...
...
Next Story

OTT Thriller: ఓటీటీలోకి క్రేజీ మలయాళం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్.. మైండ్ గేమ్స్, విచిత్రమైన హత్యలు.. తెలుగులో స్ట్రీమింగ్

OTT Thriller: ఓటీటీలోకి సరికొత్త మలయాళం ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు రాబోతోంది. జులై 31న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాను త్వరలోనే స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోనీ లివ్ ఓటీటీ అనౌన్స్ చేసింది. తెలుగులోనూ అందుబాటులోకి రానుంది.

Published on: Aug 14, 2026, 16:25:05 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

OTT Thriller: మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చే డిఫరెంట్ కాన్సెప్ట్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు తెలుగు ఓటీటీ ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. రీసెంట్‌గా థియేటర్లలో విడుదలైన క్రేజీ మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'ఉన్మాదం' (Unmadham) ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు గ్రాండ్‌గా సిద్ధమైంది.

OTT Thriller: ఓటీటీలోకి క్రేజీ మలయాళం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్.. మైండ్ గేమ్స్, విచిత్రమైన హత్యలు.. తెలుగులో స్ట్రీమింగ్
OTT Thriller: ఓటీటీలోకి క్రేజీ మలయాళం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్.. మైండ్ గేమ్స్, విచిత్రమైన హత్యలు.. తెలుగులో స్ట్రీమింగ్

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీలివ్ (SonyLIV) ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను దక్కించుకోగా.. త్వరలోనే మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.

మూవీ స్క్రిప్ట్ రాసే పోలీస్ ఆఫీసర్.. మైండ్ బ్లాకింగ్ కేస్ ఫైల్

ఒకప్పటి పోలీస్ ఆఫీసర్, 'నాయట్టు', 'జోసెఫ్' లాంటి సంచలన చిత్రాలకు కథ అందించిన షాహి కబీర్ ఈ సినిమాకు స్క్రిప్ట్ సమకూర్చగా, ప్రముఖ ఎడిటర్ కిరణ్ దాస్ దర్శకత్వం వహించారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తూనే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రైటర్‌గా ఎంట్రీ ఇవ్వాలని కలలు కనే షెల్లీ (కుంచకో బోబన్) అనే పోలీస్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

లాంగ్ లీవ్‌లో ఉంటూ కొత్త కథ కోసం వెతికే షెల్లీకి ఓ పాత మర్డర్ కేస్ ఫైల్ చిక్కుతుంది. ఆ కేస్ వెనుక ఉన్న కొన్ని మూఢనమ్మకాలు, సైకలాజికల్ మిస్టరీలు అతని మనసును విపరీతంగా ఆకర్షిస్తాయి. ఆ కేస్ ఆధారంగా సినిమా కథ రాయాలని ఫిక్స్ అయిన షెల్లీకి ఎలాంటి ఊహించని సవాళ్లు ఎదురయ్యాయి? ఆ క్రమంలో అతని మైండ్‌లో ఎలాంటి ఫాంటసీ, సస్పెన్స్ నడిచిందనేది ఈ సినిమా మెయిన్ ప్లాట్.

కుంచకో బోబన్ పవర్ ఫుల్ యాక్టింగ్.. లిజోమోల్ జోస్ డిఫరెంట్ రోల్

'జై భీమ్' మూవీతో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న లిజోమోల్ జోస్.. ఇందులో భర్త ప్రవర్తనతో నిరంతరం ఆందోళన చెందే భార్య సౌమ్య పాత్రలో కనిపించారు. అలాగే సిద్ధిక్, సుధీష్, సాబుమోన్ లాంటి నటులు తమ అనుభవంతో కీలక పాత్రలకు ప్రాణం పోశారు.

సైకలాజికల్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్

దాదాపు 143 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమాలో కిరణ్ దాస్ మేకింగ్, షాహి కబీర్ స్క్రీన్ ప్లే సినిమాను విభిన్నంగా నిలబెట్టాయి. సాధారణ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లా కాకుండా, ఒక రైటర్ మైండ్‌లో నడిచే ఆలోచనలను విజువలైజ్ చేసిన తీరు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది.

ఇటీవలి కాలంలో సోనీలివ్ ప్లాట్‌ఫామ్ డిఫరెంట్ కాన్సెప్ట్ రీజినల్ కంటెంట్‌ను ప్రోత్సహించడంలో ముందుంటోంది. ఇప్పుడు తెలుగు వెర్షన్‌లోనూ 'ఉన్మాదం' స్ట్రీమింగ్‌కు వస్తుండటంతో సస్పెన్స్, సైకలాజికల్ థ్రిల్లర్ ప్రియులు ఈ సినిమాపై బాగా ఆసక్తి చూపుతున్నారు.

ఉన్మాదం మూవీ విశేషాలు

సినిమా పేరు : ఉన్మాదం (Unmadham)

జానర్ : సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

దర్శకత్వం : కిరణ్ దాస్

కథ, స్క్రీన్‌ప్లే : షాహి కబీర్

ప్రధాన నటులు : కుంచకో బోబన్, లిజోమోల్ జోస్, సిద్ధిక్

ఓటీటీ వేదిక : సోనీలివ్ (SonyLIV)

స్ట్రీమింగ్ భాషలు : తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, హిందీ

రన్‌టైమ్ : 143 నిమిషాలు

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe