2026 న్యూ ఇయర్ వేడుకల్లో పాటలు ఆలపించి అందరినీ ఉత్సాహపరచాలని వచ్చిన ఆ సంగీత కళాకారులకు చేదు అనుభవం ఎదురైంది. ప్రముఖ మ్యూజిక్ కంపోజర్స్, సింగర్స్, భార్యాభర్తలు సచేత్ టాండన్, పరంపర ఠాకూర్ (సచేత్-పరంపర)కు మంచి క్రేజ్ ఉంది.

తాజాగా సచేత్-పరంపరకు న్యూ ఇయర్ వేడుకల్లో చేదు అనుభవం ఎదురైదంది. వీరు ప్రయాణిస్తున్న కారు అభిమానుల దాడికి గురైంది. కారును అభిమానులు చుట్టుముట్టడమే కాకుండా.. కారు అద్దాలను కూడా పగలగొట్టారు. పశ్చిమ బెంగాల్లోని బలూర్ఘాట్లో న్యూ ఇయర్ ఈవ్ కాన్సర్ట్ ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఏం జరిగిందంటే?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. సచేత్, పరంపరలు తమ కారులో ప్రయాణిస్తుండగా, వందలాది మంది అభిమానులు ఒక్కసారిగా కారును చుట్టుముట్టారు. సచేత్ నవ్వుతూ అభిమానులకు అభివాదం చేస్తున్న సమయంలో, ఎవరో కారు ముందు అద్దాన్ని బలంగా తట్టారు.
దీంతో సచేత్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పరంపర "గాయ్స్.. కొంచెం రిలాక్స్ అవ్వండి.. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్" అంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే, జనం అదుపు తప్పడంతో కారు వెనుక ఉన్న అద్దం ఒక్కసారిగా పగిలిపోయింది.
ఆ శబ్దానికి సచేత్ తీవ్ర దిగ్భ్రాంతికి గురవ్వగా, "పోయింది.. అద్దం పగిలిపోయింది (గయా.. గయా)" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. భద్రతా సిబ్బంది ఎంత ప్రయత్నించినా అభిమానులు కారును వదలకుండా సెల్ఫీలు, వీడియోల కోసం ఎగబడ్డారు.
ఘటనపై మౌనం.. విషెస్ చెప్పిన సింగర్స్
అయితే, ఈ షాకింగ్ ఘటనపై సచేత్ పరంపర నేరుగా స్పందించలేదు. కానీ, సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులకు కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలిపారు. "మా వెన్నంటే నిలిచిన ప్రియమైన వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరం మీ అందరికీ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాము. మహా దేవుడు అందరినీ రక్షించుగాక" అంటూ పోస్ట్ చేశారు.
కాన్సర్ట్లో తమ పాటలతో ఉర్రూతలూగించిన సచేత్-పరంపరపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "మిమ్మల్ని లైవ్లో చూడటం అద్భుతంగా ఉంది", "నా న్యూ ఇయర్ను బెస్ట్గా మార్చేశారు" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
సచేత్-పరంపర నేపథ్యం
{{/usCountry}}కాన్సర్ట్లో తమ పాటలతో ఉర్రూతలూగించిన సచేత్-పరంపరపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "మిమ్మల్ని లైవ్లో చూడటం అద్భుతంగా ఉంది", "నా న్యూ ఇయర్ను బెస్ట్గా మార్చేశారు" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
సచేత్-పరంపర నేపథ్యం
{{/usCountry}}సచేత్ టాండన్, పరంపర ఠాకూర్ 2015లో 'ది వాయిస్ ఇండియా' ద్వారా గుర్తింపు పొందారు. ఆ తర్వాత జంటగా మారి 'కబీర్ సింగ్', 'తానాజీ', 'జెర్సీ', 'టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ' వంటి సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించారు.
2020లో వివాహం చేసుకున్న సచేత్-పరంపర జంట ఇటీవలే 'సయ్యారా', 'సన్నీ సంస్కారీ కీ తులసి కుమారి' వంటి చిత్రాల్లోనూ పాటలు పాడారు.