...
...
Next Story

శ్రీలంకలో రష్మిక మందన్న బ్యాచిలొరెట్ పార్టీ.. ఫ్రెండ్స్‌తో చిల్ అవుతూ గ్లామ‌ర్ షో.. ఫొటోలు వైర‌ల్‌!

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో పెళ్లికి రెడీ అవుతోంది రష్మిక మందన్న. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీళ్ల వెడ్డింగ్ జరగబోతున్నట్లు సమాచారం. తాజాగా ఫ్రెండ్స్ తో కలిసి రష్మిక శ్రీలంక ట్రిప్ కు వెళ్లింది. అక్కడ బ్యాచిలొరెట్ పార్టీ చేసుకున్నారని టాక్.

Published on: Dec 17, 2025, 11:03:19 IST
Advertisement

2025వ సంవత్సరం రష్మిక మందన్న కెరీర్ లో స్పెషల్ గా నిలిచిపోతుంది. ఈ ఏడాది ఆమె హీరోయిన్ గా నటించిన అయిదు సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరోవైపు తన లవర్ విజయ్ దేవరకొండతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ ఇయర్ ఫుల్ బిజీగా ఉన్న రష్మిక ఎండింగ్ లో కాస్త బ్రేక్ తీసుకుంది. ఫ్రెండ్స్ తో కలిసి శ్రీలంక్ టూర్ వేసింది. ఇది రష్మిక బ్యాచిలొరెట్ పార్టీ అని ఫ్యాన్స్ అంటున్నారు.

రష్మిక మందన్న బ్యాచిలొరెట్

రష్మిక మందన్న బ్యాచిలోరెట్ పార్టీ (Instagram)
రష్మిక మందన్న బ్యాచిలోరెట్ పార్టీ (Instagram)

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న 2026 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోబోతున్నారు. సాధారణంగా అబ్బాయిలు పెళ్లికి ముందు బ్యాచిలర్ పార్టీ చేసుకుంటారు. అదే అమ్మాయిలు చేసుకుంటే అది బ్యాచిలొరెట్ పార్టీ. ఇప్పుడు విజయ్ తో పెళ్లికి ముందు రష్మిక మందన్న తన ఫ్రెండ్స్ కు శ్రీలంకలో బ్యాచిలొరెట్ పార్టీ ఇచ్చిందని తెలిసింది.

శ్రీలంక ట్రిప్

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తన షూటింగ్ లు, షెడ్యూల్ నుండి కొంత బ్రేక్ తీసుకుంది. తన ఫ్రెండ్స్ తో కలిసి శ్రీలంకకు ట్రిప్ వెళ్లింది. మొత్తం గర్ల్స్ గ్యాంగ్ తో చిల్ అయింది. తన సోషల్ మీడియా ఖాతాలలో ఆ గ్లామర్ ఫొటోలను రష్మిక పోస్టు చేసింది.

"నాకు ఇటీవలే 2 రోజుల సెలవు వచ్చింది. నా గర్ల్స్ తో కలిసి తప్పించుకునే అవకాశం నాకు లభించింది. మేము శ్రీలంకలోని ఈ అందమైన ప్రాపర్టీకి వెళ్ళాము. గర్ల్స్ ట్రిప్స్.. ఎంత చిన్నవి ఉత్తమమైనవి అనేది పట్టింపు లేదు !! నా గర్ల్స్ బెస్ట్" అని ఈ ఫొటోలకు రష్మిక క్యాప్షన్ రాసుకొచ్చింది.

ఫ్రెండ్స్ తో రచ్చ

రష్మిక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. "అబద్ధం చెప్పకండి. ఇది మీ బ్యాచిలొరెట్ నా" ఒక అభిమాని చమత్కరించాడు. మరొకరు.. "వివాహానికి ముందు అమ్మాయిలతో మంచి యాత్ర" అని కామెంట్ చేశారు. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ పాత స్నేహితులతో సమయం గడపడంలో రష్మిక ఎంత బాగుంది అని చాలా మంది వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 26, 2026న రష్మిక, విజయ్ వివాహం చేసుకోబోతున్నారని హిందూస్థాన్ టైమ్స్ కు ఇప్పటికే తెలిసింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks