OTT Telugu: తెలుగు ఓటీటీ ప్రేక్షకులకు నిరంతరం వైవిధ్యమైన సినిమాలను అందిస్తున్న ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్ (ETV Win) మరొక రొమాంటిక్ ఎంటర్టైనర్ను తీసుకువస్తోంది. యువ నటుడు త్రిగుణ్, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ప్రేమ దేశం' (Prema desam) చిత్రం ఇదే ఓటీటీలో తన స్ట్రీమింగ్ డేట్ ఖరారు చేసుకుంది.
ప్రేమ దేశం ఓటీటీ

ఐకానిక్ టైటిల్ ప్రేమ దేశం పేరుతో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో రిలీజైన మూడేళ్ల తర్వాత మరో ఓటీటీలోకి రాబోతుంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు తెలుగు పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లోకి రాబోతుంది.
ఎప్పటి నుంచంటే?
ప్రేమ దేశం సినిమా మరో ఓటీటీలో అడుగుపెట్టబోతుంది. ఆగస్టు 13 నుంచి అంటే రేపటి నుంచే ఈటీవీ ప్లాట్ఫామ్లో ప్రపంచవ్యాప్తంగా ఈ స్ట్రీమింగ్ కానున్నట్లు నిర్వాహకులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
రెండు ప్రేమ కథలు
శ్రీకాంత్ సిద్ధం దర్శకత్వంలో సిరి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై రూపుదిద్దుకున్న ప్రేమ దేశం చిత్రం ఫిబ్రవరి 3, 2023న థియేటర్లలో రిలీజైంది. రెండు వేర్వేరు జంటల మధ్య సాగే సమాంతర ప్రేమ కథలు, ఎమోషనల్ రైడ్ గా ఈ చిత్రం తెరకెక్కింది.
ఈ ప్రేమ దేశం సినిమాలో త్రిగుణ్, మేఘా ఆకాష్లతో పాటు సీనియర్ నటి మధుబాల, అజయ్ కథుర్వార్, మాయ, తనికెళ్ల భరణి, వైష్ణవి చైతన్య, వైవా హర్ష కీలక పాత్రల్లో మెప్పించారు.
మణిశర్మ స్వరాలు
మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ ప్రేమ దేశం చిత్రానికి స్వరాలు అందించారు. ఆయన అందించిన పాటలు, నేపథ్య సంగీతం యూత్ను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాలేజీ నేపథ్యంలో సాగే యూత్ఫుల్ లవ్ స్టోరీతో పాటు ఫ్యామిలీ ఎమోషన్లు ఈ మూవీలో ఉన్నాయి. ఈ సినిమా ఈటీవీ విన్ వేదికపై ఓటీటీ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుందని భావిస్తున్నారు.
కథ ఏంటంటే?
{{/usCountry}}మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ ప్రేమ దేశం చిత్రానికి స్వరాలు అందించారు. ఆయన అందించిన పాటలు, నేపథ్య సంగీతం యూత్ను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాలేజీ నేపథ్యంలో సాగే యూత్ఫుల్ లవ్ స్టోరీతో పాటు ఫ్యామిలీ ఎమోషన్లు ఈ మూవీలో ఉన్నాయి. ఈ సినిమా ఈటీవీ విన్ వేదికపై ఓటీటీ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుందని భావిస్తున్నారు.
కథ ఏంటంటే?
{{/usCountry}}అర్జున్ (త్రిగున్), ఆద్య (మేఘా ఆకాష్) కాలేజీలో ఫ్రెండ్స్. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమను ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే సందర్భంగా బయటకు చెప్పాలనుకుంటారు. ‘ప్రేమ దేశం’ అనే ఓ కెఫేలో కలిసి ప్రపోజ్ చేయాలని ప్లాన్ వేసుకుంటారు. కానీ ఆ ప్లేస్ కు వెళ్తున్న వీళ్లకు యాక్సిడెంట్ అవుతుంది.
మరోవైపు రిషి, మాయ ప్రేమ పెళ్లికి రెడీ అవుతారు. కానీ అనూహ్యంగా మాయ పెళ్లిని శివతో ఫిక్స్ చేస్తారు. మరి రిషిమ, మాయ కలిశారా? అసలు అర్జున్, ఆద్యకు ఏమైంది? అనేది ఈ ప్రేమ దేశం సినిమాలో చూడాల్సిందే.