ప్రకాష్ రాజ్ బాలీవుడ్, సౌత్ సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ రెండు ఇండస్ట్రీల మధ్య తేడా ఏంటో కుండబద్ధలు కొట్టినట్లు చెప్పాడు. హిందీ సినిమా తన మూలాలను పూర్తిగా కోల్పోయిందని, అది రోజురోజుకూ "నకిలీ"గా, కేవలం "డబ్బు సంపాదనే ధ్యేయంగా" మారిపోతోందని అతనడం గమనార్హం. ప్రస్తుతం జరుగుతున్న తొమ్మిదవ కేరళ సాహిత్య ఉత్సవంలో (కేఎల్ఎఫ్) మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ హిందీ సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
ప్రకాష్ రాజ్ ఏమన్నాడంటే?

వార్తా సంస్థ పీటీఐ రిపోర్టు ప్రకారం ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. "ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే.. మలయాళం, తమిళ సినిమా పరిశ్రమలు చాలా బలమైన సినిమాలను రూపొందిస్తున్నాయని నాకు అనిపిస్తోంది. కానీ మరోవైపు హిందీ సినిమా తన అస్తిత్వాన్ని, మూలాలను కోల్పోయింది. అక్కడ ప్రతిదీ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో బొమ్మల్లాగా చాలా అందంగా, అద్భుతంగా కనిపిస్తుంది కానీ అదంతా ప్లాస్టిక్ లాంటిది. మాకు (దక్షిణాది వారికి) చెప్పడానికి ఇంకా బలమైన కథలు ఉన్నాయి. తమిళనాడులోని కొత్త యువ దర్శకులు దళిత సమస్యల గురించి, సామాజిక అంశాల గురించి మాట్లాడుతున్నారు. అది భవిష్యత్తుపై ఎంతో ఆశను కలిగిస్తోంది" అని అన్నాడు.
ప్రేక్షకులతో బంధం తెగిపోయింది..
ప్రకాష్ రాజ్ హిందీ మూవీస్ పై మరిన్ని విమర్శలు గుప్పించాడు. "మల్టీప్లెక్సులు వచ్చిన తర్వాత బాంబే ఫిల్మ్ ఇండస్ట్రీ (బాలీవుడ్) కేవలం ఆ మల్టీప్లెక్సుల కోసమే సినిమాలు తీయడం మొదలుపెట్టింది. చూడటానికి చాలా అందంగా ఉండే సినిమాలు, అలాంటి వాటినే తీయడం అలవాటు చేసుకున్నారు. ఎందుకంటే అవి అక్కడ బాగా ఆడుతున్నాయి కాబట్టి. వారు నెమ్మదిగా ఆ 'పేజ్ 3' సంస్కృతిలోకి వెళ్లిపోయారు. ఆ క్రమంలో రాజస్థాన్, బీహార్ వంటి గ్రామీణ ప్రాంతాలతో, అక్కడి మట్టి కథలతో సంబంధాన్ని పూర్తిగా కోల్పోయారు. ఈ రోజుల్లో సినిమా అంటే కేవలం డబ్బు, ఆర్భాటాలు మాత్రమే అయిపోయాయి. ఇన్ స్టాగ్రామ్ రీల్స్, పేజ్ 3 కవరేజ్, గట్టిగా సొంత డబ్బా కొట్టుకోవడం మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఈ ప్రక్రియలో, సినిమా పరిశ్రమ ప్రేక్షకులతో తనకున్న భావోద్వేగ అనుబంధాన్ని కోల్పోయిందని నాకు అనిపిస్తోంది" అని ప్రకాష్ రాజ్ చెప్పాడు.
ప్రకాష్ రాజ్ లేటెస్ట్ మూవీస్..
ప్రకాష్ రాజ్ చివరిగా 'తేరే ఇష్క్ మే' అనే హిందీ సినిమాలో కనిపించాడు. అందులో అతడు ధనుష్ తండ్రి పాత్రను పోషించాడు. ఇప్పుడు 'జన నాయగన్' అనే పొలిటికల్ యాక్షన్ డ్రామాలో కనిపించనున్నాడు. నటుడిగా దళపతి విజయ్ కు ఇది చివరి సినిమా కానుంది. వాస్తవానికి ఈ సినిమా ఈ నెల ఆరంభంలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడింది. దీని కొత్త విడుదల తేదీని చిత్ర బృందం ఇంకా ప్రకటించాల్సి ఉంది.
{{/usCountry}}ప్రకాష్ రాజ్ చివరిగా 'తేరే ఇష్క్ మే' అనే హిందీ సినిమాలో కనిపించాడు. అందులో అతడు ధనుష్ తండ్రి పాత్రను పోషించాడు. ఇప్పుడు 'జన నాయగన్' అనే పొలిటికల్ యాక్షన్ డ్రామాలో కనిపించనున్నాడు. నటుడిగా దళపతి విజయ్ కు ఇది చివరి సినిమా కానుంది. వాస్తవానికి ఈ సినిమా ఈ నెల ఆరంభంలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడింది. దీని కొత్త విడుదల తేదీని చిత్ర బృందం ఇంకా ప్రకటించాల్సి ఉంది.
{{/usCountry}}