ఓటీటీల యూజ్ ఎక్కువయ్యాక ఇతర భాషల సినిమాలనూ తెలుగు ఆడియన్స్ తెగ చూసేస్తున్నారు. ముఖ్యంగా మలయాళం సినిమాలంటే మనవాళ్లు మోజు పడుతున్నారు. ఈ రోజు మన తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు మరో మలయాళ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన ఆ సినిమానే.. ‘పెన్ను కేసు’.
పెన్ను కేసు ఓటీటీ

మలయాళ కామెడీ థ్రిల్లర్ పెన్ను కేసు ఇవాళ (మార్చి 12) ఓటీటీలోకి వచ్చేసింది. గురువారం నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ ఆడియన్స్ కు పెన్ను కేసు అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పుడు కేవలం మలయాళంలోనే ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
రెండు నెలల తర్వాత
పెన్ను కేసు సినిమా రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఈ చిత్రం జనవరి 10, 2026న థియేటర్లలో రిలీజైంది. కానీ అంచనాలను అందుకోలేకపోయింది. ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయడంలో విఫలమైంది. పెన్ను కేసు మూవీ థియేటర్లలో సోసోగానే ఆడింది. ఇప్పుడు రెండు నెలల తర్వాత మార్చి 12 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
పెన్ను కేసు సినిమాకు ఫెబిన్ సిద్ధార్థ్ డైరెక్టర్. ఈ మూవీలో నిఖిలా విమన్, హకీమ్ షాజహాన్, శివజీత్, అజు వర్గీస్ తదితరులు నటించారు.
పెన్ను కేసు స్టోరీ
పెళ్లిళ్లు చేసుకుని పురుషులను మోసం చేసే ఓ అమ్మాయి కథ చుట్టూ సాగే సినిమానే పెన్ను కేసు. పెళ్లి కోసం ఆశతో ఉన్న అబ్బాయిలను అమ్మాయి మోసం చేయడం ఈ స్టోరీలో కొత్త పాయింట్. రోహిణి (నిఖిలా విమన్) ఓ అందమైన అమ్మాయి. కేరళ, కర్ణాటకలోని కొంతమంది అబ్బాయిలను తన అందంతో, మాటలతో ఆకర్షించి పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి కాగానే ఆమె కనిపించకుండా పోతుంది.
పెళ్లి కాగానే
{{/usCountry}}పెళ్లిళ్లు చేసుకుని పురుషులను మోసం చేసే ఓ అమ్మాయి కథ చుట్టూ సాగే సినిమానే పెన్ను కేసు. పెళ్లి కోసం ఆశతో ఉన్న అబ్బాయిలను అమ్మాయి మోసం చేయడం ఈ స్టోరీలో కొత్త పాయింట్. రోహిణి (నిఖిలా విమన్) ఓ అందమైన అమ్మాయి. కేరళ, కర్ణాటకలోని కొంతమంది అబ్బాయిలను తన అందంతో, మాటలతో ఆకర్షించి పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి కాగానే ఆమె కనిపించకుండా పోతుంది.
పెళ్లి కాగానే
{{/usCountry}}మాయ మాటలతో పెళ్లి చేసుకునే రోహిణి.. వెడ్డింగ్ కాగానే జంప్ అవుతుంది. అలా కొంతమందిని పెళ్లి చేసుకుంటుంది. తనకు కెమెరా అంటే సిగ్గు అని, ఫొటోలు దిగనని చెప్పి పెళ్లి చేసుకుంటుంది. ఎలాంటి ఆధారాలు లేకుండా చూసుకుంటుంది. కానీ ఆమె చేతిలో మోసపోయిన అబ్బాయిలు పోలీస్ కేసు పెడతారు. సీఐ మనోజ్ (హకీం షాజహాన్) ఎంక్వైరీ చేస్తాడు.
మరి రోహిణిని పోలీసులు పట్టుకున్నారా? అసలు మగాళ్లను పెళ్లి చేసుకుని రోహిణి ఎందుకు మోసం చేస్తుంది? అన్నది పెన్ను కేసు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.