Ninnu Kori Serial Today Episode: నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. మాయ ఆడుతున్న నాటకాన్ని రట్టు చేస్తూ విరాట్ అసలు నిజాన్ని రాబట్టడంతో కథ తీవ్ర ఉత్కంఠభరితంగా మారింది. జగదీశ్వరి చికిత్సకు మాయ కడుపులోని బిడ్డ శాంపిల్స్ 90 శాతం వరకు పర్ఫెక్ట్గా సరిపోలిందని రఘురామ్ ప్రకటించడంతో ఇంట్లో అందరూ తెగ సంతోషపడతారు.
విరాట్లో మొదలైన అనుమానం

అయితే, గతంలో డాక్టర్ చెప్పిన విషయాలను గుర్తుతెచ్చుకున్న విరాట్కు ఈ రిపోర్టుపై బలమైన అనుమానం వ్యక్తమవుతుంది. నిజం తేల్చుకోవడానికి ఎవరికీ చెప్పకుండా ఐవీఎఫ్ సెంటర్కు బయలుదేరతాడు విరాట్.
సరోగసీ బిడ్డ గురించి నిలదీసిన విరాట్
హాస్పిటల్కు చేరుకున్న విరాట్, సరోగసీ డాక్టర్ను బిడ్డ శాంపిల్స్ గురించి అడుగుతాడు. కానీ, డాక్టర్ విషయం చెప్పకుండా నీళ్లు నములుతాడు. విరాట్ ఎంత అడిగిన ఒక పట్టాన ఒప్పుకోడు డాక్టర్. దాంతో ఓపిక నశించిన విరాట్ డాక్టర్ను భయపెట్టి తీవ్రంగా నిలదీస్తాడు.
ఐవీఎఫ్ సెంటర్లో హైడ్రామా.. అసలు నిజం బహిర్గతం
నిజం చెప్పకపోతే హాస్పిటల్ వ్యవహారాన్ని ఇంటర్నెట్లో వైరల్ చేస్తానని విరాట్ బెదిరిస్తాడు. దానికి భయపడిన డాక్టర్ అసలు నిజాన్ని ఒప్పుకుంటుంది. మాయ కడుపులో పెరుగుతున్న బిడ్డ మాయది కాదని, అది చంద్ర-విరాట్ల కడుపున పుట్టాల్సిన బిడ్డేనని తేల్చిచెబుతుంది. అది విని విరాట్ ఒక్కసారిగా షాక్ అవుతాడు.
మాయ భయం.. శాలిని కుట్ర
ఈ నిజం విరాట్ను తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తుంది. విరాట్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. విరాట్కు నిజం తెలిసిపోయిందని డాక్టర్ మాయకు ఫోన్ చేసి చెబుతుంది. దాంతో మాయ తెగ టెన్షన్ పడుతుంటుంది. విరాట్ తప్పించుకోడానికి బిడ్డను అడ్డుపెట్టుకుంటానని, కావాల్సి వస్తే బిడ్డను చంపేస్తానని మాయ ఆవేశపడుతుంది.
తప్పించుకునేందుకు కొత్త ప్లాన్
"ఈ బిడ్డే నీకు రక్షణ కవచం, అది నీ దగ్గర ఉన్నంత వరకే నీకు బలం" అని శాలిని మాయకు సలహా ఇచ్చి శాంతపరుస్తుంది. విరాట్ ఇంటికి చేరేలోపే తప్పించుకునేందుకు శాలిని, మందరతో కలిసి కొత్త ప్లాన్ వేస్తుంది.
ఇంటికి పరుగు తీసిన విరాట్
{{/usCountry}}"ఈ బిడ్డే నీకు రక్షణ కవచం, అది నీ దగ్గర ఉన్నంత వరకే నీకు బలం" అని శాలిని మాయకు సలహా ఇచ్చి శాంతపరుస్తుంది. విరాట్ ఇంటికి చేరేలోపే తప్పించుకునేందుకు శాలిని, మందరతో కలిసి కొత్త ప్లాన్ వేస్తుంది.
ఇంటికి పరుగు తీసిన విరాట్
{{/usCountry}}చంద్రకళకు తల్లి అయ్యే భాగ్యం ఉందనే నిజం తెలుసుకున్న విరాట్, మాయ మోసాన్ని అందరి ముందూ పెట్టేందుకు ఆవేశంగా ఇంటికి బయలుదేరతాడు. మరోవైపు ఊరు వెళ్తున్నామనే అబద్ధపు నెపంతో ఇల్లు వదిలి వెళ్లేందుకు మాయ, మందర సిద్ధమవుతారు. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.