Pradeep Ranganathan PR Show Launch: రచయితగా, దర్శకుడిగా, హీరోగా తక్కువ కాలంలోనే సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్. 'కోమాలి' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రదీప్ రంగనాథన్ 'లవ్ టుడే' చిత్రంతో తెలుగు, తమిళ ప్రేక్షకులను హీరోగా విపరీతంగా ఆకట్టుకున్నాడు.
పీఆర్ షో ప్రొడక్షన్ బ్యానర్

అలాంటి హీరో, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు సరికొత్త అవతారమెత్తారు. నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతూ పీఆర్ షో (PR Show) అనే కొత్త ప్రొడక్షన్ బ్యానర్ను అధికారికంగా ప్రారంభించారు. ఈ బ్యానర్లో రానున్న మొదటి సినిమాకు సంబంధించిన క్రేజీ అనౌన్స్మెంట్ వీడియోను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది.
నిర్మాతగా ప్రదీప్ రంగనాథన్ సరికొత్త ప్రయాణం
సినిమా ఇండస్ట్రీలో ఒక వైపు హీరోగా నటిస్తూనే, మరోవైపు కథలు రాస్తూ బిజీగా ఉన్న ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు చిత్ర నిర్మాణంలోకి రావడం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. యువత పల్స్ బాగా తెలిసిన మేకర్గా పేరు తెచ్చుకున్న ప్రదీప్, తన మొదటి నిర్మాణంలోనే ఒక వినూత్నమైన కాన్సెప్ట్ను ఎంచుకున్నారు.
ఈ సినిమాలో టాలీవుడ్ ప్రేక్షకులకు సైతం బాగా సుపరిచితమైన 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు హీరోయిన్గా నటిస్తున్నారు. 'ఓ మై కడవులే' (తెలుగులో ఓరి దేవుడా) చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అశ్వత్ మారిముత్తు ఈ ప్రాజెక్ట్ను డైరెక్ట్ చేస్తున్నారు.
ఆరుగురు దర్శకులతో క్రేజీ ప్రయోగం
ఈ సినిమాకు సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన అంశం దీని మేకింగ్ శైలి. ఈ చిత్రానికి మూల కథను ప్రదీప్ రంగనాథన్ అందించారు. అయితే, స్క్రీన్ప్లే, దర్శకత్వ బాధ్యతలను మాత్రం ఒక సరికొత్త టీమ్కు అప్పగించారు. 'ది ఆల్ఫా యూనిట్' (The Alpha Unit) పేరుతో ఆరుగురు యువ దర్శకులను ఈ సినిమా ద్వారా పరిశ్రమకు పరిచయం చేస్తున్నారు.
విశాల్ టీఆర్, యష్ వి, నరేన్ సౌద, చాణక్యన్ ఆర్, ధనుష్ కుమార్, ఇలంపరితి అనే ఆరుగురు యువకులు కలిసి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. భారతీయ చలనచిత్ర రంగంలో ఇలా ఒకే సినిమాకు ఆరుగురు కలిసి స్క్రీన్ప్లే, దర్శకత్వం వహించడం చాలా అరుదైన ప్రయోగంగా చెప్పవచ్చు.
క్రేజీ కాస్టింగ్.. అదిరిపోయే టెక్నికల్ టీమ్
{{/usCountry}}విశాల్ టీఆర్, యష్ వి, నరేన్ సౌద, చాణక్యన్ ఆర్, ధనుష్ కుమార్, ఇలంపరితి అనే ఆరుగురు యువకులు కలిసి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. భారతీయ చలనచిత్ర రంగంలో ఇలా ఒకే సినిమాకు ఆరుగురు కలిసి స్క్రీన్ప్లే, దర్శకత్వం వహించడం చాలా అరుదైన ప్రయోగంగా చెప్పవచ్చు.
క్రేజీ కాస్టింగ్.. అదిరిపోయే టెక్నికల్ టీమ్
{{/usCountry}}మమితా బైజు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో బిగ్ బాస్ శివాజీ, స్వాసిక విజయ్, అనామిక మహి, లిజ్జీ ఆంటోనీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రకటన కోసం విడుదల చేసిన వీడియో చాలా స్టైలిష్గా, డిఫరెంట్గా యూత్ఫుల్ వైబ్తో సాగింది.
ఇన్స్టాగ్రామ్ రీల్స్, సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేసిన 'కచ్చి సేరా' మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ అనౌన్స్మెంట్ వీడియోను నెక్ట్స్ లెవెల్కు తీసుకెళ్లింది.
క్రేజీ కాంబినేషన్
ఈ చిత్రానికి దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తుండగా, ప్రదీప్ ఇ రాఘవ్ ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు. అశ్విన్ లారా ప్రొడక్షన్ డిజైనర్గా పనిచేస్తున్నారు. కేవలం అనౌన్స్మెంట్ వీడియోతోనే ఈ సినిమా సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అవుతోంది. కొత్త దర్శకుల టీమ్, క్రేజీ కాంబినేషన్ కావడంతో సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి.