...
...
Next Story

PM Modi Birthday: షారుఖ్ ఖాన్ నుంచి మహేష్ బాబు వరకు.. ప్రధాని మోదీకి సెలబ్రిటీల శుభాకాంక్షలు వెల్లువ

PM Modi Birthday: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా బాలీవుడ్ సెలబ్రిటీలు ఆయనకు విషెస్ చెప్పడానికి క్యూ కట్టారు. షారుఖ్ ఖాన్ నుంచి సల్మాన్ ఖాన్ వరకు ఈ జాబితాలో ఉన్నారు. టాలీవుడ్ నుంచి మహేష్ బాబు కూడా మోదీకి విషెష్ చెప్పడం విశేషం.

Published on: Sep 17, 2026, 21:40:59 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

PM Modi Birthday: భారత ప్రధాని నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్ సినిమా ప్రపంచం మొత్తం ఒక్కటై శుభాకాంక్షలు తెలిపింది. దేశవిదేశాల నుంచి నాయకులు, ప్రముఖుల నుంచి మెసేజ్‌లు వస్తుండగా, హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ సూపర్‌స్టార్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రత్యేక పోస్టులతో సందడి చేశారు.

PM Modi Birthday: షారుఖ్ ఖాన్ నుంచి సల్మాన్ ఖాన్ వరకు.. ప్రధాని మోదీ వరకు సెలబ్రిటీల శుభాకాంక్షలు వెల్లువ (PMO/ ANI)
PM Modi Birthday: షారుఖ్ ఖాన్ నుంచి సల్మాన్ ఖాన్ వరకు.. ప్రధాని మోదీ వరకు సెలబ్రిటీల శుభాకాంక్షలు వెల్లువ (PMO/ ANI)

సల్మాన్ ఖాన్ నుంచి షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, కంగనా రనౌత్ వరకు ప్రతి ఒక్కరూ మోదీకి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఆరోగ్యం, సుదీర్ఘ జీవితం గురించి ఆకాంక్షించారు.

'నరేంద్ర భాయ్' అంటూ సల్మాన్ ఖాన్ స్పెషల్ పోస్ట్

బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ తన మార్క్ డిఫరెంట్ స్టైల్‌లో ప్రధానికి విష్ చేశారు. ఎక్స్ వేదికగా పోస్ట్ పెడుతూ, ప్రధానిని ఎంతో అభిమానంతో 'నరేంద్ర భాయ్' అని సంబోధించారు.

"గౌరవనీయులైన ప్రధాని గారికి జన్మదిన శుభాకాంక్షలు. నరేంద్ర భాయ్ మోదీకి హ్యాపీ బర్త్ డే.. జై హింద్" అని సల్మాన్ రాసుకొచ్చారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

దేశానికి మీరు గొప్ప ప్రేరణ: షారుఖ్ ఖాన్

కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనకు నిండు నూరేళ్ల ఆరోగ్యం, సంతోషం కలగాలని కోరుకున్నారు.

"గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీకు ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యం, ఆనందం లభించాలని ఆశిస్తున్నాను. దేశానికి స్ఫూర్తినిచ్చే శక్తినీ, పాజిటివిటీని మీరు ఎప్పుడూ ఇలాగే ముందుకు తీసుకెళ్లాలి" అని షారుఖ్ ట్వీట్ చేశారు.

'సేవా సంకల్పం'తో అక్షయ్ కుమార్ శుభాకాంక్షలు

"ఈ రోజు మన ప్రధాని గారి పుట్టినరోజు. ఈ రోజంతా సేవా సంకల్పంతో వేడుకలు జరుపుకుంటున్నారు. ఎవరికైనా సహాయం చేయడం, అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడం, ఒకరి ముఖంలో నవ్వు పూయించడం కంటే గొప్ప బర్త్ డే సెలబ్రేషన్ మరొకటి ఉండదు" అని అక్షయ్ పేర్కొన్నారు.

శ్లోకంతో కంగనా రనౌత్, తొలి జ్ఞాపకాలతో అనుపమ్ ఖేర్

బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ సంస్కృత శ్లోకాలతో ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు. మోదీకి దేవుడు సుదీర్ఘ ఆయుష్షు, మంచి ఆరోగ్యం ప్రసాదించాలని ఆమె ప్రార్థించారు. దేశాన్ని వికసిత భారత్‌గా మార్చే సంకల్పానికి ఇది కొత్త ఊపిరి పోస్తుందని కంగనా రాసుకొచ్చారు.

మరోవైపు సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ అహ్మదాబాద్‌లో ప్రధాని మోదీతో తన మొదటి సమావేశాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రధాని నిబద్ధత, క్రమశిక్షణ, నిజాయితీ కోట్లాది మంది భారతీయులకు నిరంతర ప్రేరణ అని కొనియాడారు.

సౌత్ సెలబ్రిటీలు కూడా క్యూ కట్టారు

కేవలం బాలీవుడ్ మాత్రమే కాకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా శుభాకాంక్షల వరద పారింది. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూడా ప్రధాని మోదీకి ప్రత్యేక పోస్టులతో విషెస్ అందించారు. నిరంతరం దేశ సేవలో తపించే మోదీ శ్రమ ప్రతి ఒక్కరికీ ఆదర్శమని వారు పేర్కొన్నారు.

ఇలా దేశవ్యాప్తంగా సినీ తారలు ప్రధాని 76వ జన్మదిన వేడుకల్లో భాగస్వాములై తమ అభిమానాన్ని చాటుకున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks