తేరే ఇష్క్ మే సూపర్ హిట్- న్యూడ్ పింక్ గౌనులో కృతి సనన్ మెరుపులు- రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్లో గ్లామర్ ఫొటోలు
ధనుష్ తేరే ఇష్క్ మే సూపర్ హిట్ సాధించడంతో సకెస్స్ను ఎంజాయ్ చేస్తోంది కృతి సనన్. జెడ్డాలో తొలిసారిగా జరిగిన 2025 రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో కృతి సనన్ అందాలతో ఆకట్టుకుంది. ఫిడెల్స్కాయ డిజైన్ చేసిన న్యూడ్ పింక్ గౌనులో కృతి సనన్ గ్లామర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ సౌది అరేబియాలోని జెడ్డాలో తొలిసారిగా జరిగిన 2025 రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొంది. తొలిసారిగా ఓ గ్లోబల్ ఈవెంట్లో పాల్గొన్న కృతి సనన్ అందరి దృష్టిని ఆకర్షించింది. హాలీవుడ్ స్టార్స్తో కలిసి కృతి సనన్ సందడి చేసింది.

న్యూడ్ పింక్ గౌనులో కృతి
ఈ చలన చిత్రోత్సవంలో భాగంగా జరిగిన 'ఉమెన్ ఇన్ సినిమా' గాలా వేడుకలో కృతి సనన్ హాలీవుడ్ ప్రముఖులైన డకోటా జాన్సన్, ఉమా థర్మన్, ఆండ్రియన్ బ్రాడీ వంటి స్టార్స్తో కలవడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక వేడుక కోసం కృతి సనన్ ప్రత్యేకంగా దుస్తులను ఎంచుకుంది.
ప్రమఖ డిజైనర్ క్రిస్టినా ఫిడెల్స్కాయ రూపొందించిన న్యూడ్ పింక్ స్లీవ్లెస్ గౌనులో కృతి సనన్ అందాలతో మెరిసిపోయింది. ఈ గౌను పైభాగం ఫిట్టెడ్ బోడిస్తో, కింద భాగం ఫ్లోరల్ డిజైన్లు ఉన్న నెట్ మెష్ స్కర్ట్తో డిజైన్ చేయబడింది. క్రిస్టినా ఫిడెల్స్కాయ రూపొందించిన ఈ దుస్తులు ఫిట్టెడ్ టాప్, కింద భాగంలో ఫ్లోయింగ్ షీర్ ఫాబ్రిక్పై అందమైన ఫ్లోరల్ డిజైన్తో కూడి, అద్భుతమైన సొగసును ఒలకబోశాయి.
ఈ లుక్ను పూర్తి చేసేందుకు కృతి సనన్ తన జుట్టును మధ్య పాపిడితో ముడి (బన్) వేసుకుంది. చాలా సింపుల్గా, హుందాగా కనిపించే మేకప్ను ఎంచుకుని కృతి సనన్ ఆకట్టుకుంది. ఈ ఫెస్టివల్లో న్యూడ్ గులాబి గౌనులో ఉన్న పలు ఫొటోలను కృతి సనన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.
కృతి సనన్ గ్లామర్ ఫొటోలు
“వేరింగ్ @kristinafidelkaya” అంటూ ఆ గ్లామర్ ఫోటోలకు కృతి సనన్ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో సోషల్ మీడియాలో కృతి సనన్ గ్లామర్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కు కృతి సనన్ తొలిసారి వచ్చినప్పటికీ, తన దుస్తులతో నిజంగా అందరిని ఆకర్షించిందని చెప్పవచ్చు.
కృతి సనన్ నటించిన తేరే ఇష్క్ మే సూపర్ హిట్ సాధించింది. ఈ సందర్భంగానే రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేసింది కృతి సనన్. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన తేరే ఇష్క్ మే మూవీలో ధనుష్తో జోడీ కట్టి నటించింది కృతి సనన్. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 28న థియేటర్లలో విడుదలైంది.
తేరే ఇష్క్ మే బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్తో దూసుకుపోతూ సూపర్ హిట్గా నిలిచింది. ఇప్పటికీ వరల్డ్ వైడ్గా రూ. 150 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా ఇండియాలో రూ. 107 కోట్ల నెట్ వసూలు కలెక్ట్ చేసింది.
సైకాలజీ రీసెర్చ్ స్కాలర్గా
కాగా, తేరే ఇష్క్ మే సినిమాలో కృతి సనన్ ముక్తి అనే సైకాలజీ రీసెర్చ్ స్కాలర్గా నటించింది. ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఉండే శంకర్ (ధనుష్) అనే కోపిష్టి యువకుడిపై థీసిస్ రాయాలని ఆమె నిర్ణయించుకుంటుంది.
క్రమంగా వారిద్దరి మధ్య ఒక సంక్లిష్టమైన సంబంధం మొదలవుతుంది. ముక్తి అంతర్మథనం గురించి తెలియని శంకర్ ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే, ముక్తి తన థీసిస్ను సమర్పించడానికి సిద్ధమవుతున్నప్పుడు అపరాధ భావంతో కుమిలిపోతుంది.
తేరే ఇష్క్ మే కథ
ఆ సమయంలో ముక్తి తండ్రి యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే తన కూతురిని వివాహం చేసుకోవచ్చని శంకర్కు షరతు పెడతాడు. ఆ తర్వాత ఏమైందనేదే తేరే ఇష్క్ మే కథ.














