ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ఐదు సినిమాల్లో అంతంతమాత్రం వసూళ్లు సాధించిన ఏకైక మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ మూవీయే ఓటీటీలోకి మొదటగా వస్తుందని భావించినా ఇప్పటి వరకూ రాలేదు. మిగిలిన నాలుగు మూవీస్ ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఫిబ్రవరి 13నే వస్తుందని భావించిన ఈ మూవీపై ఎలాంటి అధికారిక అప్డేట్ లేదు.
ఓటీటీలోకి వచ్చేది ఆ రోజేనా?

అయితే తాజాగా భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీ రిలీజ్ పై మరో బజ్ నెలకొంది. ఈ సినిమాను జీ5 ఓటీటీ వచ్చే శుక్రవారం అంటే ఫిబ్రవరి 20 నుంచి స్ట్రీమింగ్ చేయబోతోందని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన లేకపోయినా.. దాదాపు ఇదే కన్ఫమ్ అన్నట్లుగా చెబుతున్నారు.
ఇదే జీ5 ఓటీటీలోకి ఫిబ్రవరి 11న మన శంకరవరప్రసాద్ గారు వచ్చిన విషయం తెలిసిందే. ఆ మూవీ డిజిటల్ ప్లాట్ఫామ్ పైనా రికార్డులు తిరగరాస్తోంది. సరిగ్గా ఇదే కారణంతోనే భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ డిజిటల్ ప్రీమియర్ ను జీ5 వాయిదా వేసిందని గతంలో వార్తలు వచ్చాయి.
రెండు పెద్ద సినిమాలను ఒకేసారి తీసుకురావడం వల్ల వ్యూస్ డివైడ్ అయ్యే అవకాశం ఉండటంతో రవితేజ సినిమాను వాయిదా వేశారు. ఇప్పుడు 20వ తేదీకి తీసుకురావడం వల్ల రెండు సినిమాలకు తగినంత గ్యాప్ ఉండబోతోంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.
భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ విశేషాలు
సంక్రాంతి 2026 కానుకగా జనవరి 13న విడుదలైన రవితేజ మూవీ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' (Bhartha Mahasayulaku Wignyapthi). కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించుకుంది. రవితేజ తన మాస్ ఇమేజ్ పక్కనపెట్టి చేసిన ఈ సినిమా ఓ రకంగా అతని డిజాస్టర్లకు బ్రేక్ వేసింది. కానీ ఆశించిన విజయం మాత్రం ఇవ్వలేకపోయింది.
ఒక బిజినెస్ మ్యాన్ (రవితేజ) తన భార్య, విదేశీ పర్యటనలో పరిచయమైన మరో మహిళ మధ్య నలిగిపోయే కథ ఇది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించారు. థియేటర్లో మిస్ అయిన వారు ఈ సినిమా కోసం మరి కొన్ని రోజుల వరకు వేచి చూడాల్సిందే.
{{/usCountry}}ఒక బిజినెస్ మ్యాన్ (రవితేజ) తన భార్య, విదేశీ పర్యటనలో పరిచయమైన మరో మహిళ మధ్య నలిగిపోయే కథ ఇది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించారు. థియేటర్లో మిస్ అయిన వారు ఈ సినిమా కోసం మరి కొన్ని రోజుల వరకు వేచి చూడాల్సిందే.
{{/usCountry}}