Ramayana: రావణుడు గొప్ప యోధుడు, పండితుడు, దయగల రాజు.. రామాయణ మూవీలో అలాగే చూపించబోతున్నాం: డైరెక్టర్ కామెంట్స్

Ramayana: రావణుడు అంటే కేవలం విలనే కాదు గొప్ప యోధుడు, పండితుడు, దయగల రాజు అని రామాయణ మూవీ డైరెక్టన్ నితేష్ తివారీ అన్నాడు. తన రామాయణ మూవీలో రావణుడిని అలా కూడా చూపించబోతున్నట్లు చెప్పాడు.

Published on: Apr 8, 2026, 20:31:42 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ramayana: ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న 'రామాయణం'పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రణబీర్ కపూర్ (రాముడు), సాయి పల్లవి (సీత), యష్ (రావణుడు) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు నితీష్ తివారీ ఎలా ఆవిష్కరించబోతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన నితీష్.. రావణుడి పాత్ర చిత్రణపై సంచలన విషయాలను పంచుకున్నాడు. రావణుడిని కేవలం ఒక విలన్ గానే కాకుండా, అతనిలోని భిన్న కోణాలను ప్రపంచానికి చూపించబోతున్నట్లు అతడు స్పష్టం చేశాడు.

Ramayana: రావణుడు గొప్ప యోధుడు, పండితుడు, దయగల రాజు.. రామాయణ మూవీలో అలాగే చూపించబోతున్నాం: డైరెక్టర్ కామెంట్స్
Ramayana: రావణుడు గొప్ప యోధుడు, పండితుడు, దయగల రాజు.. రామాయణ మూవీలో అలాగే చూపించబోతున్నాం: డైరెక్టర్ కామెంట్స్

రావణుడు యోధుడు, పండితుడు

రావణుడిని ఒక సాధారణ విలన్ తరహాలో కాకుండా, అతని మేధస్సును, భక్తిని చూపిస్తారా? అని అడిగిన ప్రశ్నకు నితీష్ ఆసక్తికరంగా స్పందించాడు. "రావణుడి జీవితంలో చాలా కోణాలు ఉన్నాయి. అతను గొప్ప యోధుడు, నిష్ణాతుడైన సంగీత విద్వాంసుడు, గొప్ప పండితుడు. తన ప్రజలను ప్రేమించే రాజు. వీటన్నింటికీ మించి అతను పరమ శివభక్తుడు. రావణుడు అంటే కేవలం ఒక విలన్ మాత్రమే కాదు.. అంతకు మించి చాలా ఉంది," అని నితీష్ పేర్కొన్నాడు.

అహంకారం ఉంటే పతనం తప్పదు: ఒక గొప్ప పాఠం

రామాయణ మూవీలో రావణుడిలోని ఇన్ని మంచి లక్షణాలను చూపించడంలో ఒక బలమైన ఉద్దేశం ఉందని దర్శకుడు వివరించాడు. "ఒక మనిషిలో ఎన్ని గొప్ప గుణాలు ఉన్నా, ఎంతటి జ్ఞానం ఉన్నా.. ఒకవేళ అతను పగ, అహంకారంతో నిర్ణయాలు తీసుకుంటే ఫలితం ఎలా ఉంటుందో చూపించడమే ఈ సినిమాలోని ప్రధాన పాఠం. ఆ పాఠం రావణుడి పాత్ర ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది" అని అతడు చెప్పుకొచ్చాడు.

కేవలం విజువల్స్ మాత్రమే కాదు, భావోద్వేగాలే ఈ సినిమాకు ప్రాణం అని, అయోధ్య, లంకను ఇదివరకు ఎవరూ చూడని రీతిలో భారీ స్థాయిలో వెండితెరపై ఆవిష్కరిస్తామని అతడు హామీ ఇచ్చాడు.

ఏడేళ్ల కష్టం.. హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ

ఈ సినిమా టీజర్ లాంచ్ సందర్భంగా నిర్మాత నమిత్ మల్హోత్రా భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి తనకు ఏడేళ్లు పట్టిందని అతడు తెలిపాడు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, DNEG, యష్‌కు చెందిన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత హ్యాన్స్ జిమ్మెర్, ఏఆర్ రెహమాన్ కలిసి సంగీతం అందిస్తుండటం విశేషం.

రామాయణం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. రామాయణం సినిమాలో రావణుడి పాత్రను ఎవరు పోషిస్తున్నారు?

కన్నడ స్టార్ హీరో యష్ ఈ చిత్రంలో రావణుడి పాత్రను పోషిస్తున్నారు.

2. నితీష్ తివారీ రామాయణం ఎన్ని భాగాలుగా విడుదల అవుతుంది?

ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. మొదటి భాగం 2026లో, రెండో భాగం 2027లో ప్రేక్షకుల ముందుకు వస్తాయి.

3. ఈ సినిమాకు సంగీతం ఎవరు అందిస్తున్నారు?

ప్రముఖ అంతర్జాతీయ సంగీత దర్శకుడు హ్యాన్స్ జిమ్మెర్, భారతీయ దిగ్గజం ఏఆర్ రెహమాన్ ఈ సినిమా కోసం కలిసి పనిచేస్తున్నారు.

4. ఈ సినిమాలో రాముడు, సీత పాత్రల్లో ఎవరు నటిస్తున్నారు?

రణబీర్ కపూర్ రాముడి పాత్రలో, సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More