నెట్ఫ్లిక్స్లో 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో' కొత్త సీజన్ ప్రారంభమైంది. మొదటి గెస్ట్గా వచ్చిన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న 'వారణాసి' (Varanasi) సినిమా బడ్జెట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమా బడ్జెట్ ఏకంగా రూ. 1300 కోట్లు అని కపిల్ శర్మ అడగగా.. ఆమె అవునని పరోక్షంగా కన్ఫర్మ్ చేసింది.
వారణాసి బడ్జెట్ రూ.1300 కోట్లా?

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో వస్తున్న భారీ బడ్జెట్ మూవీ 'వారణాసి'. ఈ సినిమా బడ్జెట్ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్న వేళ, ప్రియాంక చోప్రా 'కపిల్ శర్మ షో'లో క్లారిటీ ఇచ్చింది. ఆ షోలో జరిగిన ఆసక్తికర సంభాషణ గురించి ఇప్పుడు చూద్దాం.
ఈ షోలో కపిల్ శర్మ మాట్లాడుతూ.. "ప్రియాంక ఏం చేసినా అది భారీగానే ఉంటుంది. ఇప్పుడు రాజమౌళి గారితో సినిమా చేస్తున్నారు. ఆయన బడ్జెట్లు మనకు తెలిసిందే. కానీ ప్రియాంక ఈ సినిమాలో ఉన్నందు వల్ల బడ్జెట్ ఏకంగా రూ. 1300 కోట్లు అయ్యిందని విన్నాను. సినిమాకేనా లేక వారణాసిలో ఉన్న వాళ్లందరికీ ఉద్యోగాలు ఇస్తున్నారా" అని అడిగాడు.
దీనిపై ప్రియాంక స్పందించింది. ఆ నంబర్ వినగానే ఆడియన్స్ షాక్ అయ్యారు. కానీ ప్రియాంక మాత్రం చిరునవ్వుతో "అవును" అని సమాధానం ఇచ్చింది. దీంతో ఈ సినిమా బడ్జెట్ 1300 కోట్లు అనేది దాదాపు ఖరారైనట్టేనని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
నీ వల్లే బడ్జెట్ పెరిగిందా?
వెంటనే కపిల్ శర్మ తనదైన శైలిలో సెటైర్ వేశాడు. "అసలు బడ్జెట్ తక్కువే అనుకుంటా.. మీరు ప్రాజెక్ట్ లోకి వచ్చాక, మీ రెమ్యునరేషన్ వల్లే బడ్జెట్ పెరిగిపోయిందా?" అని చమత్కరించాడు. "అంటే సగం బడ్జెట్ నా బ్యాంక్ ఖాతాలో పడిందని మీరు పరోక్షంగా అంటున్నారా?" అని ప్రియాంక నవ్వుతూ కౌంటర్ ఇచ్చింది.
కట్టప్ప సీక్రెట్లాగా అది మాత్రం అడగొద్దు
{{/usCountry}}వెంటనే కపిల్ శర్మ తనదైన శైలిలో సెటైర్ వేశాడు. "అసలు బడ్జెట్ తక్కువే అనుకుంటా.. మీరు ప్రాజెక్ట్ లోకి వచ్చాక, మీ రెమ్యునరేషన్ వల్లే బడ్జెట్ పెరిగిపోయిందా?" అని చమత్కరించాడు. "అంటే సగం బడ్జెట్ నా బ్యాంక్ ఖాతాలో పడిందని మీరు పరోక్షంగా అంటున్నారా?" అని ప్రియాంక నవ్వుతూ కౌంటర్ ఇచ్చింది.
కట్టప్ప సీక్రెట్లాగా అది మాత్రం అడగొద్దు
{{/usCountry}}షోలో ఉన్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ వారణాసి సినిమా కథ గురించి అడగడానికి ప్రయత్నించగా.. "బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే విషయం సెకండ్ పార్ట్ వచ్చేదాకా ఎవరికీ తెలియలేదు. రాజమౌళి గారి సినిమాల గురించి ఇప్పుడే ఏం తెలుసుకోలేం" అని కపిల్ జోక్ చేశాడు.
'వారణాసి' సినిమా విశేషాలు
వారణాసి సినిమాలో మహేష్ బాబు (రుద్ర), ప్రియాంక చోప్రా (మందాకిని), పృథ్వీరాజ్ సుకుమారన్ (కుంభ) లీడ్ రోల్స్ పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇది ప్రపంచంలోని వివిధ ఖండాలు, కాలాల చుట్టూ తిరిగే అడ్వెంచర్ డ్రామా. ఈ సినిమాను 2027 సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.