మెంట్- మాయ బిడ్డతో జగదీశ్వరికి చికిత్స

Ninnu Kori Serial September 3rd Episode: నిన్ను కోరి సీరియల్ సెప్టెంబర్ 3వ ఎపిసోడ్‌‌లో మదన్ కనిపించకపోవడంతో చంద్రకళ ఎంగేజ్‌మెంట్ ఆగిపోతుంది. కిడ్నాప్ నుంచి బయటకొచ్చిన మదన్ తనకు అలా చేసింది కామాక్షి, శ్రుతిలే అని చెబుతాడు. అదంతా విరాట్ బెదిరించడం వల్లే చేసినట్లు విరాట్‌పై నింద నెట్టేస్తారు.

Updated on: Sep 3, 2026, 09:00:19 IST
Advertisement

Ninnu Kori Serial Today Episode: నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో స్వీట్‌లో మత్తుమందు కలిపి మదన్‌ తినేలా చేస్తారు కామాక్షి, శ్రుతి. ఆ తర్వాత మదన్ వాష్‌రూమ్ నుంచి రాగానే దుప్పటి కప్పి తమ ప్లాన్ అమలు చేస్తారు కామాక్షి, శ్రుతి.

మదన్ కిడ్నాప్

నిన్ను కోరి సీరియల్ సెప్టెంబర్ 3 ఎపిసోడ్
నిన్ను కోరి సీరియల్ సెప్టెంబర్ 3 ఎపిసోడ్

ఎనర్జీ కోసం గ్లూకోజ్ అని చెప్పి మత్తు మందు కలిపిన స్వీట్ తినిపించి అతడిని స్పృహ తప్పేలా చేశారు. నిశ్చితార్థ ముహూర్తం దాటిపోయే వరకు అతడిని దుప్పటి మూట కట్టి స్టోర్ రూమ్‌లో దాచాలని నిర్ణయించుకుంటారు తల్లీకూతుళ్లు. ఇంతలో తలపై దెబ్బ తగిలి స్పృహలోకి వచ్చిన మందర అక్కడికి వచ్చి, తన జ్యూస్‌లో మత్తు మందు కలపడం, ఉంగరాలు దొంగిలించడం చూడటం గుర్తు చేసుకుంటుంది.

అందరిముందు ఇదే చెప్పి తన తలపై కామాక్షి, శ్రుతిలే కొట్టి చేశారని ఆరోపిస్తుంది మందర. అయితే శ్రుతి చాకచక్యంగా స్పందిస్తూ, గతంలో "భర్త వదిలేసిన వాళ్లు శుభకార్యం పనులు చేయకూడదు" అని మందర అన్న మాటలనే గుర్తుచేసి ఆమెను అక్కడ నుంచి పంపించేసింది. ఆ తర్వాత కామాక్షి, శ్రుతి ఇద్దరూ కలిసి మదన్‌ను స్టోర్ రూమ్‌లోకి లాక్కెళ్లి డోర్ లాక్ చేసి హాయిగా ఊపిరి పీల్చుకుంటారు.

ఆగిపోయిన నిశ్చితార్థం - విరాట్ రచ్చ

మదన్ కనిపించడు. తాళ్లతో కట్టేసి మదన్‌ను కిడ్నాప్ చేస్తారు శ్రుతి, కామాక్షి. నిశ్చితార్థ ముహూర్తానికి కేవలం 10 నిమిషాల సమయం మాత్రమే ఉండటంతో పంతులుగారితో సహా ఇంట్లోని వారంతా తీవ్ర కంగారు పడ్డారు. ఎవరూ స్టోర్ రూమ్ వైపు వెళ్లకుండా కామాక్షి అత్యంత చాకచక్యంగా అందరినీ డైవర్ట్ చేస్తుంటుంది. ఇక శ్రుతి తల్లికి తోడుగా నిలుస్తుంది.

చంద్రకళ నిశ్చితార్థం ఆగిపోయిందని, తనకు అన్యాయం జరిగిందని కావాలనే పైకి ఎడుస్తూ లోలోపల మాత్రం సంతోషిస్తుంది. ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయ్యేలా చేసిన కామాక్షి, శ్రుతికి మనసులో థ్యాంక్స్ చెప్పుకుంటుంది చంద్రకళ. విరాట్ వచ్చిన అతిథులందరినీ పంపించేసి ఆనందంతో డాన్స్ చేస్తాడు.

బయటపడ్డ నిజం - విరాట్ స్ట్రాంగ్ కౌంటర్

కొద్దిసేపటికి స్టోర్ రూమ్‌లో బంధించిన మదన్ కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు వింటారు. స్టోర్ రూమ్ నుంచే కేకలు వినిపిస్తున్నాయని వెళ్లి మదన్‌ను బయటకు తీసుకొస్తారు. కామాక్షి, శ్రుతిలే తనకు మత్తు మందు ఇచ్చి బంధించారని మదన్ నిజం చెప్పేస్తాడు. అందరిముందు కామాక్షి, శ్రుతి దొరికిపోవడంతో విరాట్‌పై నింద వేస్తారు.

విరాట్ బెదిరించడం వల్లే తాము ఇలా చేశామని కామాక్షి, శ్రుతి అంటారు. దానికి విరాట్‌ను తప్పుబడతారు చంద్రకళ, మదన్. అయితే విరాట్ "నేను ఎదురుగా వచ్చి నరికేస్తాను తప్ప ఇలాంటి వెన్నుపోటు పనులు చేయను" అని మాస్ కౌంటర్ ఇస్తాడు విరాట్. అలాగే "దమ్ముంటే ఇప్పుడు చేసుకో ఎంగేజ్‌మెంట్" అని చంద్రకళకు సవాల్ విసిరి అక్కడి నుంచి వెళ్లిపోతాడు విరాట్.

డబ్బు గుంజమన్న పాకెట్ పవన్

మరోవైపు నిశ్చితార్థం ఆగిపోవడంతో ఈ గ్యాప్‌లో ఇంట్లో ఎవరినైనా బురిడీ కొట్టించి వీలైనంత డబ్బు గుంజమని మదన్‌కు ఫోన్ చేసి సలహా ఇస్తాడు పాకెట్ పవన్. మరోవైపు డాక్టర్‌ను క్రాంతి కలుస్తాడు. జగదీశ్వరి చికిత్సకు 'స్టెమ్ సెల్' ఉపయోగపడుతుందని క్రాంతికి డాక్టర్ చెబుతాడు.

మాయ కడుపులోని బిడ్డ శాంపిల్స్‌తో జెనెటిక్ కాంపాటబిలిటీ టెస్ట్ చేసి, మ్యాచ్ పర్సంటేజ్ బాగుంటే చికిత్స ప్రారంభించవచ్చని డాక్టర్ వివరిస్తాడు. ఈ టెస్ట్‌కు మాయ ఒప్పుకోగా, మ్యాచ్ పర్సంటేజ్ ఎక్కువ వచ్చి టెస్ట్ సక్సెస్ అవ్వాలని, జగదీశ్వరి త్వరగా కోలుకోవాలని చంద్రకళ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe