2026 పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జాబితాలో 19 మంది మహిళా పురస్కార గ్రహీతలు, ఆరుగురు విదేశీయులు లేదా భారతీయ సంతతికి చెందినవారు, 16 మంది మరణానంతరం పురస్కారాలు అందుకున్నారు ఉన్నారు. ఈ అవార్డులు కళ, ప్రజా వ్యవహారాలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సైన్స్, ఇంజనీరింగ్, సామాజిక సేవ, సివిల్ సర్వీస్, వాణిజ్యం పరిశ్రమ వంటి విభిన్న రంగాల్లో సేవలు చేసిన వాళ్లకు దక్కాయి.
ధర్మేంద్రకు పద్మ విభూషణ్

బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్రకు పద్మ విభూషణ్ దక్కింది. మరణానంతరం ఆయనకు ఈ పురస్కారం లభించింది. గతేడాది చివర్లో ధర్మేంద్ర అనారోగ్యం కన్నుమూసిన సంగతి తెలిసిందే. మరోవైపు మలయాళ స్టార్ మమ్ముట్టిని పద్మభూషణ్ పురస్కారం వరించింది.
భారతీయ సినిమా, సంగీతానికి చేసిన సేవలకు గాను సీనియర్ నటుడు ధర్మేంద్ర, దిగ్గజ ప్లేబ్యాక్ సింగర్ అల్కా యాగ్నిక్, మలయాళ సినిమా దిగ్గజం మమ్ముట్టి, బెంగాలీ సినీ ఐకాన్ ప్రొసెన్జిత్ ఛటర్జీ, నటుడు ఆర్. మాధవన్, అనిల్ కె. రస్తోగి వంటి ప్రముఖులు 2026 పద్మ అవార్డుల కార్యక్రమంలో పద్మ పురస్కారాలు అందుకోనున్నారు.
తెలుగు నటులు
తెలుగు నటుల్లో రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్ కు పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. ఆదివారం కేంద్రం 2026 సంవత్సరానికి పద్మ అవార్డులను ప్రకటించింది, పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ విభాగాలలో 131 పౌర పురస్కారాలకు ఆమోదం తెలిపింది. ఈ జాబితాలో ప్రజా జీవితం, కళలు, సినిమా, సాహిత్యం, క్రీడలు, ప్రజా వ్యవహారాల రంగాల నుండి అనేక ప్రముఖ పేర్లు ఉన్నాయి. ఈ ఏడాది ఐదు పద్మ విభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు.
రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్ ఎంతో కాలంగా తెలుగు చిత్ర సీమకు సేవలు చేస్తున్నారు. వందలాది సినిమాల్లో నటించారు. దశాబ్దాలుగా తమ నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. మురళీ మోహన్ ఎంపీగానూ పని చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ పద్మ పురస్కారాలను ప్రకటించింది. తెలుగు వాళ్లలో 11 మందికి పురస్కారాలు దక్కాయి.
{{/usCountry}}రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్ ఎంతో కాలంగా తెలుగు చిత్ర సీమకు సేవలు చేస్తున్నారు. వందలాది సినిమాల్లో నటించారు. దశాబ్దాలుగా తమ నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. మురళీ మోహన్ ఎంపీగానూ పని చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ పద్మ పురస్కారాలను ప్రకటించింది. తెలుగు వాళ్లలో 11 మందికి పురస్కారాలు దక్కాయి.
{{/usCountry}}