మరో కొత్త వారం రాబోతుంది. ఓటీటీలో కొత్త సందడి షురూ కానుంది. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన రివాల్వర్ రీటా వచ్చే వారం డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను ఇవాళ (డిసెంబర్ 21) ఆ ప్లాట్ ఫామ్ అనౌన్స్ చేసింది. తెలుగుతో సహా నాలుగు భాషల్లో ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది.
రివాల్వర్ రీటా ఓటీటీ

కీర్తి సురేష్ ఓ వైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోవైపు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చేస్తోంది. ఇలా ఆమె హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ రివాల్వర్ రీటా. ఇదో క్రైమ్ కామెడీ థ్రిల్లర్. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ బాట పట్టనుంది. డిసెంబర్ 26 నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఆదివారం ప్రకటించారు.
తెలుగులోనూ
రివాల్వర్ రీటా మూవీ ఒరిజినల్ తమిళంలో తెరకెక్కింది. తెలుగులోనూ థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రం నవంబర్ 28న థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు రివాల్వర్ రీటా తమిళంలో పాటు తెలుగు, కన్నడ, మలయాళంలో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి జేకే చంద్రు డైరెక్టర్. ఈ సినిమాలో కీర్తి సురేష్, రాధిక, సునీల్, సెండ్రయాన్ తదితరులు నటించారు.
క్రైమ్ కామెడీ థ్రిల్లర్
క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా రిలీజైన రివాల్వర్ రీటా థియేటర్లలో పెద్దగా ఆడలేకపోయింది. స్టోరీ లైన్ బాగానే ఉన్నా దాన్ని తెరపైకి తేవడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడనే విమర్శలు వినిపించాయి. పగ, ప్రతీకారాలతో ముడిపడ్డ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ రివాల్వర్ రీటా. కర్మ ఎవరినీ విడిచిపెట్టదు అనే కాన్సెప్ట్ తో సాగుతుంది. ఎప్పుడో జరిగిన అన్యాయానికి ఇప్పుడు హీరోయిన్ ఫ్యామిలీ బదులు తీర్చుకుంటుంది.
రివాల్వర్ రీటా కథ
రీటా (కీర్తి సురేష్), ఆమె తల్లి (రాధికా శరత్ కుమార్) ఓ ఇంట్లో ఉంటారు. మరోవైపు పాండిచ్చేరిలో క్రైమ్ సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు డాన్ డ్రాకులా పాండ్యన్ (సూపర్ సుబ్బరాయన్). డ్రాకులా చేతిలో నర్సింహారెడ్డి (అజయ్ ఘోష్) బ్రదర్ హత్యకు గురవుతాడు. దీంతో డ్రాకులాను చంపాలని ఓ గ్యాంగ్ కు రూ.5 కోట్లతో డీల్ సెట్ చేస్తాడు నర్సింహారెడ్డి.
{{/usCountry}}రీటా (కీర్తి సురేష్), ఆమె తల్లి (రాధికా శరత్ కుమార్) ఓ ఇంట్లో ఉంటారు. మరోవైపు పాండిచ్చేరిలో క్రైమ్ సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు డాన్ డ్రాకులా పాండ్యన్ (సూపర్ సుబ్బరాయన్). డ్రాకులా చేతిలో నర్సింహారెడ్డి (అజయ్ ఘోష్) బ్రదర్ హత్యకు గురవుతాడు. దీంతో డ్రాకులాను చంపాలని ఓ గ్యాంగ్ కు రూ.5 కోట్లతో డీల్ సెట్ చేస్తాడు నర్సింహారెడ్డి.
{{/usCountry}}కానీ ఓ రోజు డ్రాకులా పాండ్యన్ డ్రగ్స్ మత్తులో పొరపాటున వేరే ఇంటికి వెళ్లబోయి రీటా ఇంటికి వెళ్తాడు. అక్కడ గొడవ జరుగుతుంది. రీటా తల్లి కొట్టడంతో పాండ్యన్ చనిపోతాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? డ్రాకులా కొడుకు బాబీ పాండ్యన్ (సునీల్) తన తండ్రిని చంపిన వాళ్లను కనిపెట్టాడా? అన్నది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.