Ravi Teja Maruthi: ఇరుముడి సెట్స్‌లో రవితేజ.. రాజాసాబ్ డైరెక్టర్‌తో సీక్రెట్ డీల్ కుదిరిందా? మాస్ మహారాజా షాకింగ్ ప్లాన్

Ravi Teja Maruthi: రవితేజ, మారుతి కాంబినేషన్ లో మూవీ రాబోతోందన్న క్రేజీ బజ్ ప్రస్తుతం టాలీవుడ్ లో నెలకొంది. అదే నిజమైతే మరో క్రేజీ కాంబినేషన్ సిద్ధమైనట్లే. ది రాజా సాబ్ తర్వాత డల్లయిపోయిన మారుతి.. మాస్ మహారాజాతో ఏం చేస్తాడన్న ఆసక్తి నెలకొంది.

Published on: Jun 22, 2026, 17:43:22 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ravi Teja Maruthi: రవితేజ, డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో సినిమా అంటేనే ఎంతో క్రేజీగా ఉంది కదా. అయితే అదే నిజం కాబోతోందని ప్రస్తుతం టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ది రాజా సాబ్ ఫెయిల్యూర్ తర్వాత కనిపించకుండా పోయిన మారుతి.. ఆ మధ్య తన నెక్ట్స్ మూవీ స్క్రిప్ట్ రెడీ అని అన్నాడు. మరి అది ఇదేనా అన్న సందేహాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి.

Ravi Teja Maruthi: ఇరుముడి సెట్స్‌లో రవితేజ.. రాజాసాబ్ డైరెక్టర్‌తో సీక్రెట్ డీల్ కుదిరిందా? మాస్ మహారాజా షాకింగ్ ప్లాన్
Ravi Teja Maruthi: ఇరుముడి సెట్స్‌లో రవితేజ.. రాజాసాబ్ డైరెక్టర్‌తో సీక్రెట్ డీల్ కుదిరిందా? మాస్ మహారాజా షాకింగ్ ప్లాన్

రవితేజ ఇరుముడిలో బిజీ

మాస్ మహారాజా రవితేజ బాక్సాఫీస్ స్పీడ్ గురించి టాలీవుడ్‌లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫలితంతో అస్సలు సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో థియేటర్లలో జాతర చేయడం మన మాస్ మహారాజా స్టైల్. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న 'ఇరుముడి' సినిమా షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ఎమోషనల్ అండ్ డివోషనల్ డ్రామాపై ఇండస్ట్రీలో ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్‌పై ఉండగానే మాస్ రాజా తన నెక్స్ట్ మూవీ లైనప్‌ను మరింత పవర్‌ఫుల్‌గా సెట్ చేసుకుంటున్నట్లు ఫిలిం నగర్ వర్గాల నుంచి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ మారుతీతో రవితేజ తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ది రాజా సాబ్ దెబ్బకు..

డైరెక్టర్ మారుతీ రీసెంట్‌గా రెబల్ స్టార్ ప్రభాస్‌తో తెరకెక్కించిన భారీ హారర్ కామెడీ మూవీ 'ది రాజా సాబ్' బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ఈ మూవీ వరల్డ్‌వైడ్‌గా రూ.208 కోట్ల గ్రాస్ వసూలు చేసి అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ అయింది. ఈ సినిమా అండర్ పర్ఫార్మెన్స్ తర్వాత మారుతీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ఫుల్ ఫోకస్ పెట్టారు. కొన్ని వారాల క్రితమే తను కొత్త స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసినట్లు సోషల్ మీడియా ద్వారా హింట్ ఇచ్చారు.

మాస్, కామెడీ టైమింగ్ కాంబినేషన్

ఈ క్రమంలోనే మారుతీ రీసెంట్‌గా రవితేజకు ఒక అదిరిపోయే పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ లైన్ వినిపించినట్లు టాక్ నడుస్తోంది. మారుతీ మార్క్ మార్కెట్ క్లాస్ కామెడీ టైమింగ్, రవితేజ బాడీ లాంగ్వేజ్ అండ్ మాస్ ఎనర్జీకి పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యేలా ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ అండ్ యాక్షన్ డ్రామాను డిజైన్ చేశారట. నిజానికి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రావాలని గత మూడేళ్లుగా చర్చలు జరుగుతున్నప్పటికీ ఇద్దరి బిజీ షెడ్యూల్స్ వల్ల కుదరలేదు. ఇప్పుడు ఇద్దరికీ సరైన టైమ్ దొరకడంతో ఈ ప్రాజెక్ట్ దాదాపు లాక్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.

ఇరుముడి తర్వాత ఇదేనా?

ప్రస్తుతం రవితేజ చేస్తున్న 'ఇరుముడి' సినిమాలో ఆయన అయ్యప్ప స్వామి భక్తుడిగా ఒక డిఫరెంట్ లుక్‌లో కనిపించబోతున్నారు. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా గ్లింప్స్ 'ది హార్ట్ ఆఫ్ ఇరుముడి'కి ఆల్రెడీ ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ ఎమోషనల్ డ్రామా కంప్లీట్ అయిన వెంటనే మారుతీ సినిమాను పట్టాలెక్కించే ఛాన్స్ ఉంది. ఈ క్రేజీ కాంబోపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తే మాత్రం ఫ్యాన్స్‌కు పూనకాలే అని చెప్పొచ్చు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More