...
...
Next Story

Malayalam OTT: ఆర్జేకి గొంతు క్యాన్సర్ వస్తే.. ఈరోజు ఓటీటీలోకి తెలుగులో వచ్చేసిన మలయాళం ఎమోషనల్ డ్రామా..

Malayalam OTT: ఓటీటీలోకి ఈరోజు అంటే గురువారం (మే 28) ఓ ఇంట్రెస్టింగ్ మలయాళం మూవీ తెలుగులో స్ట్రీమింగ్ కు వచ్చింది. జీవితంలో ఎదురయ్యే కష్టాలను దాటుకుని, గుండెల్లో ఆశను బతికించుకుంటూ సాగే ఓ ఎమోషనల్ జర్నీ అయిన ఈ సినిమా.. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

Published on: May 28, 2026, 14:06:08 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Malayalam OTT: ఓటీటీలు వచ్చాక భాషతో సంబంధం లేకుండా మంచి కంటెంట్ ఉన్న కథలు నేరుగా మన ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. కేవలం యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలే కాకుండా మనసుకు హత్తుకునే ఎమోషనల్ డ్రామాలను ప్రేక్షకులు ఇప్పుడు బాగా ఆదరిస్తున్నారు. దైనందిన జీవితంలో మనుషులు ఎదుర్కొనే సవాళ్లు, ఆటుపోట్లకు అద్దం పట్టే కథలైతే జనాలు ఇట్టే కనెక్ట్ అవుతారు. సరిగ్గా ఇలాంటి ఒక అద్భుతమైన ఫీల్‌గుడ్ ఎమోషనల్ మూవీ ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది. అదే 'మేరి ఆవాజ్ సునో'.

ఈటీవీ విన్ ఓటీటీలో మేరా ఆవాజ్ సునో

Malayalam OTT: ఆర్జేకి గొంతు క్యాన్సర్ వస్తే.. ఈరోజు ఓటీటీలోకి తెలుగులో వచ్చేసిన మలయాళం ఎమోషనల్ డ్రామా..
Malayalam OTT: ఆర్జేకి గొంతు క్యాన్సర్ వస్తే.. ఈరోజు ఓటీటీలోకి తెలుగులో వచ్చేసిన మలయాళం ఎమోషనల్ డ్రామా..

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఈటీవీ విన్' (ETV Win) వేదికగా ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని సదరు ప్లాట్‌ఫామ్ అధికారికంగా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.

నాలుగేళ్ల కిందట థియేటర్లలో రిలీజైన ఈ మలయాళం మూవీ.. ఇప్పుడు తెలుగులో ఓటీటీలోకి అడుగుపెట్టడం విశేషం. ఈ సినిమా ఒక భావోద్వేగ ప్రయాణంగా మేకర్స్ అభివర్ణిస్తున్నారు. జీవితంలో అన్నీ కోల్పోయామని అనుకున్నప్పుడు, ఆ నిరాశ నుంచి బయటపడి మళ్లీ ఎలా నిలబడాలి అనే స్ఫూర్తిని ఈ కథ మనకు అందిస్తుంది.

మేరీ ఆవాజ్ సునో మూవీ విశేషాలు

ఈ మేరీ ఆవాజ్ సునో సినిమా స్టోరీ విషయానికి వస్తే.. శంకర్ ఒక పాపులర్ రేడియో జాకీ (ఆర్జే). మాటలతో మాయ చేస్తూ, తన గొంతుతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంటాడు. అతని వృత్తి, ప్రపంచం అంతా ఆ గొంతే. అలాంటి వ్యక్తికి గొంతు క్యాన్సర్ (లారింజియల్ క్యాన్సర్) వస్తే పరిస్థితి ఏంటి? చికిత్సలో భాగంగా తన గొంతు శాశ్వతంగా పోతుందని తెలిశాక శంకర్ జీవితం ఒక్కసారిగా తలకిందులు అవుతుంది. రేడియో జాకీగా తన కెరీర్ ముగిసిపోయిందని, ఇక జీవితంలో ఎలాంటి ఆశ లేదని తీవ్ర నిరాశలో కూరుకుపోతాడు.

ఈ ఎమోషనల్ ప్రయాణంలో ఆర్జే శంకర్‌గా మలయాళ స్టార్ హీరో జయసూర్య జీవించగా, స్పీచ్ థెరపిస్ట్ డాక్టర్ రేష్మి పాత్రలో లేడీ సూపర్ స్టార్ మంజు వారియర్ అద్భుతంగా నటించారు. ఈ ఇద్దరు దిగ్గజ నటులు స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే తొలిసారి. వీరితో పాటు శివద, జానీ ఆంటోని, గౌతమి నాయర్, సుధీర్ కరమణ కీలక పాత్రలు పోషించారు.

సూపర్ హిట్ బెంగాలీ సినిమాకు రీమేక్..

నందితా రాయ్, శిబోప్రసాద్ ముఖర్జీ రూపొందించిన సూపర్ హిట్ బెంగాలీ చిత్రం 'కంటో' (2019) ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. మలయాళంలో ప్రజేష్ సేన్ ఈ చిత్రానికి కథను అందించి, దర్శకత్వం వహించారు. బి. రాకేష్ ఈ సినిమాను నిర్మించారు. ఎం. జయచంద్రన్ సంగీతం అందించగా, బీకే హరినారాయణన్ అద్భుతమైన పాటలు రాశారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

'మేరి ఆవాజ్ సునో' సినిమా ఎక్కడ చూడొచ్చు?

ఈ ఎమోషనల్ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ యాప్ 'ఈటీవీ విన్' (ETV Win)లో ఎక్స్‌క్లూజివ్‌గా చూడొచ్చు.

మేరీ ఆవాజ్ సునో సినిమా ప్రధాన కథాంశం ఏంటి?

ఆశ, మానసిక బలంతో జీవితంలో కష్టాల నుంచి కోలుకునే ఒక స్ఫూర్తిదాయకమైన భావోద్వేగ ప్రయాణం చుట్టూ ఈ కథ సాగుతుంది.

మేరీ ఆవాజ్ సునో సినిమా ఎలాంటి ప్రేక్షకులకు నచ్చుతుంది?

హ్యూమన్ ఎమోషన్స్, ఫీల్‌గుడ్ డ్రామాలు, స్ఫూర్తిదాయకమైన కథలను ఇష్టపడే ప్రతి ఒక్కరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe