...
...
Next Story

ధురంధర్ రికార్డు బ్రేక్ చేసిన మలయాళీ హారర్ కామెడీ థ్రిల్లర్-ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

మలయాళ లేటెస్ట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘సర్వం మాయ’ మూవీ థియేటర్లలో అదరగొడుతోంది. కలెక్షన్లలో దూసుకెళ్తోంది. తొలి వారం కలెక్షన్ల పర్సంటేజీ పరంగా చూసుకుంటే ధురంధర్ రికార్డు బ్రేక్ చేసింది. ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇక్కడ చూద్దాం.

Published on: Jan 3, 2026, 17:23:45 IST
Advertisement

మలయాళ కామెడీ హారర్ థ్రిల్లర్ ‘సర్వం మాయ’ థియేటర్లలో సత్తాచాటుతోంది. డిసెంబర్ 25న రిలీజైన ఈ మూవీ కలెక్షన్ల దుమ్మురేపుతోంది. తొలి వారం కలెక్షన్ల పరంగా చూసుకుంటే బ్లాక్ బస్టర్ ధురంధర్ రికార్డును బ్రేక్ చేసింది సర్వం మాయ. ఈ మూవీ ఏ ఓటీటీలోకి వస్తుందో ఇక్కడ చూసేయండి.

సర్వం మాయ ఓటీటీ

ఓటీటీలోకి మలయాళ కామెడీ హారర్ థ్రిల్లర్ (Screengrab from YouTube/Akhil Sathyan and FireFly Films & Arts)
ఓటీటీలోకి మలయాళ కామెడీ హారర్ థ్రిల్లర్ (Screengrab from YouTube/Akhil Sathyan and FireFly Films & Arts)

మలయాళ హారర్ కామెడీ థ్రిల్లర్ సర్వం మాయ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో సర్వం మాయ ఓటీటీ రిలీజ్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఈ మూవీ జియోహాట్‌స్టార్‌ ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ సొంతం చేసుకుంది.

స్ట్రీమింగ్ ఎప్పుడు?

సర్వం మాయ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ అయింది. ఈ మూవీ జియోహాట్‌స్టార్‌లోకి రానుంది. అయితే మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ పై క్లారిటీ రావాల్సి ఉంది. ఇది త్వరలో ఆన్‌లైన్‌లోకి వచ్చే అవకాశం లేదు. సినిమా విడుదలైన 45 రోజుల తర్వాతే స్ట్రీమింగ్ ప్రారంభమవుతుందని నివేదికలు చెబుతున్నాయి. అంటే మలయాళ చిత్రం కనీసం ఫిబ్రవరి రెండవ వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది.

నివిన్ కమ్ బ్యాక్

మలయాళం కామెడీ-డ్రామా 'సర్వం మాయ' డిసెంబర్ 25న విడుదలైంది. నివిన్ పాల్ కు ఇది బలమైన కంబ్యాక్. కొత్త నటి రియా షిబు ఫాంటసీ సినిమాలో కీలక పాత్ర పోషించారు. పాలక్కాడ్ లోని సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన నాస్తిక వాది అయిన ప్రభేందు నంబూతిరి కథ ఇది. సంగీతకారుడు కావాలని అతను కలలు కంటాడు.

సర్వం మాయ మొదటి రోజు రూ.3.35 కోట్లతో స్థిరంగా ప్రారంభమైంది. రెండవ రోజు కలెక్షన్స్ రూ.3.9 కోట్లకు మెరుగుపడ్డాయి. వారాంతంలో శనివారం రూ.4.85 కోట్లు, ఆదివారం రూ.5.8 కోట్లతో మరింత మెరుగైన వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఇప్పుడు రూ.84.65 కోట్లు. ఈ సినిమా బడ్జెట్ రూ. 30 కోట్లు. మొదటి వారంలోనే సినిమా లాభాల జోన్‌లోకి ప్రవేశించింది.

ఆదిత్య ధర్ సినిమా స్పై థ్రిల్లర్ ధురంధర్, దాని రాబోయే సీక్వెల్ తో సహా మొత్తం బడ్జెట్ రూ.300 కోట్లు. మొదటి వారంలో రూ. 248.70 కోట్లు స్థూలంగా సంపాదించినప్పటికీ సర్వం మాయ కలెక్షన్ల పర్సంటేజీని ధురంధర్ అందుకోలేకపోయింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks