RGV Movie: బాలీవుడ్లో సరికొత్త సంచలనానికి తెరలేచింది. అండర్వరల్డ్ చిత్రాల ట్రెండ్సెట్టర్ రామ్ గోపాల్ వర్మ, లవ్ స్టోరీల స్పెషలిస్ట్ మోహిత్ సూరి చేతులు కలిపారు. ముంబై అండర్వరల్డ్ను షేక్ చేసిన దావూద్ ఇబ్రహీం, ఛోటా రాజన్ విడిపోయిన సంచలనాత్మక ఘటనల ఆధారంగా వీరిద్దరూ ఒక భారీ గ్యాంగ్స్టర్ డ్రామాను రూపొందిస్తున్నారు.

ఈ క్రేజీ ప్రాజెక్ట్కి ఆర్జీవీ స్క్రిప్ట్ అందించడంతో పాటు కో-ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తుండగా, మోహిత్ సూరి దర్శకత్వం వహించనున్నారు. "గ్యాంగ్స్టర్ కర్రీలో లవ్ డిష్ వండుతున్నాం" అంటూ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా సెల్ఫీ షేర్ చేసి అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించారు. 'సత్య', 'కంపెనీ' సినిమాలతో గ్యాంగ్స్టర్ జోనర్కు బెంచ్మార్క్ సెట్ చేసిన ఆర్జీవీ.. 'సయ్యారా' లాంటి ఎమోషనల్ బ్లాక్బస్టర్ ఇచ్చిన మోహిత్ కాంబినేషన్ మూవీ లవర్స్ను అమితంగా ఆకట్టుకుంటోంది.
దావూద్-ఛోటా రాజన్ స్ప్లిట్ వెనుక అసలు కథ
1993 ముంబై పేలుళ్ల తర్వాత అండర్వరల్డ్ చరిత్రలోనే అతిపెద్ద మలుపుగా మారిన దావూద్ ఇబ్రహీం, ఛోటా రాజన్ వైరం నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది. 'సౌత్య' అనే వ్యక్తి వల్ల వీరిద్దరి మధ్య తలెత్తిన విభేదాలు, ఆ తర్వాత భారత నిఘా సంస్థలు తీసుకున్న రహస్య చర్యలు ఈ సినిమాలో ప్రధానాంశాలుగా ఉండబోతున్నాయి.
కేవలం గ్యాంగ్స్టర్ పోరాటాలు మాత్రమే కాకుండా, భారత గూఢచారి సంస్థల ఇన్వాల్వ్మెంట్, 93 బాంబు పేలుళ్ల తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను రియలిస్టిక్గా చూపించనున్నట్లు వర్మ వివరించారు. "నా క్లాసిక్ 'సత్య' కంటే మరింత రియలిస్టిక్ హృదయంతో, ఇటీవల సంచలనం సృష్టించిన 'ధురందర్' కంటే భారీ స్కేల్లో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది" అని ఆర్జీవీ కాన్ఫిడెంట్గా ప్రకటించారు.
'సయ్యారా' బ్లాక్బస్టర్ తర్వాత మోహిత్ సూరి నెక్ట్స్ ప్లాన్
కొన్నాళ్ల కిందట అహాన్ పాండే, అనీత్ పడ్డా జంటగా మోహిత్ సూరి తెరకెక్కించిన 'సయ్యారా' (Saiyaara) రికార్డు స్థాయి వసూళ్లతో హిస్టరీ క్రియేట్ చేసింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండియాలో రూ. 329.73 కోట్ల నెట్, ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 570.33 కోట్ల గ్రాస్ సాధించి ఇండస్ట్రీని షేక్ చేసింది. ఈ ఇంటెన్స్ లవ్ స్టోరీ ఇచ్చే జోష్తో మోహిత్ సూరి ఇప్పుడు ఆర్జీవీ మార్క్ గ్యాంగ్స్టర్ వరల్డ్లోకి అడుగుపెడుతున్నారు.
{{/usCountry}}కొన్నాళ్ల కిందట అహాన్ పాండే, అనీత్ పడ్డా జంటగా మోహిత్ సూరి తెరకెక్కించిన 'సయ్యారా' (Saiyaara) రికార్డు స్థాయి వసూళ్లతో హిస్టరీ క్రియేట్ చేసింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండియాలో రూ. 329.73 కోట్ల నెట్, ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 570.33 కోట్ల గ్రాస్ సాధించి ఇండస్ట్రీని షేక్ చేసింది. ఈ ఇంటెన్స్ లవ్ స్టోరీ ఇచ్చే జోష్తో మోహిత్ సూరి ఇప్పుడు ఆర్జీవీ మార్క్ గ్యాంగ్స్టర్ వరల్డ్లోకి అడుగుపెడుతున్నారు.
{{/usCountry}}ఆర్జీవీ రాసిన పవర్ ఫుల్ డ్రామాకు మోహిత్ సూరి తన మార్క్ హార్ట్ టచింగ్ ఎమోషన్స్, సూపర్ హిట్ మ్యూజిక్, అల్ట్రా రియలిస్టిక్ యాక్షన్ జోడిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఫ్రెన్సిస్ ఫోర్డ్ కొప్పోలా 'జాస్' తీస్తే లేదా స్టీవెన్ స్పీల్బర్గ్ 'గాడ్ఫాదర్' తెరకెక్కిస్తే ఎలా ఉంటుందో.. ఈ కాంబో కూడా అదే రేంజ్లో సరికొత్త అనుభూతిని ఇస్తుందని ఆర్జీవీ పోలిక తెచ్చారు.
లైనప్లో ఆర్జీవీ వరుస ప్రాజెక్ట్లు
రామ్ గోపాల్ వర్మ ఖాతాలో ప్రస్తుతం వరుస ఆసక్తికరమైన ప్రాజెక్ట్లు ఉన్నాయి. ముంబై ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ లైఫ్ ఆధారంగా హర్షవర్ధన్ రానే హీరోగా 'పోలీస్ కంపెనీ' అనే రెండు భాగాల థియేట్రికల్ ఫ్రాంచైజీని టీ-సిరీస్ బ్యానర్లో రూపొందిస్తున్నారు.
అలాగే మనోజ్ బాజ్పాయ్తో కలిసి 'పోలీస్ స్టేషన్ మే భూత్' అనే హారర్ కామెడీ మూవీని కూడా ప్లాన్ చేస్తున్నారు. దేశంలోని రక్షణ వ్యవస్థ ఒక్క రోజులో కూలిపోతే ఏమవుతుందనే కాన్సెప్ట్తో 'సిండికేట్' అనే మరో ప్రాజెక్ట్ను కూడా ఆర్జీవీ లైన్అప్లో ఉంచారు.