Varanasi: రాజమౌళి-మహేష్ ‘వారణాసి’పై విజయేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు.. ఆ సీన్ కు థియేటర్లలో పూనకాలే.. ట్విస్ట్ రివీల్!
Varanasi: వారణాసి మూవీ గురించి అదిరిపోయే అప్డేట్ చెప్పారు రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్. ఈ మూవీలో ఓ సీక్వెన్స్ స్పెల్ బౌండ్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ గ్లోబల్ అడ్వెంచర్ మూవీ విశేషాలు ఇక్కడ చదవండి.
Varanasi: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'వారణాసి'పై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా జరిగిన 'ఫిల్మీ ఫోకస్' ఈవెంట్ లో ఈ చిత్ర కథా రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సినిమాకు సంబంధించిన ఒక కీలక సన్నివేశం గురించి సంచలన విషయాలు పంచుకున్నాడు.

వారణాసి సీక్వెన్స్
తాజాగా జరిగిన ఈవెంట్ లో విజయేంద్ర ప్రసాద్ కామెంట్లు వైరల్ గా మారాయి. వారణాసిలో ఒక 30 మినిట్స్ సీక్వెన్స్ ఇండియాను షేక్ చేస్తుందని అన్నారు కదా, అది దేనికి సంబంధించిందనే ప్రశ్న విజయేంద్ర ప్రసాద్ కు ఎదురవుతుంది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘‘అది రాముడికి, కుంభకర్ణుడికి మధ్య జరిగే యుద్ధం. మీకు ట్రైలర్ లో కుంభకర్ణుడు, రాముడు, హనుమంతుడు కనిపించాడు కదా. తోకపై రథం వెళ్తుంది కదా. అదే స్పెల్ బౌండ్’’ అని వెల్లడించారు.
రాముడిగా మహేష్ బాబు
మహేష్ బాబు మునుపెన్నడూ కనిపించని విధంగా వారణాసి సినిమాలో రెండు విభిన్న కోణాలు ఉన్న పాత్రల్లో నటిస్తున్నాడు. ఆయన అడ్వెంచరర్ ‘రుద్ర’ పాత్రతో పాటు భగవాన్ ‘శ్రీరాముడి’ పాత్రలోనూ మెరిసి అభిమానులను అలరించనున్నాడు. అంతర్జాతీయ స్థాయి యాక్షన్ అంశాలకు, భారతీయ పురాణేతిహాసమైన రామాయణ గాథను ముడిపెడుతూ రాజమౌళి ఈ కథను సిద్ధం చేశాడు.
రామ వర్సెస్ కుంభ
గ్లోబ్ట్రోటింగ్ అడ్వెంచర్గా వస్తున్న వారణాసి చిత్రం భారతీయ సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికపై మరో మెట్టు ఎక్కించనుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ భారీ మల్టీస్టారర్ ప్రాజెక్టులో గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా జోనాస్ ‘మందాకిని’ అనే కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో విలన్ కుంభగా కనిపిస్తాడు.
రామాయణంలోని శక్తివంతమైన రాక్షస పాత్ర కుంభకర్ణుడి స్ఫూర్తితో డిజైన్ చేసిన ‘కుంభ’ అనే నెగెటివ్ రోల్లో పృథ్వీరాజ్ నటిస్తున్నాడు. రామ వర్సెస్ కుంభ పోరులో మహేష్ బాబు, పృథ్వీరాజ్ మధ్య వచ్చే ఘర్షణ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
ఐమాక్స్ లో
సాంకేతికంగానూ వారణాసి సరికొత్త రికార్డులను సృష్టించబోతోంది. ఈ చిత్రంలోని కొన్ని ముఖ్యమైన యాక్షన్ బ్లాకులను అత్యాధునిక 1.43:1 ఐమాక్స్ (IMAX) ఫార్మాట్లో చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన అంచనాలను పెంచేస్తున్నాయి. బ్రహ్మాండమైన పురాతన గుహలు, అగ్ని కీలల మధ్య జరిగే భీకర యుద్ధ సన్నివేశాలు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి.
ఈ దృశ్యాలు వెండితెరపై విజువల్ వండర్గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ దృశ్య కావ్యం 2027 ఏప్రిల్ 7న భారీ ఎత్తున థియేటర్లలోకి రానుంది.
People Also Ask (FAQ)
ప్రశ్న: 'వారణాసి' చిత్రంలో మహేష్ బాబు ఏ పాత్రలు పోషిస్తున్నాడు?
జవాబు: మహేష్ బాబు ఈ సినిమాలో అడ్వెంచరర్ రుద్ర, శ్రీరాముడి పాత్రలో కనిపిస్తారు.
ప్రశ్న: ఈ చిత్రంలో విలన్ పాత్ర ఎవరు చేస్తున్నారు, దాని ప్రత్యేకత ఏంటి?
జవాబు: మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో విలన్గా నటిస్తున్నాడు. రామాయణంలోని కుంభకర్ణుడి పాత్ర ఆధారంగా ఆయన పోషిస్తున్న 'కుంభ' పాత్రను రూపొందించారు.
ప్రశ్న: ఈ సినిమా ఏ ఫార్మాట్లో విడుదల కానుంది?
జవాబు: ఈ చిత్రంలోని కీలక సన్నివేశాలను సరికొత్త 1.43:1 ఐమాక్స్ (IMAX) ఫార్మాట్లో చిత్రీకరిస్తున్నారు.
ప్రశ్న: 'వారణాసి' సినిమా విడుదల తేదీ ఎప్పుడు?
జవాబు: ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


