క్రేజీ బజ్.. రామ్ చరణ్ పెద్దిలో మృణాల్ ఠాకూర్ ఐటెమ్ సాంగ్
రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం మృణాల్ ఠాకూర్ను సంప్రదించినట్లు సమాచారం. మరోవైపు ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని, ఆ తేదీకి పవన్ కళ్యాణ్ సినిమా రావచ్చని వార్తలు వస్తున్నాయి.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ ‘పెద్ది’ షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో ఆడిపాడేందుకు ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్తో చర్చలు జరుగుతున్నాయన్న క్రేజ్ బజ్ ఇప్పుడు ఇండస్ట్రీలో నెలకొంది. ధనుష్ తో పెళ్లి పుకార్ల నేపథ్యంలో మృణాల్ ఇలా ఐటెమ్ సాంగ్ అంటూ వార్తల్లో నిలవడం విశేషం.

మృణాల్ ఠాకూర్ ఎంట్రీ..
ఈమధ్యే మృణాల్ ఠాకూర్.. స్టార్ హీరో ధనుష్తో ప్రేమలో ఉందంటూ వచ్చిన పుకార్ల కారణంగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. వీరిద్దరూ ఫిబ్రవరి 14న పెళ్లి చేసుకోబోతున్నారని కూడా కొన్ని రిపోర్టులు వెల్లడించాయి. అయితే మృణాల్ టీమ్ ఈ పుకార్లను ఖండించింది. ఆమె ప్రస్తుతం తాను ఒప్పుకున్న సినిమాలపైనే పూర్తి దృష్టి సారించిందని వారు స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించిన మృణాల్ ఠాకూర్.. రామ్ చరణ్ లాంటి హీరో సరసన ఓ స్పెషల్ సాంగ్ చేయబోతుందన్న వార్త కచ్చితంగా ఆసక్తి రేపేదే. అయితే దీనిపై మూవీ టీమ్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇటు మృణాల్ కూడా దీనిపై స్పందించలేదు. అయితే ఇదే నిజమైతే మాత్రం చరణ్, మృణాల్ కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్ పై ప్రత్యేకంగా కనిపించడం ఖాయం.
పెద్ది వాయిదా పడిందా?
నేషనల్ అవార్డు విన్నర్ అయిన బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్న ‘పెద్ది’ మూవీ ఇప్పటికే దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. మొదట ఈ సినిమాను ఈ ఏడాది మార్చి 27న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా వాయిదా పడవచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఒకవేళ ‘పెద్ది’ సినిమా మార్చి 27 తేదీ నుంచి తప్పుకుంటే.. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదలయ్యే అవకాశం ఉంది. నాని సినిమా ‘ది ప్యారడైజ్’ కూడా అదే సమయంలో విడుదల కావాల్సి ఉంది. కానీ అది కూడా పోటీ నుంచి తప్పుకోవచ్చని సమాచారం.
దీనికి ప్రధాన కారణం మార్చి 19న విడుదల కానున్న ‘ధురంధర్ 2’ మూవీ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ప్రభంజనం సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు. అందుకే తమ పాన్ ఇండియా సినిమాను ఆ సినిమాతో పోటీకి దింపకూడదని ‘పెద్ది’ నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
త్వరలో కొత్త పాట..
పెద్ది సినిమా నుంచి ఇప్పటికే ‘చికిరి చికిరి’ అనే పాట విడుదలై యూట్యూబ్ లో సంచలనాలు క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలో రెండో పాటను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ముంబైలో తనకు తగినంత పని దొరకడం లేదని రెహమాన్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో.. మంచి మ్యూజిక్ అందించాలనే ఒత్తిడి అతనిపై ఉంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


