Prakash Raj: ప్రకాష్ రాజ్ ఇటీవల రామాయణంపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను దుమారాన్ని రేపాయి. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తన వివరణ ఇచ్చాడు. తన మాటలను వక్రీకరించారని పేర్కొన్నాడు. ఎక్స్ లో ఓ వీడియో పోస్టు చేశాడు.
ప్రకాష్ రాజ్ ఏమన్నాడంటే?

రామాయణంపై తాను చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ వివరణ ఇచ్చాడు. ‘‘ఒక సాహిత్య కార్యక్రమంలో పాల్గొన్నా. అక్కడ నా ప్రసంగంలోని కొన్ని మాటలను మాత్రమే తీసుకుని వక్రీకరించారు. నేనేదే అవతార పురుషుడు శ్రీరాముడిని ఎగతాళి చేశానని, హిందూ ధర్మాన్ని హర్ట్ చేసేలా మాట్లాడానని అంటున్నారు’’ అని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చాడు.
ఆ అవసరం లేదు
‘‘అన్ని ధర్మాలను, అందరిని ప్రేమించే నాకు ఆ అవసరం లేదు. ధర్మాన్ని మతోన్మాదంతో అడ్డుపెట్టుకుని అసహ్యమైన రాజకీయాలు చేసేవాళ్లు నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు లేక నన్ను యాంటీ హిందు, హిందు ధర్మ వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
పాపం వాళ్ల ఏడుపు, వాళ్ల కష్టం నాకు అర్థమవుతోంది. ఇప్పుడు నాకు కొన్ని పనులున్నాయి. త్వరలో వస్తా. అప్పటివరకూ ఇలాగే వాగుతుంటారా? ఊరుకుంటారా? అన్నది మీ ఇష్టం’’ అని వీడియోలో ప్రకాష్ రాజ్ పేర్కొన్నాడు.
అసలేం జరిగింది?
ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తున్న సమయంలో రామాయణంలోని రామ, లక్ష్మణ, రావణ పాత్రల గురించి ప్రకాష్ రాజ్ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు. రాముడు, లక్ష్మణుడు ఉత్తరాది నుంచి వచ్చారని అన్నాడు. దక్షిణాదిలో ఉన్న రావణుడి పండ్ల తోటలో పండ్లను రాముడు దొంగతనం చేశారని ప్రకాష్ రాజ్ తెలిపాడు. అందుకే యుద్ధం మొదలైందని పేర్కొన్నాడు.
ప్రకాష్ రాజ్ పై ఫైర్
{{/usCountry}}ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తున్న సమయంలో రామాయణంలోని రామ, లక్ష్మణ, రావణ పాత్రల గురించి ప్రకాష్ రాజ్ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు. రాముడు, లక్ష్మణుడు ఉత్తరాది నుంచి వచ్చారని అన్నాడు. దక్షిణాదిలో ఉన్న రావణుడి పండ్ల తోటలో పండ్లను రాముడు దొంగతనం చేశారని ప్రకాష్ రాజ్ తెలిపాడు. అందుకే యుద్ధం మొదలైందని పేర్కొన్నాడు.
ప్రకాష్ రాజ్ పై ఫైర్
{{/usCountry}}రాముడిపై ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. హిందూ సంఘలు, ప్రజలు అతనిపై ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే కొన్ని పోలీస్ స్టేషన్లలో ప్రకాష్ రాజ్ పై ఫిర్యాదు చేశారు. మెగా బ్రదర్, ఎమ్మెల్సీ నాగబాబు కూడా ప్రకాష్ రాజ్ పై మండిపడ్డాడు.
చట్టపరమైన చిక్కులు
ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. టీటీడీ పాలక మండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ఈ వ్యవహారంలో ప్రకాష్ రాజ్ కు నోటీసులు పంపించాడు. వారం రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించాడు. ప్రకాష్ రాజ్ మాటలు ప్రాంతీయ వైరాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని భాను ప్రకాష్ మండిపడ్డాడు. ఇతిహాసాన్ని తీవ్రంగా వక్రీకరించాడని పేర్కొన్నాడు.