ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవల 'ఓజీ' (OG) దర్శకుడు సుజీత్కు రూ. 3 కోట్ల విలువైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును బహుమతిగా ఇచ్చాడు. అందరూ ఇది సినిమా హిట్ అయినందుకు ఇచ్చిన గిఫ్ట్ అనుకున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే.. సినిమా షూటింగ్ కోసం సుజీత్ తన సొంత కారును అమ్మేస్తే, అది తెలుసుకున్న పవన్ తిరిగి అదే కారును కొనిచ్చాడు.
ల్యాండ్ రోవర్ డిఫెండరే ఎందుకంటే?

ఇటీవల పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. యువ దర్శకుడు సుజీత్ కు ఖరీదైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును గిఫ్ట్గా ఇచ్చిన సంగతి తెలిసిందే. 'దే కాల్ హిమ్ ఓజీ' సినిమా ఘనవిజయం సాధించిన ఆనందంలో పవన్ ఈ బహుమతి ఇచ్చారని అందరూ భావించారు. కానీ దీని వెనుక ఒక ఆసక్తికరమైన, ఎమోషనల్ కారణం ఉంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. 'ఓజీ' షూటింగ్ చివరి దశలో ఉన్నప్పుడు సుజీత్ ఒక కీలకమైన సీక్వెన్స్ను జపాన్ లో తీయాలనుకున్నాడు. బడ్జెట్ పరిమితుల వల్ల నిర్మాతలు ఆలోచిస్తున్న సమయంలో.. ఆ సీన్స్ సినిమాకు చాలా అవసరమని సుజీత్ భావించాడు.
ఎలాగైనా ఆ షూటింగ్ జరగాలని గట్టిగా నిర్ణయించుకున్న సుజీత్.. దానికోసం డబ్బు సమకూర్చడానికి తన సొంత ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును అమ్మేశాడు. ఆ డబ్బుతో జపాన్ వెళ్లి అనుకున్న షాట్స్ పూర్తి చేశాడు.
డబ్బింగ్ సమయంలో తెలుసుకున్న పవన్..
పవన్ కల్యాణ్ కు మొదట్లో ఈ విషయం తెలియదు. సినిమా షూటింగ్ పూర్తయ్యాక, డబ్బింగ్ చెబుతున్న సమయంలో సుజీత్ తన కారు అమ్ముకున్న విషయం పవన్కు తెలిసింది.
సినిమా కోసం సుజీత్ చూపించిన అంకితభావానికి పవన్ ఫిదా అయ్యాడు. తన సినిమా కోసం దర్శకుడు సొంత కారును త్యాగం చేయడం పవన్ను కదిలించింది. అందుకే సుజీత్ ఏ మోడల్ కారునైతే అమ్ముకున్నాడో.. సరిగ్గా అదే మోడల్ కొత్త కారును పవన్ బహుమతిగా ఇచ్చాడు. అంతేకాదు ఆ కారుకు సంబంధించిన ఈఎంఐలను కూడా పవన్ స్వయంగా కడుతున్నాడని సమాచారం.
సుజీత్ ఎమోషనల్ పోస్ట్
{{/usCountry}}సినిమా కోసం సుజీత్ చూపించిన అంకితభావానికి పవన్ ఫిదా అయ్యాడు. తన సినిమా కోసం దర్శకుడు సొంత కారును త్యాగం చేయడం పవన్ను కదిలించింది. అందుకే సుజీత్ ఏ మోడల్ కారునైతే అమ్ముకున్నాడో.. సరిగ్గా అదే మోడల్ కొత్త కారును పవన్ బహుమతిగా ఇచ్చాడు. అంతేకాదు ఆ కారుకు సంబంధించిన ఈఎంఐలను కూడా పవన్ స్వయంగా కడుతున్నాడని సమాచారం.
సుజీత్ ఎమోషనల్ పోస్ట్
{{/usCountry}}పవన్ ఇచ్చిన గిఫ్ట్ చూసి సుజీత్ ఉబ్బితబ్బిబ్బయ్యాడు. మూడు రోజుల కిందట సోషల్ మీడియాలో కారు ఫోటోలు షేర్ చేస్తూ..
"నా లైఫ్ లో బెస్ట్ గిఫ్ట్ ఇదే. మాటలు రావడం లేదు. నా డియరెస్ట్ OG కల్యాణ్ గారి ప్రేమ, ప్రోత్సాహం నాకు సర్వస్వం. చిన్నప్పటి నుంచి ఆయనకు ఫ్యాన్ని.. ఇప్పుడు ఈ స్పెషల్ మూమెంట్.. ఎప్పటికీ రుణపడి ఉంటాను" అని ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
పవన్ కల్యాణ్, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్ నటించిన 'ఓజీ' మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 293.65 కోట్లు వసూలు చేసింది.