Rashmika Mandanna: భారతీయ సంగీత ప్రపంచంలో శిఖరాగ్రాన నిలిచిన ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్లో నటించే అరుదైన అవకాశం రష్మిక మందన్నను వరించింది. 'M.S. – ఎ లెగసీ ఆన్ స్క్రీన్' పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ఆమె సుబ్బులక్ష్మి పాత్రలో కనిపించనుంది. ఈ మేరకు ఇవాళ (సెప్టెంబర్ 15) అఫీషియల్ అప్డేట్ వచ్చింది.
ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్

చాలా కాలంగా ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ గురించి చర్చ జరుగుతోంది. ఈ మూవీలో సుబ్బలక్ష్మి పాత్రను సాయిపల్లవి లేదా రుక్మిణి వసంత్ పోషిస్తుందనే టాక్ కూడా వినిపించింది. కానీ చివరకు రష్మిక మందన్న ఆ రోల్ కు కన్ఫామ్ అయింది.
ఆ డైరెక్టర్
'జెర్సీ' వంటి ఎమోషనల్ హిట్ అందించిన గౌతమ్ తిన్ననూరి ఈ ఎంఎస్ సుబ్బలక్మి బయోపిక్ కు దర్శకత్వం వహించనున్నాడు. అతను లాస్ట్ ఇయర్ విజయ్ దేవరకొండతో ‘కింగ్డమ్’ తీసిన సంగతి తెలిసిందే. ఇక రాక్స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ ప్రెస్టీజియస్ బయోపిక్ కు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపికయ్యాడు.
ఎంఎస్- ఎ లెగసీ ఆన్ స్క్రీన్ సినిమాను గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్, బన్నీ వాసు, కన్నడ అగ్ర నిర్మాత రాక్లైన్ వెంకటేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గీతా ఆర్డ్స్ అనౌన్స్ మెంట్ తో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు రేపు (సెప్టెంబర్ 16) వెల్లడి కానున్నాయి.
కమల్ హాసన్ చీఫ్ గెస్ట్
ఎం.ఎస్. సుబ్బులక్ష్మి 110వ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 16న చెన్నైలో ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక ఘనంగా జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఉలగనాయగన్ కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ వేడుకలో ఇండియన్ కోరల్ ఎన్సెంబుల్ బృందం సుబ్బులక్ష్మి ఆలపించిన ప్రసిద్ధ కీర్తనలు, భక్తి గీతాలను ప్రత్యక్షంగా ప్రదర్శిస్తూ ప్రత్యేక సంగీత నివాళి అర్పించనుంది.
{{/usCountry}}ఎం.ఎస్. సుబ్బులక్ష్మి 110వ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 16న చెన్నైలో ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక ఘనంగా జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఉలగనాయగన్ కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ వేడుకలో ఇండియన్ కోరల్ ఎన్సెంబుల్ బృందం సుబ్బులక్ష్మి ఆలపించిన ప్రసిద్ధ కీర్తనలు, భక్తి గీతాలను ప్రత్యక్షంగా ప్రదర్శిస్తూ ప్రత్యేక సంగీత నివాళి అర్పించనుంది.
{{/usCountry}}కేవలం సంగీతకారిణిగానే కాకుండా 'సేవాసదనం', 'శాకుంతలై', 'సావిత్రి', క్లాసిక్ 'మీరా' వంటి చిత్రాలలో నటించి వెండితెరపై కూడా తన ముద్ర వేసిన సుబ్బులక్ష్మి ప్రయాణాన్ని ఈ సినిమాలో ప్రధానంగా చూపించనున్నారు.
రష్మికకు పరీక్ష
కమర్షియల్ ప్రాజెక్ట్లతో సౌత్ అండ్ నార్త్లలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకెళ్తున్న రష్మిక మందన్నకు ఈ బయోపిక్ కెరీర్లోనే అసలైన పరీక్ష అని చెప్పొచ్చు. 'పుష్ప', 'యానిమల్' వంటి కమర్షియల్ మాస్ హిట్ చిత్రాల తర్వాత ఒక భారతరత్న గ్రహీత, క్లాసికల్ ఐకాన్ పాత్రను పోషించడం ఆమె నటనా సామర్థ్యానికి పెద్ద సవాలు.